Nara Lokesh Athmiya Samavesham 2026: రాజకీయాలకు మించిన అనుబంధం.. లోకేష్ ప్రత్యేక సమావేశం!
కుటుంబ సమేతంగా నేతలకు విందు… బాధ్యతాయుత నివేదికతో లోకేష్
అర్జీలపై సమగ్ర నివేదిక… నేతలకు లోకేష్ క్లారిటీ!
రాజకీయాలంటే విమర్శలు ప్రతివిమర్శలు అధికారిక సమీక్షలే కాదు.. అంతకు మించిన సంబంధాలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ నిరూపిస్తున్నారు. తాజాగా చిత్తూరు, అనకాపల్లి జిల్లాలకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో (MLAs families) లోకేష్ ఈరోజు ఆత్మీయ సమావేశం (Nara Lokesh Athmiya Samavesham 2026) ఏర్పాటు చేశారు. ఈ భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కుటుంబ సభ్యులతో సహా విందుకు ఆహ్వానం, సాధారణంగా రాజకీయ సమావేశాలంటే కేవలం ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరవుతారు. కానీ లోకేష్ ఈసారి విభిన్నంగా ఆలోచించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేవలం విందుకే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించారు.
ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజా సేవలో ఉంటూ కుటుంబానికి సరైన సమయం కేటాయించలేకపోతుంటారనే ఉద్దేశంతో వారందరికీ ఒక ఆహ్లాదకరమైన సాయంత్రాన్ని అందించాలనేది ఈ భేటీ ప్రధాన లక్ష్యం. ఈ విందు రాజకీయ చర్చలకు తావులేకుండా, పూర్తి వ్యక్తిగతమైన, స్నేహపూర్వక వాతావరణంలో సాగనుంది. ఈ సమావేశంలో మరో కీలకమైన అంశం ఏమిటంటే.. లోకేష్ తన బాధ్యతాయుతమైన పనితీరును నేతలకు వివరించనున్నారు. గతంలో ఆయా నియోజకవర్గాల నేతలు మంత్రికి ఇచ్చిన వివిధ రకాల అర్జీలు, ప్రజల సమస్యలపై లోకేష్ ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేశారని సమాచారం.
ఏయే సమస్యలు పరిష్కారమయ్యాయి?
ఏయే పనులు పురోగతిలో ఉన్నాయి?
పెండింగ్లో ఉన్న పనుల పరిస్థితి ఏమిటి? అనే వివరాలతో కూడిన నివేదికను స్వయంగా మంత్రి లోకేష్ ఆయా ప్రజాప్రతినిధులకు అందజేయనున్నారు. ఇది కేవలం విందు మాత్రమే కాదు, తాను ప్రజా సమస్యల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉన్నానో చెప్పే ప్రయత్నం కూడా చెప్పుకోవచ్చు.
నియోజకవర్గ స్థాయి నేతలతో నేరుగా అనుబంధం పెంచుకోవడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని లోకేష్ భావిస్తున్నారు. కేడర్కు, నాయకత్వానికి మధ్య దూరం తగ్గించే ఇలాంటి ఆత్మీయ భేటీలు భవిష్యత్తులో మిగిలిన జిల్లాల నేతలతో కూడా కొనసాగనున్నాయి. రాజకీయాల ఒత్తిడి నుంచి తప్పుకుని, కాసేపు కుటుంబ సభ్యులతో గడపడం ద్వారా నేతల్లో కూడా ఉత్సాహం పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద లోకేష్ చేస్తున్న ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ వినూత్నంగా ఉండటంతో అటు కార్యకర్తలు, ఇటు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు