Crude Oil: భారత్ లో బయటపడ్డ చమురు నిల్వలు... ఇక మనకు కష్టాలుండవు! Air India: ఎయిరిండియా కీలక నిర్ణయం: జులై, ఆగస్టు నెలల్లో 20 శాతం వరకు దేశీయ విమాన సర్వీసుల్లో కోత! Jio Recharge Plan: జియో సంచలన ఆఫర్... కేవలం రూ.200 కే 15 ప్రీమియం ఓటీటీలు ఉచితం! India-Canada: భారత్-కెనడా ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతం.. మంత్రి పీయూష్ గోయల్! Gold Rates: ట్రంప్ ప్రకటనతో గోల్డ్ మార్కెట్ క్రాష్... తులం బంగారం ఎంతంటే!! Crude oil: సౌదీని వెనక్కి నెట్టిన వెనెజులా.. యూఏఈ, రష్యాల టాప్ ప్లేస్: చమురు దిగుమతుల్లో ఆసక్తికర మార్పులు! భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా.. Gold Rate Today: అంతర్జాతీయ ఉద్రిక్తతలతో కమోడిటీ మార్కెట్ అతలాకుతలం: పసిడి పతనానికి గల కారణాలు ఇవే! CNG Price Hike: పెట్రోల్‌ను దాటేలా ఉందిగా... రెక్కలొచ్చిన సీఎన్‌జీ ధరలు! సామాన్యుడి గుండె గుభేల్! LPG: గ్యాస్ వినియోగదారులకు కొత్త రూల్... ఇక నుండి అవి ఉంటే ఎల్‌పీజీ రద్దు! Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Crude Oil: భారత్ లో బయటపడ్డ చమురు నిల్వలు... ఇక మనకు కష్టాలుండవు! Air India: ఎయిరిండియా కీలక నిర్ణయం: జులై, ఆగస్టు నెలల్లో 20 శాతం వరకు దేశీయ విమాన సర్వీసుల్లో కోత! Jio Recharge Plan: జియో సంచలన ఆఫర్... కేవలం రూ.200 కే 15 ప్రీమియం ఓటీటీలు ఉచితం! India-Canada: భారత్-కెనడా ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతం.. మంత్రి పీయూష్ గోయల్! Gold Rates: ట్రంప్ ప్రకటనతో గోల్డ్ మార్కెట్ క్రాష్... తులం బంగారం ఎంతంటే!! Crude oil: సౌదీని వెనక్కి నెట్టిన వెనెజులా.. యూఏఈ, రష్యాల టాప్ ప్లేస్: చమురు దిగుమతుల్లో ఆసక్తికర మార్పులు! భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా.. Gold Rate Today: అంతర్జాతీయ ఉద్రిక్తతలతో కమోడిటీ మార్కెట్ అతలాకుతలం: పసిడి పతనానికి గల కారణాలు ఇవే! CNG Price Hike: పెట్రోల్‌ను దాటేలా ఉందిగా... రెక్కలొచ్చిన సీఎన్‌జీ ధరలు! సామాన్యుడి గుండె గుభేల్! LPG: గ్యాస్ వినియోగదారులకు కొత్త రూల్... ఇక నుండి అవి ఉంటే ఎల్‌పీజీ రద్దు! Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్!

India-Canada: భారత్-కెనడా ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతం.. మంత్రి పీయూష్ గోయల్!

India-Canada: కెనడాలో భారత్‌-కెనడా ఆర్థిక భాగస్వామ్యంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య నమ్మకం మరింత బలపడుతున్న నేపథ్యంలో, భవిష్యత్‌లో భారత్‌-కెనడా ఆర్థిక సంబంధాలు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Published : 2026-05-27 12:23:00

భారత్-కెనడా వాణిజ్య సంబంధాలకు విశ్వాసమే బలం..

సీఈపీఏతో భారత్-కెనడా మధ్య కొత్త పెట్టుబడి అవకాశాలు..

కెనడాలో భారత్‌-కెనడా ఆర్థిక భాగస్వామ్యంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య నమ్మకం మరింత బలపడుతున్న నేపథ్యంలో, భవిష్యత్‌లో భారత్‌-కెనడా ఆర్థిక సంబంధాలు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

టొరంటోలో జరిగిన ‘ఫ్రం పొలిటికల్ రీసెట్ టు కమర్షియల్ డెలివరీ’ అనే మంత్రుల స్థాయి సమావేశంలో పాల్గొన్న పీయూష్ గోయల్, భారత్‌-కెనడా సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు. పరస్పర విశ్వాసం పెరగడంతో వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో కొత్త అవకాశాలు తెరుచుకుంటున్నాయని తెలిపారు.

భారత్‌-కెనడా మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలు మరింత విస్తరించడమే కాకుండా, పలు రంగాల్లో సహకారానికి కొత్త మార్గాలు ఏర్పడతాయని చెప్పారు.

భారత్‌-కెనడా సంబంధాల బలానికి వైవిధ్యమే ప్రధాన కారణమని గోయల్ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న అనుబంధం, వ్యాపార సహకారం, విద్యా మరియు సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యం ఈ సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నాయని అన్నారు.

భారత ఆర్థిక వ్యవస్థపై కూడా పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే మూడు దశాబ్దాల పాటు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ పెట్టుబడిదారులకు భారత్ విశ్వసనీయ భాగస్వామిగా మారిందని, భవిష్యత్‌లో మరిన్ని అంతర్జాతీయ అవకాశాలు దేశానికి లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

Spotlight

Read More →