Cycle Distribution: ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి పర్యటన..! విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ! Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు... జగన్ సన్నిహితులకు 10 గంటల విచారణ! Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.... కేజ్రీవాల్, సిసోడియా, కవితలకు షాక్! Digital Governance: ఢిల్లీ పర్యటనకు మంత్రి నారా లోకేష్... డిజిటల్ గవర్నెన్స్‌పై కీలక సదస్సు! Praja Vedika: నేడు (10/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: సర్కార్ కీలక నిర్ణయం... రాష్ట్రవ్యాప్తంగా 600 కొత్త ఈవీ ఛార్జింగ్ యూనిట్లు! Pattadar Passbook: రైతులకు చంద్రబాబు తీపికబురు... క్యూఆర్ కోడ్ పాసు పుస్తకాల పంపిణీ! Pawankalyan: జనసేన ఆవిర్భావ వేడుకలు రద్దు: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం! Nara Lokesh: వరద ముప్పుకు శాశ్వత పరిష్కారం.. రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేష్.. మంగళగిరిలో రూ.14.88 కోట్లతో Cycle Distribution: ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి పర్యటన..! విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ! Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు... జగన్ సన్నిహితులకు 10 గంటల విచారణ! Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.... కేజ్రీవాల్, సిసోడియా, కవితలకు షాక్! Digital Governance: ఢిల్లీ పర్యటనకు మంత్రి నారా లోకేష్... డిజిటల్ గవర్నెన్స్‌పై కీలక సదస్సు! Praja Vedika: నేడు (10/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: సర్కార్ కీలక నిర్ణయం... రాష్ట్రవ్యాప్తంగా 600 కొత్త ఈవీ ఛార్జింగ్ యూనిట్లు! Pattadar Passbook: రైతులకు చంద్రబాబు తీపికబురు... క్యూఆర్ కోడ్ పాసు పుస్తకాల పంపిణీ! Pawankalyan: జనసేన ఆవిర్భావ వేడుకలు రద్దు: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం! Nara Lokesh: వరద ముప్పుకు శాశ్వత పరిష్కారం.. రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేష్.. మంగళగిరిలో రూ.14.88 కోట్లతో

Nakkapalli Mittal Steel Plant: నక్కపల్లి మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు లైన్ క్లియర్: స్లర్రీ పైప్‌లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!!

Nakkapalli Mittal Steel Plant: నక్కపల్లి మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం ముడి సరుకు రవాణా చేసే స్లర్రీ పైప్‌లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఏపీలోని అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేస్తూ, అభ్యంతరాలుంటే 21 రోజుల్లోగా ఏపీఐఐసీ అధికారులకు తెలపాలని ఆదేశించింది.

Published : 2026-03-04 12:04:00

Nakkapalli Mittal Steel Plant: నక్కపల్లిలో నిర్మించనున్న మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. ఈ ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన స్లర్రీ పైప్‌లైన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇనుప ఖనిజాన్ని తక్కువ ఖర్చుతో, వేగంగా తరలించేందుకు ఈ పైప్‌లైన్ ఎంతో దోహదపడనుంది.

ఈ భారీ పైప్‌లైన్ ప్రాజెక్టు కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా, పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్ గుండా సాగనుంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని గనుల నుంచి ముడి సరుకును నేరుగా నక్కపల్లిలోని స్టీల్ ప్లాంట్‌కు చేరవేయడం ఈ పైప్‌లైన్ ప్రధాన ఉద్దేశ్యం. దీనివల్ల రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గడమే కాకుండా, పర్యావరణ కాలుష్యాన్ని కూడా అరికట్టవచ్చు.

పైప్‌లైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనికి సంబంధించి అధికారికంగా నోటిఫికేషన్ జారీ అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి  అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఈ పైప్‌లైన్ వెళ్లే మార్గంలో భూములను సేకరించనున్నారు. ఏ ఏ గ్రామాల గుండా ఈ లైన్ వెళ్తుందో ఆ వివరాలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.

భూసేకరణకు సంబంధించి రైతులకు లేదా స్థానికులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయడానికి కేంద్రం అవకాశం కల్పించింది. నోటిఫికేషన్ వచ్చిన 21 రోజుల్లోగా తమ విన్నపాలను సమర్పించాలని సూచించింది. విశాఖపట్నంలోని ఏపీఐఐసీ  స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో ఈ అర్జీలను అందజేయాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత భూసేకరణ ప్రక్రియ తదుపరి దశకు చేరుకుంటుందని అధికారులు స్పష్టం చేశారు.

మరోవైపు, నక్కపల్లి మిట్టల్ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. ఈనెల 7వ తేదీన శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. దీని కోసం నక్కపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతంలో వేల సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Spotlight

Read More →