Pooja Hegde: పూజా హెగ్డేకు అంత పొగరా అన్న నెటిజన్లు.. సెల్ఫీ ఘటనపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్! Peddi Movie: ఏపీలో గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో బ్రేక్: జూన్ 4న సాధారణ ధరలతోనే థియేటర్లలోకి ‘పెద్ది’! Minister Savitha: 104 మంది ప్రతిభావంతుల విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు! Gummadi Sandhya Rani: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా వీధులు శుభ్రం చేసిన మంత్రి సంధ్యారాణి! TDP: మహిళా సాధికారతలో టీడీపీ చారిత్రాత్మక అడుగు.. 33 శాతం మహిళా రిజర్వేషన్‌తో కొత్త దిశ! Operation Sindoor: అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధం.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! Noro Virus: అమెరికాను వణికిస్తున్న సరికొత్త మహమ్మారి..వేగంగా విస్తరిస్తున్న 'నోరోవైరస్'! New Pensions: ఏపీ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్... కొత్తగా 5,606 మందికి పెన్షన్లు!! Palla Srinivasa Rao: గాజువాక సమస్యలపై దిశా సమావేశంలో పల్లా! Pooja Hegde: పూజా హెగ్డేకు అంత పొగరా అన్న నెటిజన్లు.. సెల్ఫీ ఘటనపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్! Peddi Movie: ఏపీలో గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో బ్రేక్: జూన్ 4న సాధారణ ధరలతోనే థియేటర్లలోకి ‘పెద్ది’! Minister Savitha: 104 మంది ప్రతిభావంతుల విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు! Gummadi Sandhya Rani: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా వీధులు శుభ్రం చేసిన మంత్రి సంధ్యారాణి! TDP: మహిళా సాధికారతలో టీడీపీ చారిత్రాత్మక అడుగు.. 33 శాతం మహిళా రిజర్వేషన్‌తో కొత్త దిశ! Operation Sindoor: అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధం.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! Noro Virus: అమెరికాను వణికిస్తున్న సరికొత్త మహమ్మారి..వేగంగా విస్తరిస్తున్న 'నోరోవైరస్'! New Pensions: ఏపీ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్... కొత్తగా 5,606 మందికి పెన్షన్లు!! Palla Srinivasa Rao: గాజువాక సమస్యలపై దిశా సమావేశంలో పల్లా!

Chandrababu: వైసీపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ”గా ప్రజల్లో చర్చ!

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో నిర్వహించిన చిట్‌చాట్‌లో వైసీపీ, జగన్ కుటుంబ రాజకీయాలపై తీవ్ర విమర్శలు చేశారు.

Published : 2026-05-30 14:08:00

ప్రజాస్వామ్యంలో గొడ్డలి రాజకీయాలకు స్థానం లేదు : చంద్రబాబు..

వైఎస్ కుటుంబ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి : చంద్రబాబు..

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో నిర్వహించిన చిట్‌చాట్‌లో వైసీపీ, జగన్ కుటుంబ రాజకీయాలపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు “సైకో” కంటే “గొడ్డలి పార్టీ” అనే అంశాన్ని బలంగా గుర్తిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల్లో ఈ అంశం మరింతగా చర్చకు వస్తుండటంతో జగన్‌లో అసహనం, ఫ్రస్టేషన్ పెరుగుతోందని అన్నారు.

వైఎస్ కుటుంబానికి సంబంధించిన అనేక అరాచకాలు తనకు కూడా పూర్తిగా తెలియవని, ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. దాదాపు 30 ఏళ్ల క్రితం కడప జిల్లాలో ప్రచురితమైన “పాలెగాళ్ల రాజ్యం” అనే పుస్తకాన్ని ఇప్పుడు ప్రజలు మళ్లీ చదువుతున్నారని చెప్పారు. ఆ పుస్తకంలో అప్పట్లోనే కొన్ని వాస్తవాలు బయటపెట్టారని గుర్తుచేశారు.

ప్రజాస్వామ్యంలో హింసాత్మక రాజకీయాలకు స్థానం లేదని సీఎం స్పష్టం చేశారు. “నక్సలైట్లు గన్‌తో రాజ్యాధికారాన్ని సాధించలేరు… అలాగే గొడ్డలితో రాజకీయాలు చేయలేరు” అంటూ వ్యాఖ్యానించారు. అందుకే వైసీపీ ప్రజాస్వామ్యానికి పనికిరాని పార్టీగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు.

వివేకానందరెడ్డి హత్య కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ కేసులో సునీత చేస్తున్న పోరాటంలో న్యాయం, ధర్మం ఉన్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. “తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు సునీతకు ఉంది కదా” అని ప్రశ్నించారు. సునీత పోరాటం వల్లే వివేకా హత్య కేసు ఇప్పటికీ సజీవంగా ఉందని పేర్కొన్నారు.

హత్యా రాజకీయాలు చేసినవారు రాష్ట్రాన్ని పాలించవచ్చా? కానీ బాధితులు జిల్లా రాజకీయాలు కూడా చేయకూడదా? అని సీఎం ప్రశ్నించారు. ఇప్పటి యువతకు కూడా వైఎస్ కుటుంబ హత్యా రాజకీయాల గురించి అర్థమవుతోందని, జగన్ కుటుంబ చరిత్ర ఇప్పుడు ప్రజలకు పూర్తిగా తెలిసిపోయిందని చంద్రబాబు అన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

Spotlight

Read More →