Fee Reimbursement: రమ్మంటే పారిపోతారా? వైసీపీ వాకౌట్‌పై మంత్రి లోకేష్ ఫైర్! Budget meetings: ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్.. ఏపీలో చేనేత రంగం సరికొత్త ప్రస్థానం! Ambati dialogue viral: అంబటి సైగలు చూసి అల్లు అర్జున్ కూడా సిగ్గుపడాలి.. టీడీపీ ఎమ్మెల్సీ నేత ఫైర్.! Trump–Modi: మోదీపై ట్రంప్ కామెంట్స్..! విదేశాంగ శాఖ స్పందనతో కొత్త మలుపు! Telangana Municipal Election: నల్గొండలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. గడ్డిపోతారంలో గులాబీ జెండా రెపరెపలు! Excise Scam: గత ఐదేళ్లలో ఎక్సైజ్ శాఖ దోపిడీకి అడ్డా... అసెంబ్లీలో మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్! Rahul vs Modi 2026: విపక్ష నేతగా విఫలమవుతున్నారా? పార్లమెంట్‌లో రాహుల్ తీరుపై సొంత పార్టీలోనే గుసగుసలు! Telangana Municipal Election Results 2026: మున్సిపోల్స్ కౌంటింగ్ షురూ.. తెలంగాణలో ఎవరిది పైచేయి? ఫామ్ హౌస్‌లలో అభ్యర్థుల క్యాంప్‌లు! RailwayProject: రాయలసీమకు రైల్వే వరం..! కడప–బెంగళూరు లింక్‌తో అభివృద్ధికి బూస్ట్! AgrigoldPlots: అగ్రిగోల్డ్ ప్లాట్ యజమానులకు బిగ్ రిలీఫ్..! ప్రభుత్వం కీలక నిర్ణయం! Fee Reimbursement: రమ్మంటే పారిపోతారా? వైసీపీ వాకౌట్‌పై మంత్రి లోకేష్ ఫైర్! Budget meetings: ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్.. ఏపీలో చేనేత రంగం సరికొత్త ప్రస్థానం! Ambati dialogue viral: అంబటి సైగలు చూసి అల్లు అర్జున్ కూడా సిగ్గుపడాలి.. టీడీపీ ఎమ్మెల్సీ నేత ఫైర్.! Trump–Modi: మోదీపై ట్రంప్ కామెంట్స్..! విదేశాంగ శాఖ స్పందనతో కొత్త మలుపు! Telangana Municipal Election: నల్గొండలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. గడ్డిపోతారంలో గులాబీ జెండా రెపరెపలు! Excise Scam: గత ఐదేళ్లలో ఎక్సైజ్ శాఖ దోపిడీకి అడ్డా... అసెంబ్లీలో మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్! Rahul vs Modi 2026: విపక్ష నేతగా విఫలమవుతున్నారా? పార్లమెంట్‌లో రాహుల్ తీరుపై సొంత పార్టీలోనే గుసగుసలు! Telangana Municipal Election Results 2026: మున్సిపోల్స్ కౌంటింగ్ షురూ.. తెలంగాణలో ఎవరిది పైచేయి? ఫామ్ హౌస్‌లలో అభ్యర్థుల క్యాంప్‌లు! RailwayProject: రాయలసీమకు రైల్వే వరం..! కడప–బెంగళూరు లింక్‌తో అభివృద్ధికి బూస్ట్! AgrigoldPlots: అగ్రిగోల్డ్ ప్లాట్ యజమానులకు బిగ్ రిలీఫ్..! ప్రభుత్వం కీలక నిర్ణయం!

AP Revenue Meetings Updates: భూ రికార్డుల తప్పులను సరిదిద్దుతాం.. సామాన్యుల సమస్యలకు శాశ్వత పరిష్కారం: మంత్రి అనగాని హామీ!

AP Revenue Meetings Updates: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో కీలక వివరాలు వెల్లడించారు. భూ రికార్డుల తప్పులు, గత ప్రభుత్వ వైఫల్యాలు మరియు సీఎం చంద్రబాబు సమీక్షల గురించి మంత్రి మాట్లాడారు.

Published : 2026-02-13 12:12:00

AP Revenue Meetings Updates: భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి వర్క్‌షాపులు

రైతులకు భరోసా… పారదర్శక పాలన అందిస్తాం

భూ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం వేగం పెంచింది

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు ప్రజల నుంచి మంచి స్థాయిలో స్పందన వచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో వెల్లడించారు. ( Mantri anagani) ఈ సదస్సుల్లో భూములకు సంబంధించిన సమస్యలపై ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారని (AP Revenue Meetings Updates) ఆయన పేర్కొన్నారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ప్రభుత్వం ఈ ఫిర్యాదులను చాలా సీరియస్‌గా తీసుకుని పరిష్కరిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటివరకు 2,34,665 వినతిపత్రాలు అందాయని మంత్రి వివరించారు. ప్రభుత్వం వీటిపై వేగంగా స్పందించి ఇప్పటికే 2,33,578 దరఖాస్తులను పరిష్కరించిందని ఆయన తెలిపారు. అంటే వచ్చిన ఫిర్యాదుల్లో దాదాపు అన్నింటినీ అధికారులు క్లియర్ చేశారని చెప్పారు. వీటిలో కేవలం 659 దరఖాస్తులు మాత్రమే ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించినవని ఆయన గుర్తుచేశారు.
గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే రాష్ట్రంలో భూ రికార్డులు తారుమారయ్యాయని మంత్రి అనగాని విమర్శించారు.

ఆ సమయంలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల భూ వివాదాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్ (PGRS) కు వస్తున్న ఫిర్యాదుల్లో ఏకంగా 61 శాతం ఫిర్యాదులు ఒక్క రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉంటున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ప్రజల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. అందుకే భూ వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేకంగా వర్క్ షాపులు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి తెలిపారు. ప్రతి నెలా ఒకసారి ముఖ్యమంత్రి స్వయంగా రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహిస్తూ, పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశిస్తున్నారని చెప్పారు. రైతులు, సామాన్య ప్రజలు తమ భూముల విషయంలో ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని. పారదర్శకమైన పాలన అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Spotlight

Read More →