ఒంగోలు జిల్లాలో 50 ఎయిడెడ్ పాఠశాలలు మూసివేతకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అధికారులు ఈ చర్యలు చేపడుతున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో విద్యార్థులు జీరో నమోదు ఉన్న ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం మొదట ఉత్తర్వులు జారీచేసింది. దాని ప్రకారం జిల్లాలో 20 పాఠశాలలు మూతపడనున్నాయి. తాజాగా ప్రస్తుతం పదిమందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలపై కూడా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా డైరెక్టర్ పి.పార్వతి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. అలాంటివి 30 ఉన్నట్లు అధికారులు తేల్చారు.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
దీంతో జిల్లాలో తాజాగా 50 ఎయిడెడ్ పాఠశాలలను శాశ్వితంగా తాళాలు పడే పరిస్థితి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం.. కొమరోలు మండలంలోని ఐదు, గిద్దలూరు మండలంలో ఆరు, మార్కాపురంలో మూడు, వైపాలెం, పుల్లలచెరువు, అర్ధవీడు, దొనకొండ, మార్టూరు, ఇంకొల్లు, పర్చూరు, కొరిశపాడు, కారంచేడులో ఒక్కొక్కటి, ఎన్జీపాడు నాలుగు, చీరాలలో మూడు, కనిగిరి, కంభంలో రెండు చొప్పున పాఠశాలలు మూతపడనున్నాయి. జిల్లాలో ఎనిమిది హైస్కూళ్లు, 42 ప్రాథమిక పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉంది.
ఈ పాఠశాలల్లో ప్రస్తుతం 180మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఈ పాఠశాలలన్నింటిపై ఈనెల 22లోపు చర్యలు తీసుకోని నివేదిక సమర్పించాలని డైరెక్టర్ పార్వతి ఆదేశించారు. వారిని ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేయాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకట్రావు, ప్రభాకర్రెడ్డిలు కోరారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి