ప్రధాన ఆకర్షణ గా ఆస్కార్ విజేత చంద్రబోస్..
సందడిగా సాంస్కృతిక కార్యక్రమాలు, తెలుగు వారందరికీ ఆహ్వానం..
న్యూయార్క్లోని తెలుగు సాహిత్య సాంస్కృతిక సంస్థ (TLCA) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది, శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 18, 2026 (శనివారం) మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫ్లషింగ్లోని హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ వేడుకల్లో ఆస్కార్ విజేత, ప్రముఖ సినీ గేయ రచయిత, గాయకుడు చంద్రబోస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఆయనతో “ఆస్కార్ ముచ్చట్లు – పాట వెనుక మాట – మాటల బాట” అనే ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సెషన్లో ఆయన అనుభవాలు, సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకోనున్నారు.
ఉత్సవాల్లో టాలీవుడ్ గాయకుల లైవ్ పెర్ఫార్మెన్స్, సాంస్కృతిక ప్రదర్శనలు, స్కిట్లు, స్థానిక కళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించనున్నాయి. కార్యక్రమానికి విచ్చేసే అతిథుల కోసం పండుగ ప్రత్యేక ‘ట్రెడిషనల్ డిన్నర్’ కూడా ఏర్పాటు చేశారు.
ఈ వేడుకలను TLCA అధ్యక్షుడు సుమంత్ రామ్ సెట్టి నాయకత్వంలో వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సనిగెపల్లి, సెక్రటరీ లావణ్య అట్లూరి, ట్రెజరర్ సునీల్ చల్లాగుళ్ల, జాయింట్ సెక్రటరీ దివ్య దొమ్మరాజు, జాయింట్ ట్రెజరర్ సుధా మన్నవతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ప్రవీణ్ కరణం, సునీత పోలేపల్లి, శిరీష తునుగుంట్ల, రజిత కల్లూరి, రాంబాబు జల్లేపల్లి, సాయి దేవినేని, మాజీ అధ్యక్షుడు కిరణ్ రెడ్డి పర్వతాల సమన్వయంతో నిర్వహిస్తున్నారు.
న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలందరూ ఈ వేడుకలకు హాజరై తెలుగు సంస్కృతిని ఆస్వాదించాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం TLCA అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చని తెలిపారు.