Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

AP Tourism: అమరావతిలో 'క్రియేటివ్ సిటీ'..! ఏపీ టూరిజంపై సీఎం చంద్రబాబు భారీ ప్లాన్!

AP Tourism: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సదస్సులో ఏపీ పర్యాటక రంగాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో క్రియేటివ్ సిటీ ఏర్పాటు, సూర్యలంకను గోవాలా అభివృద్ధి చేయడం, మరియు ఆతిథ్య రంగంలో 50 వేల గదుల కల్పన వంటి లక్ష్యాలను నిర్దేశించారు.

Published : 2026-03-12 13:48:00

పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్…

ఏఐ, ఫిలిం, కంటెంట్ క్రియేషన్ హబ్‌గా ఏపీ…

క్రియేటివ్ ఎకానమీతో రాష్ట్ర ఆదాయం పెంపు…

AP Tourism: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సు అత్యంత ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక రంగంపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను ఆయన అధికారులకు వివరించారు. ముఖ్యంగా రాజధాని అమరావతిలో ఒక 'క్రియేటివ్ సిటీ'ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో పర్యాటక రంగం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని, దీనికోసం వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్లాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే ఆతిథ్య రంగం (Hospitality) బలోపేతం కావాలని సీఎం స్పష్టం చేశారు. ఏపీలో పర్యాటకానికి ఉన్న డిమాండ్‌ను బట్టి రాబోయే రోజుల్లో కనీసం 50 వేల హోటల్ గదులు అందుబాటులోకి రావాలని ఆయన లక్ష్యంగా నిర్దేశించారు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఏమీ లేని ప్రాంతాలను కూడా అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లుగా మారుస్తున్నారని, కానీ ఏపీలో ఎన్నో చరిత్రాత్మక ప్రాంతాలు, ప్రకృతి సిద్ధమైన వనరులు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల ప్రజలు విదేశాలకు వెళ్లడం కంటే స్థానిక పర్యాటక ప్రాంతాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ అవకాశాన్ని ఏపీ అందిపుచ్చుకోవాలని సూచించారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల విశిష్టతను చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. బాపట్ల జిల్లాలోని సూర్యలంక తీరాన్ని మరొక 'గోవా' తరహాలో అభివృద్ధి చేయవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, అనంతపురం జిల్లాలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద సరైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే పర్యాటకుల తాకిడి పెరుగుతుందని చెప్పారు. ప్రకాశం జిల్లాలోని కంభం చెరువు ఆసియాలోనే అతిపెద్ద మానవ నిర్మిత నీటి వనరు అని, ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన పేర్కొన్నారు.

సాంకేతికత మరియు వినోద రంగాలను పర్యాటకంతో జోడించడం ద్వారా 'క్రియేటివ్ ఎకానమీ'ని వృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఫిల్మ్ షూటింగ్‌లు, కంటెంట్ క్రియేషన్ పరిశ్రమలకు రాష్ట్రంలో పెద్దపీట వేస్తామని ప్రకటించారు. యువతకు ఉపాధి కల్పించడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ఈ రంగాలు ఎంతో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి అన్ని రకాల అనుమతులు వేగంగా మంజూరు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

Spotlight

Read More →