Raghu Rama Krishna Raju: శుభవార్త.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు! ధర్మమే గెలిచింది.. అడ్డంకులు తొలిగాయి! PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 6,124 మంది సచివాలయ ఉద్యోగుల డెప్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్! TDP New Committees: టీడీపీ కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం- కార్యకర్తే అధినేత.. ఇదే తెదేపా సిద్ధాంతం - చంద్రబాబు!! Amaravati Works: దేశంలోనే అతిపెద్ద డయాగ్రిడ్ స్ట్రక్చర్‌గా రికార్డు... 49 అంతస్తులతో ఆకాశాన్నంటే టవర్లు! Amaravati Development: ఢిల్లీ, వాషింగ్టన్‌లను మించిపోనున్న నవ్యాంధ్ర రాజధాని! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ భూములు దర్జాగా అమ్ముకోవచ్చు... కీలక ఉత్తర్వులు జారీ! Praja Vedika: నేడు (29/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Future City: ఫ్యూచర్‌సిటీలో మరికొన్ని గ్రామాలు విలీనం.. అక్కడ అతిపెద్ద బస్ టెర్మినల్, సీఎం కీలక ప్రకటన! Raghu Rama Krishna Raju: శుభవార్త.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు! ధర్మమే గెలిచింది.. అడ్డంకులు తొలిగాయి! PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 6,124 మంది సచివాలయ ఉద్యోగుల డెప్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్! TDP New Committees: టీడీపీ కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం- కార్యకర్తే అధినేత.. ఇదే తెదేపా సిద్ధాంతం - చంద్రబాబు!! Amaravati Works: దేశంలోనే అతిపెద్ద డయాగ్రిడ్ స్ట్రక్చర్‌గా రికార్డు... 49 అంతస్తులతో ఆకాశాన్నంటే టవర్లు! Amaravati Development: ఢిల్లీ, వాషింగ్టన్‌లను మించిపోనున్న నవ్యాంధ్ర రాజధాని! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ భూములు దర్జాగా అమ్ముకోవచ్చు... కీలక ఉత్తర్వులు జారీ! Praja Vedika: నేడు (29/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Future City: ఫ్యూచర్‌సిటీలో మరికొన్ని గ్రామాలు విలీనం.. అక్కడ అతిపెద్ద బస్ టెర్మినల్, సీఎం కీలక ప్రకటన!

AP liquor scam: రూ.441.63 కోట్ల.. మద్యం మాఫియా గుట్టురట్టు.. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ బిగ్ షాక్!

AP liquor scam: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులుగా ఉన్న కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర నిందితులకు చెందిన రూ.441.63 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు శుక్రవారం ఈడీ అధికారికంగా ప్రకటించింది.

Published : 2026-03-06 21:30:00
  • దర్యాప్తు ఇంకా ముగియలేదు: లిక్కర్ స్కామ్ మూలాలు వెతికే పనిలో ఈడీ.. మరిన్ని అటాచ్‌మెంట్లకు అవకాశం?
     
  • కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి టార్గెట్‌గా ఈడీ అటాచ్‌మెంట్: రంగంలోకి మనీ లాండరింగ్ చట్టం..

AP liquor scam: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులుగా ఉన్న కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర నిందితులకు చెందిన రూ.441.63 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు శుక్రవారం ఈడీ అధికారికంగా ప్రకటించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈ ఆస్తులను జప్తు చేశారు. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. జప్తు చేసిన ఆస్తుల్లో కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి, బూనేటి చాణక్య, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి తదితరులకు చెందిన బ్యాంక్ బ్యాలెన్సులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, భూములు, ఇతర స్థిరాస్తులు ఉన్నాయి. 

ఏపీలో 2019కి ముందు మద్యం వ్యాపారం పారదర్శకంగా, డిజిటల్ ట్రాకింగ్‌తో జరిగేదని, అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కావాలనే ఆటోమేటెడ్ విధానాన్ని రద్దు చేసి మాన్యువల్ విధానాన్ని తీసుకొచ్చిందని ఈడీ పేర్కొంది. ఈ కొత్త విధానం ద్వారా అధికారులకు విచక్షణాధికారాలు కట్టబెట్టి, తమకు నచ్చిన బ్రాండ్లకు అనుకూలంగా వ్యవహరించారని దర్యాప్తులో తేలింది. ఆర్డర్లు ఇవ్వాలంటే 15 నుంచి 20 శాతం ముడుపులు ఇవ్వాలని డిస్టిలరీలను సిండికేట్ సభ్యులు డిమాండ్ చేశారని, నిరాకరించిన వారి చెల్లింపులు నిలిపివేశారని ఈడీ ఆరోపించింది. 

ఈ అక్రమాల వల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.3,500 నుంచి రూ.4,000 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. వసూలు చేసిన ముడుపులను హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో దాచిపెట్టి, అక్కడి నుంచి తరలించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో కీలక నిందితులు 'సిగ్నల్ వంటి ఎన్‌క్రిప్టెడ్ యాప్స్ ద్వారా సంభాషణలు జరిపారని, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఈడీ స్పష్టం చేసింది.
 

Spotlight

Read More →