ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ) ప్రసాదరెడ్డి బరితెగించి వైసీపీ సేవలో తరిస్తున్నారు. రాష్ట్రంలో తొలి విశ్వవిద్యాలయం ఆంధ్రా వర్సిటీని రాజకీయ కార్యకలాపాలకు అడ్డాగా మార్చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలను మించి జగన్ సేవలకు తన జీవితాన్ని అంకితం చేయడం వల్లే ఆయన్ను రెండోసారి వీసీగా నియమించినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ జెండాను భుజానికి ఎత్తుకుని ప్రచారం చేసిన ఆయన.. ఇప్పుడు వైసీపీ కు అనుకూలంగా రాజనీతిశాస్త్రం పీజీ విద్యార్థులతో సర్వేలు చేయిస్తున్నారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రెండో ఏడాదిలో 'అప్పటికి.. ఇప్పటికీ రాజకీయాల్లో మార్పు' అంశంపై ప్రాజెక్టు వర్క్ చేస్తున్నామని, ఇందులో భాగంగా సర్వే చేస్తున్నామంటూ ఫోన్లు చేసి, వివరాలు సేకరిస్తున్నారు. వైసీపీ నుంచి అందిన ఫోన్ నంబర్ల ఆధారంగా ఓటర్లకు ఫోన్ చేసి, సర్వే మాటున విద్యార్థులతో ప్రచారం చేయిస్తున్నారు. గ్రేటర్ విశాఖ నరగపాలక సంస్థ ఎన్నికల సమయంలో విద్యార్థులతో సర్వే చేయించారనే ఆరోపణలు ఉండగా.. ఇప్పుడు సాధారణ ఎన్నికల్లోనూ బరితెగించి అదే పంథాను కొనసాగిస్తున్నారు. మొదటిసారి వీసీ పదవీకాలం ముగిసే ముందు వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన ఆయన.. తనకు రెండోసారి వీసీ కిరీటం కట్టబెట్టడంతో ఆ రుణాన్ని సర్వే రూపంలో తీర్చుకుంటున్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
విద్యార్థిని: సర్.. నేను ఆంధ్రా వర్సిటీ పొలిటికల్ సైన్సు విద్యార్థినిని. ‘అప్పటికీ.. ఇప్పటికీ రాజకీయాల్లో మార్పు'పై ప్రాజెక్టు చేస్తున్నాను. ఇందుకోసం మీకు ఫోన్ చేశాను అంటూ మొదలెట్టి మీది ఏ జిల్లా? మీది ఏ నియోజకవర్గం? మీరు ఉండేది గ్రామమా? పట్టణమా? గతంలో ఏ పార్టీకి ఓటు వేశారు? ఇప్పుడు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? ఎందుకు వేస్తున్నారు లాంటి ప్రశ్నలతో సంభాషణ చేసి, అభిప్రాయాలు సేకరిస్తున్నారు.
పొరపాటున వీటిలో ఇన్వెస్ట్ చేసారా?? ఇంక మీ పిల్లల కలలు తీరినట్టే!!
ఒక్కో విద్యార్థికి రూ.3 వేల వరకు ఇచ్చి, ఈ సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. దీనికి ఓ ప్రొఫెసర్ నాయకత్వం వహిస్తున్నారు. విద్యార్థులతో సర్వేలు చేయిస్తూ ఆంధ్రా వర్సిటీని రాజకీయాలకు నిలయంగా మార్చిన వీసీ ప్రసాదరెడ్డిపై చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు డిమాండు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
తెలుగుదేశం పార్టీతో మాదిగలది శాశ్వత బంధం!! చంద్రబాబుతో మందకృష్ణ మాదిగ, ఎంఆర్పిఎస్ నేతలు భేటీ!!
విజయవాడ బస్టాండ్ లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం!! గంటపాటు జరిగిన ఆందోళనతో...
ఈనెల 27 నుంచి 31 వరకు చంద్రబాబు పర్యటన ఖరారు!! రేపు, ఎల్లుండి సొంత నియోజకవర్గం..
18 అసెంబ్లీ స్థానాల జనసేన అభ్యర్థుల ప్రకటన!! నియోజకవర్గల అభ్యర్థులు వీరే!!
బిజెపి ఆంధ్ర తో సహా 111 అభ్యర్థుల ప్రకటన!! RRR కు మొండి చెయ్యి!
కమ్మ నేతల ఒత్తిడితోనే కార్పొరేషన్ ఏర్పాటు! నేడు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి