IPS Arrest: ఏపీలో ఐపీఎస్ అధికారుల వరుస సస్పెన్షన్లు...! వెనుక అసలు కథ ఇదే..! Sujala Sravanthi: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి.. రూ.600 కోట్ల నిధులు! 30 లక్షల మందికి తాగునీరు.. మంత్రి నిమ్మల! Modi: అమెరికా నమ్మకద్రోహం.. మోదీ రక్షణ కోరుతున్న అరబ్ నాయకులు! IronDome: ఐరన్ డోమ్ టెక్నాలజీ ఇక భారత్ సొంతం...! రక్షణ రంగంలో సరికొత్త విప్లవం! MLC Greeshma: వైసీపీ హయాంలో వ్యవస్థల నిర్వీర్యం! చంద్రబాబు నేతృత్వంలో పునర్వైభవం... ఎమ్మెల్సీ గ్రీష్మ! Mining Scam: మైనింగ్ వివాదంలో అధికారుల నిర్లక్ష్యం..! అటవీ శాఖ సమన్లు జారీ! Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం కేసు బిగ్ అప్డేట్! కీలక నిందితుడు అరెస్ట్.... Greenfield Highway: విజయవాడ - బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే... శరవేగంగా స్వరంగ పనులు! ఇక దూసుకెళ్ళిపోవచ్చు! MGNREGA: ఏపీకి కేంద్రం తీపి కబురు! 37 మండలాల్లో 150 వరకు... లిస్ట్ ఇదే! AP GreenField Highway: హైదరాబాద్ టు వైజాగ్.. ఇక గాలిలో తేలినట్లే! కొత్త హైవేతో 56 కిలోమీటర్ల దూరం.. IPS Arrest: ఏపీలో ఐపీఎస్ అధికారుల వరుస సస్పెన్షన్లు...! వెనుక అసలు కథ ఇదే..! Sujala Sravanthi: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి.. రూ.600 కోట్ల నిధులు! 30 లక్షల మందికి తాగునీరు.. మంత్రి నిమ్మల! Modi: అమెరికా నమ్మకద్రోహం.. మోదీ రక్షణ కోరుతున్న అరబ్ నాయకులు! IronDome: ఐరన్ డోమ్ టెక్నాలజీ ఇక భారత్ సొంతం...! రక్షణ రంగంలో సరికొత్త విప్లవం! MLC Greeshma: వైసీపీ హయాంలో వ్యవస్థల నిర్వీర్యం! చంద్రబాబు నేతృత్వంలో పునర్వైభవం... ఎమ్మెల్సీ గ్రీష్మ! Mining Scam: మైనింగ్ వివాదంలో అధికారుల నిర్లక్ష్యం..! అటవీ శాఖ సమన్లు జారీ! Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం కేసు బిగ్ అప్డేట్! కీలక నిందితుడు అరెస్ట్.... Greenfield Highway: విజయవాడ - బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే... శరవేగంగా స్వరంగ పనులు! ఇక దూసుకెళ్ళిపోవచ్చు! MGNREGA: ఏపీకి కేంద్రం తీపి కబురు! 37 మండలాల్లో 150 వరకు... లిస్ట్ ఇదే! AP GreenField Highway: హైదరాబాద్ టు వైజాగ్.. ఇక గాలిలో తేలినట్లే! కొత్త హైవేతో 56 కిలోమీటర్ల దూరం..

Waste to Energy: తిరుపతిలో చెత్తతో విద్యుత్తు ఉత్పత్తి..! 12 మెగావాట్ల ప్రాజెక్ట్‌కి శ్రీకారం..!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతి సమీపంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసే యోచనను మళ్లీ ముందుకు తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను మొ

Published : 2025-10-20 15:42:00
పుదీనా-అల్లం టీ మ్యాజిక్.. జీర్ణ సమస్యల నుంచి కీళ్ల నొప్పుల వరకు.. ఎన్నో వ్యాధులకు చెక్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతి సమీపంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసే యోచనను మళ్లీ ముందుకు తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను మొదటిసారిగా 2016లో ప్రతిపాదించారు. అప్పట్లో రూ.100 కోట్ల వ్యయంతో 12 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిందాల్ కంపెనీతో ఒప్పందం కూడా కుదిరింది. అయితే సరైన స్థలం లభించక ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సాయంతో ఈ ప్రాజెక్ట్‌ను మళ్లీ ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. జూలైలో ప్రభుత్వం తిరుపతి క్లస్టర్ పరిధిలో 33 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని ఆదేశాలు ఇచ్చింది. పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ విషయంలో అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించడంతో సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

బీపీ అదుపులో ఉండాలంటే.. ఉప్పుకు బదులు ఈ 5 ఆహారాలు తీసుకోండి! ఇలా చేసి చూడండి!

ఈ ప్రాజెక్ట్ పూర్తయితే తిరుపతి నగరంలో చెత్త సమస్యకు పెద్దఎత్తున పరిష్కారం లభిస్తుంది. చెత్తను విద్యుత్తుగా మార్చే ఈ సాంకేతికత పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. ప్లాంట్‌లో చెత్తను ముందుగా తూకం వేసి, లోహాలు, ప్లాస్టిక్, టైర్లు, గాజు వంటి మండని పదార్థాలను వేరు చేస్తారు. మిగిలిన మండదగిన చెత్తను ప్రత్యేక నిల్వ కేంద్రంలో ఉంచి, అక్కడ తడి తగ్గిన తర్వాత బాయిలర్‌లోకి పంపిస్తారు. బాయిలర్‌లో మండినప్పుడు ఉత్పత్తి అయ్యే ఆవిరి శక్తిని విద్యుత్తుగా మారుస్తారు. ఆ విద్యుత్తును ఏపీఎస్పీడీసీఎల్‌ గ్రిడ్‌కి అనుసంధానం చేస్తారు.

Picture Puzzle: పిక్చర్ పజిల్ ఛాలెంజ్! 25 సెకన్లలో మూడు తేడాలు కనిపెట్టగలరా!

ఈ ప్రక్రియలో పర్యావరణానికి హాని లేకుండా వాయువులను శుద్ధి చేసే ఫ్లూగ్యాస్ క్లీనింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తారు. స్లాక్డ్ లైమ్‌, యాక్టివేటెడ్ కార్బన్‌ వంటి పదార్థాలతో వాయువులను శుద్ధి చేసి 65 మీటర్ల ఎత్తులో ఉన్న పొగగొట్టం ద్వారా బయటకు వదులుతారు. చెత్త కాలిన తర్వాత మిగిలే 14 శాతం ఫ్లైయాష్‌ను రోజుకు 7,500 ఇటుకల తయారీలో ఉపయోగించవచ్చు. దీంతో చెత్త సమస్యను పరిష్కరించడంతో పాటు, నిర్మాణ రంగానికి కూడా సహకారం లభిస్తుంది.

APRTC ఉద్యోగులకు దీపావళి కానుక..! పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

ఈ ప్లాంట్‌ 12 మెగావాట్ల సామర్థ్యంతో ఉండనుంది. రోజుకు 600 మెట్రిక్ టన్నుల చెత్త అవసరం అవుతుంది. తిరుపతి నగరంలోనే 227 మెట్రిక్ టన్నుల చెత్త లభిస్తుంది. ఇందులో 90 మెట్రిక్ టన్నులను ఈ ప్లాంట్‌కి తరలిస్తారు. మిగతా చెత్తను చంద్రగిరి, పరిసర ప్రాంతాల నుంచి సేకరిస్తారు. ప్లాంట్‌కి రోజుకు 500 కేఎల్‌డీ నీరు అవసరమవుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే తిరుపతి పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ ఉత్పత్తిలో కూడా కొత్త దిశను చూపనుంది.

ఏపీ యువతకు ఆస్ట్రేలియా ప్రమాణాలు.. TAFE NSWతో మంత్రి లోకేశ్ కీలక ఒప్పందం!
Herbal Tea: ఉదయాన్నే వీటితో టీ తీసుకుంటే... ఇక ఆ సమస్యలకు చెక్!
Ap Government: ఏపీ ఉద్యోగులు, పింఛనర్లకు దీపావళి బోనస్..! 3.64% పెంపుతో... కొత్త డీఏ, బకాయిలు విడుదల..!
ప్రపంచంలోని టాప్-50 యూనివర్సిటీతో ఏపీ భాగస్వామ్యం.. నారా లోకేశ్ కీలక అడుగు! విద్యారంగంలో ఏపీకి..
Sensex: దీపావళి ఉత్సాహంతో దూసుకెళ్లిన మార్కెట్లు.. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో!

Spotlight

Read More →