Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే!

Land's: రైతులకు గుడ్ న్యూస్..! ఇక ఆ భూములు కూడా పట్టా భూములే..! అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్..!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు తీపి కబురు చెప్పింది. రాజధాని నిర్మాణం కోసం తమ అసైన్డ్‌ భూములను ప్రభుత్వానికి ఇచ్చిన రైతులకు కలుగుతున్న సమస్యలను పర

Published : 2025-09-17 17:27:00
Indigo: ఫ్లైట్ టికెట్ ధర బస్ టికెట్ కంటే తక్కువ.. హైదరాబాద్, విజయవాడ, కడప రూట్లలోనూ! ప్రయాణ తేదీలు ఇవే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు తీపి కబురు చెప్పింది. రాజధాని నిర్మాణం కోసం తమ అసైన్డ్‌ భూములను ప్రభుత్వానికి ఇచ్చిన రైతులకు కలుగుతున్న సమస్యలను పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు వారికి ఇచ్చిన రిటర్నబుల్‌ ప్లాట్లలో "అసైన్డ్‌" అనే పదం ఉండటంతో, ఆ స్థలాలు అమ్ముడుపోకుండా సమస్యలు ఎదురవుతున్నాయి. దీనిపై రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను గమనించిన సీఎం, ఇకపై రిటర్నబుల్‌ ప్లాట్లను "పట్టా భూమి"గా పరిగణించాలని ఆదేశించారు. దీననుసరించి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్‌ జీ.వో. నెం.187ను విడుదల చేశారు. దీంతో రైతులకు వచ్చిన ప్లాట్లు అధికారికంగా పట్టా భూములుగా మారాయి.

వివేకా కేసు అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా? బిగిస్తున్న ఉచ్చు.

గతంలో సీఆర్డీయే ఇచ్చిన ప్లాట్లలో "అసైన్డ్‌" అనే గుర్తింపు ఉండటంతో, వాటిని మార్కెట్లో విక్రయించేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కొనుగోలు దారులు ముందుకు రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు ఆ పదాన్ని తొలగించాలని ఆదేశించారు. దీంతో ఇప్పుడు ఆ ప్లాట్లకు పూర్తిస్థాయి పట్టా హక్కు లభించడంతో, రైతులు వాటిని అమ్ముకునే అవకాశం ఏర్పడింది. ఈ నిర్ణయం అమలులోకి రావడంతో రైతులకు ఆర్థిక లాభం దక్కనుంది.

Garikipati Comments: నేను ఈ సినిమా చూశా.. మీరూ చూడండి! గరికపాటి వ్యాఖ్యలతో వైరల్ అవుతున్న ఆ తెలుగు సినిమా ఇదే!

అయితే మరోవైపు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రిటర్నబుల్ ప్లాట్లపై రుణాల అంశం. గత ప్రభుత్వ కాలంలోనుంచి ఈ ప్లాట్లను రుణాలకు తనఖా పెట్టడానికి బ్యాంకులు అంగీకరించడం లేదు. మార్గదర్శకాలు లేవని, తనఖాగా పరిగణించలేమని కారణాలు చెబుతూ వెనక్కి తగ్గుతున్నాయి. ఈ ఏడాది జూలై 25న జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ ప్రత్యేకంగా రుణాలు ఇవ్వాలని కోరినా, ఇప్పటికీ పరిస్థితి మారలేదు. రైతులు బ్యాంకులకు వెళ్లినా సిబ్బంది పాత కారణాలనే చెబుతున్నారు.

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ప్రకటన.. రాష్ట్రంలోని అన్ని ఎన్నికల్లో పోటీకి!

ప్రస్తుతం అసైన్డ్ భూముల గుర్తింపును తొలగించి పట్టా భూములుగా మార్చిన నిర్ణయం రైతులకు ఊరట ఇచ్చింది. కానీ రుణాల అంశం పరిష్కారం కాకపోవడంతో వారు నిరాశ చెందుతున్నారు. రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులు ప్రభుత్వాన్ని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు. తమ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్న ప్రభుత్వం, ఈసారి కూడా రుణాల అంశంలో దృఢమైన చర్యలు తీసుకుంటుందనే నమ్మకం రైతుల్లో ఉంది. మరి బ్యాంకులు కూడా ప్రభుత్వ ఆదేశాలను పాటించి రైతులకు సహకరించనున్నాయా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

Tirumala Brahmotsavams: తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం.. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు!
Astrology 2025 : ఈ రాశుల వారికి అక్టోబర్ నెలలో రాజయోగం! ఊహించని లాభాలు!
Lady stars: ఒక్కో సినిమాకు కోట్ల పారితోషికం తీసుకుంటున్న లేడీ స్టార్స్.. ఎవరో తెలుసా!
India News: ట్రంప్‌కు మరో షాక్.. భారత్ - బ్రిటన్ బంధం పటిష్టం! కీలక ఒప్పందాలు - షెడ్యూల్ ఇదే.!
Home Tips: రసాయనాలు వద్దు, వంటింటి చిట్కాలు ముద్దు.. ఈ నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో బల్లులు, బొద్దింకలు మాయం!

Spotlight

Read More →