భారత్ అభివృద్ధి చేసిన నగదు చెల్లింపుల వ్యవస్థ 'యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్'(UPI) సేవలు ఫ్రాన్స్లోనూ ప్రారంభమయ్యాయి.
తొలుత ప్రఖ్యాత పర్యాటక కేంద్రం 'ఈఫిల్ టవర్ (Eiffel Tower)' టికెట్ల బుకింగ్కు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఫ్రాన్స్లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది.
'UPI'ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆలోచనను అమలు చేసినట్లు ట్వీట్ చేసింది.
స్థానికంగా UPI సేవలను ప్రారంభించేందుకు ఇరుదేశాలు అంగీకరించినట్లు గతేడాది ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ సేవలు భారత పర్యాటకులకు పెద్దఎత్తున ఉపయుక్తం కానున్నాయి.
ఈఫిల్ టవర్ను సందర్శించాలనుకునే భారతీయులు ఇకనుంచి ఆన్లైన్లో UPI చెల్లింపుల ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెల్లడించింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
క్రమంగా సేవలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఎన్పీసీఐ'కి చెందిన ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL)... ఫ్రాన్స్కు చెందిన లీరా సంస్థ భాగస్వామ్యంతో ఈ సేవలను ప్రవేశపెట్టింది.
'ఎన్పీసీఐ' 2016లో 21 బ్యాంకులతో కలిసి ఈ వ్యవస్థను భారత్లో అందుబాటులోకి తెచ్చింది.
ఈ సేవలకు విశేష ఆదరణ లభించింది. యూఏఈ, భూటాన్, నేపాల్ వంటి దేశాల్లో ఇప్పటికే UPI సేవలు కొనసాగుతున్నాయి.
అమెరికా, ఐరోపా, పశ్చిమ ఆసియా దేశాల్లో ఈ చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు చర్చలు జరుపుతోంది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి