FASTag: వాహనదారులకు షాక్... ఏప్రిల్ 1 నుండి పెరగనున్న టోల్ ఛార్జీలు! Devbhoomi Yatra: దేవభూమి యాత్ర.. 14 రోజుల్లో ఉత్తర భారత పుణ్యక్షేత్రాల దర్శనం! వివరాలు ఇవే! Qatar Airways: ఖతార్ ఎయిర్‌వేస్ సంచలనం: 17 గంటల ఏకధాటి ప్రయాణంతో కొత్త విమాన మార్గాలు! Srisailam Accident: శ్రీశైలం టోల్ గేట్ వద్ద వాహన బీభత్సం... భక్తులపైకి దూసుకెళ్లిన కారు! APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో వస్తువులు మరిచిపోయారా? ఇక టెన్షన్ వద్దు.. కొత్త సిస్టమ్ రెడీ! IRCTC: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ.14,500 కే అవి అన్నీ చుట్టిరావచ్చు! Air India: ఫుకెట్ ఎయిర్‌పోర్టులో కలకలం..! టైర్ ఊడటంతో అదుపుతప్పిన విమానం! PAN-PAN: 'పాన్-పాన్' అలర్ట్ జారీ చేసిన పైలట్లు... ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్! Road Accident: మామండూరు వద్ద ఘోర ప్రమాదం... సమయస్ఫూర్తితో ఐదుగురిని కాపాడిన 108 సిబ్బంది! Amrit Bharat Express: రైల్వే రంగంలో కొత్త విప్లవం... ఇకనుండి ఆ రూట్లో కూడా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్! FASTag: వాహనదారులకు షాక్... ఏప్రిల్ 1 నుండి పెరగనున్న టోల్ ఛార్జీలు! Devbhoomi Yatra: దేవభూమి యాత్ర.. 14 రోజుల్లో ఉత్తర భారత పుణ్యక్షేత్రాల దర్శనం! వివరాలు ఇవే! Qatar Airways: ఖతార్ ఎయిర్‌వేస్ సంచలనం: 17 గంటల ఏకధాటి ప్రయాణంతో కొత్త విమాన మార్గాలు! Srisailam Accident: శ్రీశైలం టోల్ గేట్ వద్ద వాహన బీభత్సం... భక్తులపైకి దూసుకెళ్లిన కారు! APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో వస్తువులు మరిచిపోయారా? ఇక టెన్షన్ వద్దు.. కొత్త సిస్టమ్ రెడీ! IRCTC: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ.14,500 కే అవి అన్నీ చుట్టిరావచ్చు! Air India: ఫుకెట్ ఎయిర్‌పోర్టులో కలకలం..! టైర్ ఊడటంతో అదుపుతప్పిన విమానం! PAN-PAN: 'పాన్-పాన్' అలర్ట్ జారీ చేసిన పైలట్లు... ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్! Road Accident: మామండూరు వద్ద ఘోర ప్రమాదం... సమయస్ఫూర్తితో ఐదుగురిని కాపాడిన 108 సిబ్బంది! Amrit Bharat Express: రైల్వే రంగంలో కొత్త విప్లవం... ఇకనుండి ఆ రూట్లో కూడా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్!

Driving Reform: టెస్ట్ లేకుండానే లైసెన్స్‌..! ఏపీలో కొత్త డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల ఆమోదం..!

 ఆంధ్రప్రదేశ్‌లో డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. సరైన శిక్షణ లేకుండా లైసెన్సులు

Published : 2025-11-10 10:12:00
Jonty Rhodes: ఢిల్లీ వాయు కాలుష్యంపై జాంటీ రోడ్స్ ఆందోళన... ఇలా శ్వాసించడం కష్టం!

ఆంధ్రప్రదేశ్‌లో డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. సరైన శిక్షణ లేకుండా లైసెన్సులు పొందడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని గుర్తించిన రవాణా శాఖ, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని నిర్ణయించింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 53 డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు (డీటీసీలు) మరియు 5 ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు (ఆర్‌డీటీసీలు) ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, లైసెన్సుల జారీ వ్యవస్థలో పూర్తిస్థాయి పారదర్శకత నెలకొననుంది.

ఆ ప్రాంతానికి మహర్దశ ! రూ.5000 కోట్ల పెట్టుబడితో మెగా ఫార్మా ప్రాజెక్ట్... 532 ఎకరాల భూమి!

కొత్త విధానం ప్రకారం డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులు ఇకపై రవాణా శాఖ కార్యాలయాల్లో డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. డీటీసీ నుండి పొందిన శిక్షణ సర్టిఫికెట్ ఆధారంగా వారికి నేరుగా లైసెన్స్ మంజూరు చేస్తారు. ఈ శిక్షణ కేంద్రాల్లో ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రక్కులు వంటి అన్ని రకాల వాహనాల డ్రైవింగ్ నేర్పిస్తారు. తరగతి గదుల్లో ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం, ఆధునిక సిమ్యులేటర్లపై ప్రాక్టీస్ చేయించడం, ప్రత్యేకంగా రూపొందించిన ట్రాక్‌లపై డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమంలో భాగమవుతుంది. లైసెన్సు రకం ఆధారంగా శిక్షణ కాలం, ఫీజు మొదలైన అంశాలను కేంద్ర రవాణా శాఖ నిర్ణయించనుంది.

Health Safety: ఇక మందు కొనేముందు స్కాన్ చేయండి..! నిజమో నకిలీదో ఒక్క క్లిక్‌లో..!

రాష్ట్రంలో ప్రతిపాదిత 5 ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను (ఆర్‌డీటీసీలు) ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. వీటిలో శిక్షణ పొందిన వారికి అదనపు సౌకర్యాలు లభిస్తాయి. వారు లైసెన్సు కోసం ప్రత్యేకంగా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, శిక్షణ పూర్తయ్యే వెంటనే అక్కడికక్కడే లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకుని పొందవచ్చు. దీంతో సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయి. అంతేకాకుండా, ప్రామాణిక శిక్షణతో నైపుణ్యం కలిగిన డ్రైవర్లు పెరగడం ద్వారా రోడ్డు భద్రత కూడా గణనీయంగా మెరుగుపడుతుంది.

AP Forest News: ఆపరేషన్ ‘కగార్’ తరహాలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక!!

ఈ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందిస్తోంది. ఒక్కో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం (డీటీసీ) ఏర్పాటుకు కనీసం 2 ఎకరాల స్థలం అవసరం కాగా, దానిలో అయ్యే మొత్తం ఖర్చులో 85% (గరిష్టంగా రూ.2.5 కోట్లు) వరకు కేంద్రం భరిస్తుంది. అలాగే, ఆర్‌డీటీసీ స్థాపనకు 3 ఎకరాల భూమి అవసరం కాగా, ఒక్కో కేంద్రానికి రూ.5 కోట్లు వరకు సబ్సిడీ ఇస్తోంది. ఇప్పటివరకు ఎన్టీఆర్, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల నుంచి రెండేసి దరఖాస్తులు అందగా, అనంతపురం, తిరుపతి, కృష్ణా, పశ్చిమగోదావరి, బాపట్ల, కాకినాడ జిల్లాల నుంచి ఒక్కో దరఖాస్తు వచ్చింది. అనంతపురంలోని ఒక డీటీసీకి ఇప్పటికే కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే ఆర్‌డీటీసీలకు ఇంకా దరఖాస్తులు రాలేదు. జనవరి చివరి వరకు దరఖాస్తులు స్వీకరించి, ఫిబ్రవరి నాటికి కేంద్రానికి పంపనున్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించనున్నాయి.

Trump: ట్రంప్ కీలక ప్రకటన! ప్రతి అమెరికన్‌కు 2వేల డాల‌ర్లు....
Washington: టారిఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నవారు ఫూల్స్... అమెరికన్లకు $2,000 డివిడెండ్‌ ప్రకటించనున్న ట్రంప్‌!!
Gold Rates: స్థిరంగా బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే!
Praja Vedika: నేడు (10/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ పథకం మళ్లీ ప్రారంభం... ఆ ఇళ్ళు,స్థలాలు మీ సొంతం!
Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..!

Spotlight

Read More →