Ambati dialogue viral: అంబటి సైగలు చూసి అల్లు అర్జున్ కూడా సిగ్గుపడాలి.. టీడీపీ ఎమ్మెల్సీ నేత ఫైర్.! Trump–Modi: మోదీపై ట్రంప్ కామెంట్స్..! విదేశాంగ శాఖ స్పందనతో కొత్త మలుపు! Telangana Municipal Election: నల్గొండలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. గడ్డిపోతారంలో గులాబీ జెండా రెపరెపలు! Excise Scam: గత ఐదేళ్లలో ఎక్సైజ్ శాఖ దోపిడీకి అడ్డా... అసెంబ్లీలో మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్! Rahul vs Modi 2026: విపక్ష నేతగా విఫలమవుతున్నారా? పార్లమెంట్‌లో రాహుల్ తీరుపై సొంత పార్టీలోనే గుసగుసలు! Telangana Municipal Election Results 2026: మున్సిపోల్స్ కౌంటింగ్ షురూ.. తెలంగాణలో ఎవరిది పైచేయి? ఫామ్ హౌస్‌లలో అభ్యర్థుల క్యాంప్‌లు! RailwayProject: రాయలసీమకు రైల్వే వరం..! కడప–బెంగళూరు లింక్‌తో అభివృద్ధికి బూస్ట్! AgrigoldPlots: అగ్రిగోల్డ్ ప్లాట్ యజమానులకు బిగ్ రిలీఫ్..! ప్రభుత్వం కీలక నిర్ణయం! AP Budget 2026-27: ఎల్లుండి ఏపీ బడ్జెట్ - 2026-27 ఆర్థిక ఏడాదికి బడ్జెట్..! 3 లక్షల 50 వేల కోట్లకుపైగా.. శాఖల వారీగా సమీక్ష! BITSPilani: అమరావతిలో బిట్స్ పిలానీ పనులు స్టార్ట్! ప్రపంచ స్థాయి విద్యకు శ్రీకారం! Ambati dialogue viral: అంబటి సైగలు చూసి అల్లు అర్జున్ కూడా సిగ్గుపడాలి.. టీడీపీ ఎమ్మెల్సీ నేత ఫైర్.! Trump–Modi: మోదీపై ట్రంప్ కామెంట్స్..! విదేశాంగ శాఖ స్పందనతో కొత్త మలుపు! Telangana Municipal Election: నల్గొండలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. గడ్డిపోతారంలో గులాబీ జెండా రెపరెపలు! Excise Scam: గత ఐదేళ్లలో ఎక్సైజ్ శాఖ దోపిడీకి అడ్డా... అసెంబ్లీలో మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్! Rahul vs Modi 2026: విపక్ష నేతగా విఫలమవుతున్నారా? పార్లమెంట్‌లో రాహుల్ తీరుపై సొంత పార్టీలోనే గుసగుసలు! Telangana Municipal Election Results 2026: మున్సిపోల్స్ కౌంటింగ్ షురూ.. తెలంగాణలో ఎవరిది పైచేయి? ఫామ్ హౌస్‌లలో అభ్యర్థుల క్యాంప్‌లు! RailwayProject: రాయలసీమకు రైల్వే వరం..! కడప–బెంగళూరు లింక్‌తో అభివృద్ధికి బూస్ట్! AgrigoldPlots: అగ్రిగోల్డ్ ప్లాట్ యజమానులకు బిగ్ రిలీఫ్..! ప్రభుత్వం కీలక నిర్ణయం! AP Budget 2026-27: ఎల్లుండి ఏపీ బడ్జెట్ - 2026-27 ఆర్థిక ఏడాదికి బడ్జెట్..! 3 లక్షల 50 వేల కోట్లకుపైగా.. శాఖల వారీగా సమీక్ష! BITSPilani: అమరావతిలో బిట్స్ పిలానీ పనులు స్టార్ట్! ప్రపంచ స్థాయి విద్యకు శ్రీకారం!

Nara Lokesh Athmiya Samavesham 2026: లోకేష్ ఆత్మీయ విందు.. ఎమ్మెల్యేల కుటుంబాలతో మంత్రి స్పెషల్ మీటింగ్.. పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్!

Nara Lokesh Athmiya Samavesham 2026: మంత్రి నారా లోకేష్ చిత్తూరు, అనకాపల్లి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులతో విందు, ప్రజా సమస్యల పరిష్కారంపై నివేదిక అందజేత ఈ భేటీ సంబంధించిన మరిన్ని విషయాలు...

Published : 2026-02-13 10:55:00

Nara Lokesh Athmiya Samavesham 2026: రాజకీయాలకు మించిన అనుబంధం.. లోకేష్ ప్రత్యేక సమావేశం!

కుటుంబ సమేతంగా నేతలకు విందు… బాధ్యతాయుత నివేదికతో లోకేష్

అర్జీలపై సమగ్ర నివేదిక… నేతలకు లోకేష్ క్లారిటీ!

రాజకీయాలంటే  విమర్శలు ప్రతివిమర్శలు అధికారిక సమీక్షలే కాదు.. అంతకు మించిన  సంబంధాలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ నిరూపిస్తున్నారు. తాజాగా చిత్తూరు, అనకాపల్లి జిల్లాలకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో (MLAs families) లోకేష్ ఈరోజు ఆత్మీయ సమావేశం (Nara Lokesh Athmiya Samavesham 2026) ఏర్పాటు చేశారు. ఈ భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కుటుంబ సభ్యులతో సహా విందుకు ఆహ్వానం, సాధారణంగా రాజకీయ సమావేశాలంటే కేవలం ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరవుతారు. కానీ లోకేష్ ఈసారి విభిన్నంగా ఆలోచించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేవలం విందుకే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించారు.

ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజా సేవలో ఉంటూ కుటుంబానికి సరైన సమయం కేటాయించలేకపోతుంటారనే ఉద్దేశంతో వారందరికీ ఒక ఆహ్లాదకరమైన సాయంత్రాన్ని అందించాలనేది ఈ భేటీ ప్రధాన లక్ష్యం. ఈ విందు రాజకీయ చర్చలకు తావులేకుండా, పూర్తి వ్యక్తిగతమైన, స్నేహపూర్వక వాతావరణంలో సాగనుంది. ఈ సమావేశంలో మరో కీలకమైన అంశం ఏమిటంటే.. లోకేష్ తన బాధ్యతాయుతమైన పనితీరును నేతలకు వివరించనున్నారు. గతంలో ఆయా నియోజకవర్గాల నేతలు మంత్రికి ఇచ్చిన వివిధ రకాల అర్జీలు, ప్రజల సమస్యలపై లోకేష్ ఒక సమగ్ర నివేదికను సిద్ధం  చేశారని సమాచారం.

ఏయే సమస్యలు పరిష్కారమయ్యాయి?
ఏయే పనులు పురోగతిలో ఉన్నాయి?
పెండింగ్‌లో ఉన్న పనుల పరిస్థితి ఏమిటి? అనే వివరాలతో కూడిన నివేదికను స్వయంగా మంత్రి లోకేష్ ఆయా ప్రజాప్రతినిధులకు అందజేయనున్నారు. ఇది కేవలం విందు మాత్రమే కాదు, తాను ప్రజా సమస్యల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉన్నానో  చెప్పే ప్రయత్నం కూడా చెప్పుకోవచ్చు.

నియోజకవర్గ స్థాయి నేతలతో నేరుగా అనుబంధం పెంచుకోవడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని లోకేష్ భావిస్తున్నారు. కేడర్‌కు, నాయకత్వానికి మధ్య దూరం తగ్గించే ఇలాంటి ఆత్మీయ భేటీలు భవిష్యత్తులో మిగిలిన జిల్లాల నేతలతో కూడా కొనసాగనున్నాయి. రాజకీయాల ఒత్తిడి నుంచి తప్పుకుని, కాసేపు కుటుంబ సభ్యులతో గడపడం ద్వారా నేతల్లో కూడా ఉత్సాహం పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద లోకేష్ చేస్తున్న ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ వినూత్నంగా ఉండటంతో అటు కార్యకర్తలు, ఇటు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Spotlight

Read More →