Pawan Kalyan: కూటమి ప్రభుత్వానికి అన్నగారే మార్గదర్శి: ఎన్టీఆర్ జయంతి వేళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు! Butchaiah Chowdary: మహానాడులో బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు.. పెద్ద పులి సాధువు.. చిన్న పులి ఉగ్రనరసింహం! Chandrababu: ఎన్టీఆర్ కు భారతరత్న.. మహానాడులో ఏకగ్రీవ తీర్మానం Shah Rukh Khan: మళ్లీ మొదటికొచ్చిన ‘డాన్ 3’: ప్రాజెక్ట్ నుంచి రణ్‌వీర్ అవుట్.. కింగ్ ఖాన్ షారుక్ ఇన్? Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం! AP Weather: రాబోయే మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు! నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ కీలక అప్‌డేట్! Donald Trump: ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.. హర్మూజ్ జలసంధి ఎవరి సొత్తూ కాదు.! రవాణా మార్గాన్ని మూస్తే సహించం! NTR: ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి ఉత్సవాలు: 'ఎక్స్' వేదికగా జ్ఞాపకాలను పంచుకున్న చంద్రబాబు, లోకేశ్! NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఘన నివాళులు! Revanth Reddy: తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌పై రేవంత్ కీలక ముందడుగు.. మహారాష్ట్రతో చర్చలకు తెలంగాణ సిద్ధం! Pawan Kalyan: కూటమి ప్రభుత్వానికి అన్నగారే మార్గదర్శి: ఎన్టీఆర్ జయంతి వేళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు! Butchaiah Chowdary: మహానాడులో బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు.. పెద్ద పులి సాధువు.. చిన్న పులి ఉగ్రనరసింహం! Chandrababu: ఎన్టీఆర్ కు భారతరత్న.. మహానాడులో ఏకగ్రీవ తీర్మానం Shah Rukh Khan: మళ్లీ మొదటికొచ్చిన ‘డాన్ 3’: ప్రాజెక్ట్ నుంచి రణ్‌వీర్ అవుట్.. కింగ్ ఖాన్ షారుక్ ఇన్? Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం! AP Weather: రాబోయే మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు! నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ కీలక అప్‌డేట్! Donald Trump: ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.. హర్మూజ్ జలసంధి ఎవరి సొత్తూ కాదు.! రవాణా మార్గాన్ని మూస్తే సహించం! NTR: ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి ఉత్సవాలు: 'ఎక్స్' వేదికగా జ్ఞాపకాలను పంచుకున్న చంద్రబాబు, లోకేశ్! NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఘన నివాళులు! Revanth Reddy: తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌పై రేవంత్ కీలక ముందడుగు.. మహారాష్ట్రతో చర్చలకు తెలంగాణ సిద్ధం!

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవులు, ప్రత్యేక పూజలు, వారాంతపు రద్దీ కారణంగా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.

Published : 2026-05-28 11:38:00

సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం..

300 రూ శీఘ్రదర్శనంకు 3–5 గంటల సమయం..

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవులు, ప్రత్యేక పూజలు, వారాంతపు రద్దీ కారణంగా శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. బుధవారం ఉదయం పరిస్థితి ప్రకారం ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. క్యూలైన్లు కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు కొనసాగుతున్నాయి.

టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనం పొందేందుకు సుమారు 12 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక శీఘ్రదర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు కూడా 3 నుంచి 5 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. అలాగే సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది.

ఇక నిన్న ఒక్కరోజే స్వామివారిని మొత్తం 87,691 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 49,958 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల విరాళాలతో హుండీ ఆదాయం రూ.4.99 కోట్లకు చేరింది.

తిరుమలలో ప్రసాదాల విక్రయాలు కూడా భారీగా జరిగాయి. ఒక్కరోజే 4.22 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. అన్నప్రసాదాల భవనంలో 2.52 లక్షల మంది భక్తులు ఉచిత భోజన సేవలను స్వీకరించారు. అలాగే వైద్యసేవల కోసం వచ్చిన 3,603 మంది భక్తులకు చికిత్స అందించినట్లు అధికారులు వెల్లడించారు.

భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో టీటీడీ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. క్యూలైన్లలో తాగునీరు, భోజనం, వైద్యసేవలు అందిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోంది.

Spotlight

Read More →