Dangerous Railway Tracks: ప్రపంచంలోని 7 అత్యంత భయంకరమైన రైలు మార్గాలు! Largest Waterfall: ఆర్కిటిక్ లోతుల్లో దాగి ఉన్న డెన్మార్క్ స్ట్రెయిట్ కాటరాక్ట్.. భూమిపైనే అతిపెద్ద నీటి ప్రవాహం! NHAI: వాహనదారులకు గుడ్ న్యూస్.. టోల్ గేట్ల వద్ద ఇక ఆగాల్సిన పనిలేదు! Indian Railways: విశాఖపట్నం - కొల్లం ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ విడుదల.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే? Papikondalu trip: పర్యాటకులకు చేదువార్త: పాపికొండల విహారయాత్ర తాత్కాలికంగా నిలిపివేత! Indigo Flight: ఇండిగో విమానంలో పేలిన పవర్ బ్యాంక్! దట్టమైన పొగతో మంటలు! Hanta virus: క్రూయిజ్ షిప్‌లో ‘హంటావైరస్’ కలకలం: ముగ్గురు మృతి.. సాయం కోసం ఆర్తనాదాలు! Summer vacation: థాయ్‌లాండ్ సీక్రెట్ స్పాట్స్... సమ్మర్‌లో ప్రశాంతంగా ట్రావెల్ చేయాలనుకుంటే ఇవే బెస్ట్!! Road Accident: తిరుపతి హైవేపై ఘోర ప్రమాదం! లారీని ఢీకొన్న అంబులెన్స్.. నలుగురు బలి!! Thailand Tourism: థాయ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? విదేశీ కార్మికులకు కూడా వర్తించే కొత్త రూల్.. ఇది ఉండాల్సిందే! Dangerous Railway Tracks: ప్రపంచంలోని 7 అత్యంత భయంకరమైన రైలు మార్గాలు! Largest Waterfall: ఆర్కిటిక్ లోతుల్లో దాగి ఉన్న డెన్మార్క్ స్ట్రెయిట్ కాటరాక్ట్.. భూమిపైనే అతిపెద్ద నీటి ప్రవాహం! NHAI: వాహనదారులకు గుడ్ న్యూస్.. టోల్ గేట్ల వద్ద ఇక ఆగాల్సిన పనిలేదు! Indian Railways: విశాఖపట్నం - కొల్లం ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ విడుదల.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే? Papikondalu trip: పర్యాటకులకు చేదువార్త: పాపికొండల విహారయాత్ర తాత్కాలికంగా నిలిపివేత! Indigo Flight: ఇండిగో విమానంలో పేలిన పవర్ బ్యాంక్! దట్టమైన పొగతో మంటలు! Hanta virus: క్రూయిజ్ షిప్‌లో ‘హంటావైరస్’ కలకలం: ముగ్గురు మృతి.. సాయం కోసం ఆర్తనాదాలు! Summer vacation: థాయ్‌లాండ్ సీక్రెట్ స్పాట్స్... సమ్మర్‌లో ప్రశాంతంగా ట్రావెల్ చేయాలనుకుంటే ఇవే బెస్ట్!! Road Accident: తిరుపతి హైవేపై ఘోర ప్రమాదం! లారీని ఢీకొన్న అంబులెన్స్.. నలుగురు బలి!! Thailand Tourism: థాయ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? విదేశీ కార్మికులకు కూడా వర్తించే కొత్త రూల్.. ఇది ఉండాల్సిందే!

Kathmandu: కాఠ్‌మాండులో విమానంలో మంటలు.. తృటిలో తప్పిన విమాన ప్రమాదం!

Kathmandu: నేపాల్ రాజధాని కాఠ్‌మాండులో పెను విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఇస్తాంబుల్ నుంచి వచ్చిన ఎయిర్‌బస్-300 విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Published : 2026-05-11 12:56:00

ల్యాండింగ్ సమయంలో ఎయిర్‌బస్‌లో మంటలు..

కాఠ్‌మాండూ విమానాశ్రయంలో ఉద్రిక్తత..

నేపాల్ రాజధాని కాఠ్‌మాండులో పెను విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఇస్తాంబుల్ నుంచి వచ్చిన ఎయిర్‌బస్-300 విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే విమాన సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

విమానాశ్రయ అధికారుల వివరాల ప్రకారం, విమానం కాఠ్‌మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా కుడివైపు ల్యాండింగ్ గేర్ వద్ద మంటలు కనిపించాయి. వెంటనే పైలట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించగా, ఎయిర్‌పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు.

మరోవైపు, విమాన సిబ్బంది చాకచక్యంగా స్పందించి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారానే ప్రయాణికులను వేగంగా బయటకు దించారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 277 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అందరూ క్షేమంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్టైంది.

అగ్నిమాపక సిబ్బంది కొద్ది నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తీసుకురావడంతో పరిస్థితి సాధారణమైంది. ఈ ఘటనతో విమానాశ్రయంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై విమానాశ్రయ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక లోపమే మంటలకు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Spotlight

Read More →