Lockdown: దేశంలో మరో లాక్‌డౌన్ గండం... ఏ ఏ వాటిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే! Air India: ప్రయాణికులకు అలర్ట్... రోజుకు 100 ఎయిర్ ఇండియా విమానాలు రద్దు!! Gold Price Hike: వెండి, బంగారంపై కేంద్రం కీలక నిర్ణయం... ఆకాశానికి అంటిన ధరలు.!! Chicken Prices: చికెన్ ప్రియులకు షాక్.. ఎండల దెబ్బకు పడిపోయిన సరఫరా, ఆకాశాన్నంటుతున్న ధరలు! Oushadhi Express: హైదరాబాద్ టు ముంబై... పట్టాలెక్కిన దేశపు తొలి ఫార్మా రైలు 'ఔషధి ఎక్స్‌ప్రెస్'! Fuel Price Hike: మళ్ళీ ఇంధన వాత! భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు... PM Modi: ప్రధాని మోదీ పిలుపుతో కుప్పకూలిన విమానయాన షేర్లు! Crude Oil: ముడి చమురు ధరల షాక్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు! BSNL plan: బీఎస్ఎన్ఎల్ సరికొత్త చవక ప్లాన్.. 28 రోజులు కాదు, ఏకంగా 30 రోజుల వ్యాలిడిటీ! 75 జీబీ డేటా.. Air India: ఎయిర్ ఇండియాలో భారీ ప్రక్షాళన.... మూడేళ్లలో 1000 మంది ఉద్యోగులపై వేటు! Lockdown: దేశంలో మరో లాక్‌డౌన్ గండం... ఏ ఏ వాటిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే! Air India: ప్రయాణికులకు అలర్ట్... రోజుకు 100 ఎయిర్ ఇండియా విమానాలు రద్దు!! Gold Price Hike: వెండి, బంగారంపై కేంద్రం కీలక నిర్ణయం... ఆకాశానికి అంటిన ధరలు.!! Chicken Prices: చికెన్ ప్రియులకు షాక్.. ఎండల దెబ్బకు పడిపోయిన సరఫరా, ఆకాశాన్నంటుతున్న ధరలు! Oushadhi Express: హైదరాబాద్ టు ముంబై... పట్టాలెక్కిన దేశపు తొలి ఫార్మా రైలు 'ఔషధి ఎక్స్‌ప్రెస్'! Fuel Price Hike: మళ్ళీ ఇంధన వాత! భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు... PM Modi: ప్రధాని మోదీ పిలుపుతో కుప్పకూలిన విమానయాన షేర్లు! Crude Oil: ముడి చమురు ధరల షాక్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు! BSNL plan: బీఎస్ఎన్ఎల్ సరికొత్త చవక ప్లాన్.. 28 రోజులు కాదు, ఏకంగా 30 రోజుల వ్యాలిడిటీ! 75 జీబీ డేటా.. Air India: ఎయిర్ ఇండియాలో భారీ ప్రక్షాళన.... మూడేళ్లలో 1000 మంది ఉద్యోగులపై వేటు!

Lockdown: దేశంలో మరో లాక్‌డౌన్ గండం... ఏ ఏ వాటిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే!

Lockdown: ఒకవేళ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి వస్తే, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడానికి రైల్వేలు మరియు ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి, మిగిలిన వాహనాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని సమాచారం.

Published : 2026-05-13 16:46:00

Business- రూపాయి పతనం.. ఆర్థిక సంక్షోభం: భారత్ ఎటు వైపు…

విదేశీ వస్తువులకు దూరం.. పొదుపుకు సిద్ధం: ప్రధాని ఏడు సూత్రాల వెనుక అంతరార్థం…

పెట్రోల్, డీజిల్ వినియోగంపై ఆంక్షలు? – గ్యాస్ వాడకం తగ్గించాల్సిందేనా!

Lockdown: భారతదేశం మరోసారి తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తుందా అన్న అనుమానాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను చర్చకు దారితీస్తున్నాయి. గతంలో కరోనా సమయంలో విధించిన లాక్‌డౌన్ లాంటి పరిస్థితులు మళ్లీ వస్తాయా అని సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు చేసిన ఏడు విజ్ఞప్తులు ఈ చర్చకు ప్రధాన కారణమయ్యాయి. రూపాయి విలువ పతనం కావడం, విదేశీ కరెన్సీ నిల్వలు తగ్గిపోతుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రధానమంత్రి చేసిన అభ్యర్థనలను గమనిస్తే, విదేశీ దిగుమతులను తగ్గించుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బంగారం కొనవద్దని, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని ఆయన కోరారు. ఇవన్నీ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసే చర్యలుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రజలు స్వచ్ఛందంగా వీటిని పాటించకపోతే, ప్రభుత్వం బలవంతంగా ఆంక్షలు విధించి వినియోగాన్ని నియంత్రించే అవకాశం ఉందని, తద్వారా పరోక్షంగా ఒక 'ఆర్థిక లాక్‌డౌన్' వచ్చే సూచనలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితికి ప్రధానంగా సాఫ్ట్‌వేర్ రంగంలో వస్తున్న మార్పులు కూడా తోడయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాల కోత విధిస్తుండటంతో, విదేశాల నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోయింది. గతంలో మధ్యతరగతి ప్రజలు ఐటీ ఉద్యోగాల ద్వారా పొందిన జీతాలతో ఈఎంఐలు చెల్లించేవారు. కానీ ఇప్పుడు ఉద్యోగాలు పోతుండటంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. బ్యాంకు అప్పులు తీర్చలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభావం మార్కెట్లో నగదు లభ్యతపై తీవ్రంగా పడుతోంది.

ఒకవేళ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి వస్తే, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడానికి రైల్వేలు మరియు ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి, మిగిలిన వాహనాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని సమాచారం. దీనివల్ల పెట్రోల్ బంకులు, రవాణా రంగంపై ఆధారపడిన లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, శుభకార్యాల మీద కూడా ఆంక్షలు విధిస్తే క్యాటరింగ్, డెకరేషన్ వంటి రంగాలు కుప్పకూలుతాయి.

కరోనా కాలంలో విధించిన లాక్‌డౌన్ సమయంలో ప్రజల దగ్గర ఎంతో కొంత పొదుపు డబ్బు ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరూ వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు మరియు హోమ్ లోన్ల భారంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆర్థికంగా లాక్‌డౌన్ లాంటి పరిస్థితులు తలెత్తితే అది సామాన్యుడికి శాపంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ ఆర్థిక మూలాలను కాపాడుకోవడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలు సామాన్యుడి బతుకును దెబ్బతీయకూడదని ప్రజలు కోరుకుంటున్నారు.

Spotlight

Read More →