- ముక్కంటి సాక్షిగా మురిసిన వధూవరులు: వేడుకకు హాజరైన మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ..
- రాజకీయ, సినీ దిగ్గజాల కలయిక: శిల్ప-సుహాస్ నిశ్చితార్థ వేడుకలో సందడి చేసిన చంద్రబాబు దంపతులు..
Gangadhar Nadella Daughter engagement: అందరివాడు, తానా మాజీ అధ్యక్షుడు గంగాధర్ నాదెళ్ల ద్వితీయ కుమార్తె శిల్ప-ఆలూరి సుహాస్ వివాహ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్లోని హోటల్ దస్ పల్లాలో అంగరంగ వైభవంగా జరిగింది. అనేక మంది ఎన్ఆర్ఐలు, టీడీపీ, బీజేపీ నాయకులు, మంత్రులు, అధికారులు విచ్చేసి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు-భువనేశ్వరి దంపతులు శిల్ప-సుహాస్లను ఆశీర్వదించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తెలుగు రాష్ట్రాల నాయకులు సుజనా చౌదరి, తుమ్మల నాగేశ్వరరావు, గరికపాటి మోహన్రావు, కేశినేని చిన్ని, పాతూరి నాగభుషణం, ధూళిపాళ్ల నరేంద్ర, ఎర్రబెల్లి దయాకర్రావు, యరపతినేని ప్రభాకర్, వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు, తొండపు జనార్దన్, బండ్ల గణేష్, ముత్తంశెట్టి శ్రీనివాస్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కాబోయే జంటను ఆశీర్వదించారు. నగరానికి చెందిన ప్రముఖులు కేవీ రావు, నందమూరి రామ కృష్ణ, నందమూరి వసుంధర, అక్కినేని వెంకట్, ప్రసాద్ గారపాటి, అట్లూరి సుబ్బారావు నవీన్ ఎర్న