AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...! Guntur: గుంటూరులో హై టెన్షన్... పోలీసులతో వైసీపీ నేతల తోపులాట! Statue Of Sacrifice: తుల్లూరు మార్గంలో సరికొత్త ఆకర్షణ...! పర్యాటక కేంద్రంగా మారనున్న స్మృతివనం! AI Summit: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు... ఏఐ సమ్మిట్‌లో ఏపీ టెక్ విజన్! Jagan: జగన్ 'బహిష్కరణ' మంత్రం.. ఎమ్మెల్యేల 'సంతకాల' తంత్రం: వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? Pemmasani: శరవేగంగా గుంటూరు మిర్చి యార్డ్ ఫ్లైఓవర్ పనులు.. మంత్రి పెమ్మసాని స్పెషల్ ఫోకస్! Kesineni Sivanath: విజయవాడలో హైటెక్ యంత్రం ఎంట్రీ…! 15 నిమిషాల్లో గుంతలకు గుడ్‌బై! AI Hub: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.1.25 కోట్లు భారీ పెట్టుబడితో భారీ AI హబ్! Cluster University: మంత్రి కీలక ప్రకటన! రూ. 139 కోట్లతో క్లస్టర్ యూనివర్సిటీ... అక్కడే ఫిక్స్! Legal Notice: కీలక వైసిపి నేతకు షాక్..! హెరిటేజ్ ఫుడ్స్ నుండి లీగల్ నోటీసులు! AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...! Guntur: గుంటూరులో హై టెన్షన్... పోలీసులతో వైసీపీ నేతల తోపులాట! Statue Of Sacrifice: తుల్లూరు మార్గంలో సరికొత్త ఆకర్షణ...! పర్యాటక కేంద్రంగా మారనున్న స్మృతివనం! AI Summit: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు... ఏఐ సమ్మిట్‌లో ఏపీ టెక్ విజన్! Jagan: జగన్ 'బహిష్కరణ' మంత్రం.. ఎమ్మెల్యేల 'సంతకాల' తంత్రం: వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? Pemmasani: శరవేగంగా గుంటూరు మిర్చి యార్డ్ ఫ్లైఓవర్ పనులు.. మంత్రి పెమ్మసాని స్పెషల్ ఫోకస్! Kesineni Sivanath: విజయవాడలో హైటెక్ యంత్రం ఎంట్రీ…! 15 నిమిషాల్లో గుంతలకు గుడ్‌బై! AI Hub: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.1.25 కోట్లు భారీ పెట్టుబడితో భారీ AI హబ్! Cluster University: మంత్రి కీలక ప్రకటన! రూ. 139 కోట్లతో క్లస్టర్ యూనివర్సిటీ... అక్కడే ఫిక్స్! Legal Notice: కీలక వైసిపి నేతకు షాక్..! హెరిటేజ్ ఫుడ్స్ నుండి లీగల్ నోటీసులు!

AP Govt: విత్తనాలు కొనేముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..! రైతులకు కీలక సూచనలు!

 రైతులు ఎంత శ్రమించుకున్నారు అన్నది పక్కన పెడితే, నాణ్యమైన విత్తనాలు మరియు పంటకు సరిపోయే మొక్కలు లేకపోతే భారీ నష్టాలు తప్పవు. ముఖ్యంగా మిరప, టమాటా, కొబ్బరి

Published : 2025-12-07 12:12:00
Health Benefits:ఉదయం తులసి ఆకులు నమలితే ఏమవుతుందో తెలుసా?

రైతులు ఎంత శ్రమించుకున్నారు అన్నది పక్కన పెడితే, నాణ్యమైన విత్తనాలు మరియు పంటకు సరిపోయే మొక్కలు లేకపోతే భారీ నష్టాలు తప్పవు. ముఖ్యంగా మిరప, టమాటా, కొబ్బరి, ఆయిల్ పామ్, కోకో వంటి ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు ఎక్కువగా నర్సరీల నుంచి మొక్కలు కొనుగోలు చేస్తారు. అయితే నర్సరీలో తీసుకున్న మొక్కలు సరైన పూట, పిందె, పండును ఇవ్వకపోతే పెట్టిన మొత్తం పెట్టుబడి వృథా అవుతుంది. అందుకే వ్యవసాయ నిపుణులు రైతులు నర్సరీల్లో మొక్కలు కొనేటప్పుడు అత్యంత జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. తెలిసిన వాళ్ల మాటకే కాకుండా, ఉద్యాన శాఖ సూచించిన రకాలు ఏవో చూసుకుని, వాటిని సాగుకు అనువైనవో కాదో ముందుగా నిర్ధారించుకోవాలి.

SUV ప్రేమికులకు గుడ్ న్యూస్! కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? త్వరలో లాంచ్‌ కానున్న లెటెస్ట్‌ మోడల్స్‌పై ఓ లుక్కేయండి!

ముఖ్యంగా పండ్ల తోటల్లో తల్లి మొక్క (మదర్ ప్లాంట్) ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఎందుకంటే తల్లి మొక్క లక్షణాలే అంటుకట్టిన మొక్కలపై ప్రతిబింబిస్తాయి. చాలా నర్సరీలు లాభం కోసం అందుబాటులో ఉన్న ఏ రకమైనా కట్టుకుని అమ్ముతుంటాయి. దీంతో రైతులకు రాకపోయే దిగుబడి వల్ల భారీ నష్టాలు వస్తాయి. అదే విధంగా నర్సరీ విశ్వసనీయత కూడా చూసుకోవాలి. లైసెన్సు లేకుండా నడిచే నర్సరీల్లో రకాల స్పష్టత, నాణ్యత ప్రమాణాలు ఉండకపోవచ్చు. కాబట్టి ఆ నర్సరీలో అమ్ముతున్న రకం ఏది, తల్లి మొక్క వివరాలు ఏవి, సాగు ప్రాంతానికి అనుకూలమా కాదా వంటి అంశాల్ని పరిశీలించాలి.

OTT: జులైలో థియేటర్స్‌.. ఇప్పుడు OTTలో ఎంట్రీ.. సూపర్ మ్యాన్ 11న రానున్నాడు!

రైతులు నర్సరీల్లో మొక్కలు లేదా నార్లు కొన్నప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. ఎందుకంటే మొక్కల్లో లోపాలు ఉండి పంట సరైన దిగుబడి ఇవ్వకపోతే, రసీదు ఆధారంగా పరిహారం పొందే అవకాశం ఉంటుంది. అలాగే మొక్కలకు తెగుళ్లు లేదా పురుగులు ఉన్నాయో లేదో కూడా సవివరంగా చూడాలి. ఒకే మొక్క నుంచి వ్యాపించే తెగులు మొత్తం తోటను నాశనం చేసే ప్రమాదం ఉంది. మొక్కలకు వచ్చే సమస్యలు, వాటికి ఎలాంటి నివారణలు తీసుకోవాలి అనే విషయాలను నర్సరీ యజమానిని ప్రశ్నించి తెలుసుకోవడం రైతులకు ఎంతో మేలు చేస్తుంది. ఇలా ముందుగానే సస్యరక్షణ చర్యలు తీసుకుంటే, తోట ఆరోగ్యం కాపాడుకోవచ్చు.

Court Shock: ఏయూ మాజీ వీసీకి జైలుశిక్ష! కోర్టు ఉత్తర్వులు ధిక్కరించడంపై..!

మొక్కలు కొనేటప్పుడు వాటి ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలి. బలహీనంగా ఉన్నవి, ఒక వైపు వంగి ఉన్నవి, చీలిన కాండం ఉన్నవి కొనకూడదు. కాండం బలంగా ఉండి, పైన కొమ్మలు ఉన్న మొక్కలు ఎంచుకోవాలి. నేలలో పెంచిన మొక్కలను తీసుకుంటే వేర్లు తెగిపోయే ప్రమాదం ఉండటంతో పాలీకవర్‌లో పెంచిన మొక్కలను మాత్రమే తీసుకోవడం మంచిది. అలాగే అంటుకట్టిన ప్రాంతం నేలపై ఉండాలి; చీలిపోయి, ఉబ్బిపోయిన చోటు కనిపిస్తే అలాంటి మొక్కలను తీసుకోవద్దు. మామిడి, సపోట, జీడి, నిమ్మ వంటి పండ్ల సాగు కోసం దాదాపు ఏడాదిన్నర వయస్సు గల మొక్కలనే ఎంచుకోవాలి. కొబ్బరి మొక్కల విషయంలో టెంక పూర్తిగా భూమిలో కనిపించినా, ఆకులు ఎక్కువగా విచ్చుకున్నా కొనగూడదు. ఈ అన్ని సూచనలను పాటిస్తే రైతులు నాణ్యమైన మొక్కలు పొందడమే కాకుండా భవిష్యత్‌లో భారీ నష్టాలనుంచి తప్పించుకోవచ్చు.

Sonu Soods: ఇండిగో సిబ్బందిపై ఆగ్రహం వద్దు.. సోనూసూద్ పిలుపు!
Best Philanthropy Award: ఖతర్‌లో తెలుగు ప్రవాసీకి ప్రతిష్ఠాత్మక పురస్కారం!
Scrub Typhus Panic: ఏపీలో స్క్రబ్ టైఫస్ విజృంభణ..! ఆ గ్రామాల్లో హైటెన్షన్..!
Aviation Crisis: ఇండియాలో కుప్పకూలిన ఎయిర్‌లైన్స్‌ వ్యవస్థ! ప్రభుత్వం స్పందించాలంటూ ప్రయాణీకుల డిమాండ్!
Sunflower Benifits: ఇది మీకు తెలుసా... పొద్దుతిరుగుడు తో పుష్కలమైన ఆరోగ్యం! విత్తనాలే కాదు..ఆకులతో అద్భుతాలు!
Plane Crash: షాకింగ్ ఘటన.... టేకాఫ్ అవుతుండగా విమానంలో చెలరేగిన మంటలు!

Spotlight

Read More →