Ranabali Movie Update: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’ గురించి ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ టీమ్ అనంతపురం పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేసిన భారీ షెడ్యూల్ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. దాదాపు రెండు వారాల పాటు జరిగిన ఈ షూటింగ్లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం.
అనంతపురం షెడ్యూల్ ముగిసిన సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా వేదికగా రాయలసీమ ప్రజలపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. షూటింగ్ జరిగినన్ని రోజులు అనంతపురం వాసులు చూపించిన ఆదరణ మర్చిపోలేనని, ముఖ్యంగా 'రౌడీ' ఫ్యాన్స్ చేసిన హడావిడి తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఆయన ఎమోషనల్ అయ్యారు. షూటింగ్ స్పాట్కు భారీగా తరలివచ్చిన అభిమానుల కోసం విజయ్ ప్రత్యేకంగా సమయం కేటాయించి వారితో ముచ్చటించడం విశేషం.
నిజానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్కు యూత్లో విపరీతమైన క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించడమే కాకుండా, వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు చాలా కాలం విరామం తర్వాత మళ్ళీ వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటుండడంతో ‘రణబాలి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ‘ఏందయ్యా సామీ’ అనే పాట ఇప్పటికే యూట్యూబ్లో మిలియన్ల కొద్దీ వ్యూస్తో దూసుకుపోతోంది.
దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ చిత్రాన్ని ఒక పీరియడ్ డ్రామాగా మలుస్తున్నారు. 19వ శతాబ్దపు నేపథ్యంలో, అంటే 1854 నుండి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ ఒక పవర్ఫుల్ యోధుడి పాత్రలో కనిపిస్తుండగా, రష్మిక 'జయమ్మ' అనే వైవిధ్యమైన పాత్రలో నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. పీరియడ్ బ్యాక్డ్రాప్ కావడంతో గ్రాఫిక్స్కు కూడా ఈ సినిమాలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే యాక్షన్ సీక్వెన్సులు సినిమాకే హైలైట్గా నిలుస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రమోషనల్ కంటెంట్తో రణబాలి టీమ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.