వెంకటగిరి: రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని.. మరికొన్ని రోజుల్లో పతనం తప్పదన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన ‘రా.. కదలిరా..' సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, వైకాపా నేతల తీరుపై మండిపడ్డారు. జగన్ను గద్దె దించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
“రా.. కదలి రా..' అని పిలుపిస్తే వెంకటగిరి గర్జించింది. జగన్ రాజకీయ వ్యాపారి. మనందరినీ పెట్టుబడిగా పెట్టి రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. వైకాపాలో ఉంటూ జగన్ పాలన బాగోలేదని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. ప్రజాహితం కోసం మాట్లాడితే ఆయన్ను దూరం పెట్టేశారు. సీనియర్లను కూడా లెక్కచేయని అహంకారం జగన్ ది . ఈ సీఎం వెయ్యి తప్పులు చేశారు.. ఇంకా భరిస్తారా? జీతం కోసం అడిగితే ఉద్యోగులు జైలుకు వెళ్లే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. వైకాపా అధికారంలోకి వచ్చాక వెంకటగిరి తలరాత మారిందా? 25 ఏళ్ల క్రితం యువతకు ఐటీ అనే ఆయుధమిచ్చా.. అదే ఇప్పుడు వజ్రాయుధమైంది. టీడీపీ హయాంలో తిరుపతిని మొబైల్ హబ్ గా తీర్చిదిద్దాం.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
జగనన్న హౌసింగ్ కాలనీల్లో అవినీతే అవినీతి. రూ.15లక్షలకి ఎకరా భూమి కొనుగోలు చేసి, ప్రభుత్వానికి రూ.50కోట్లుకి అమ్మారు. కొండలు, గుట్టలు, చెరువులు అన్నీ మాయమయ్యాయి. రూ.4500కోట్ల విలువ చేసే సిలికాని ఈ దుర్మార్గులు దోచేశారు. సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల్లో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. కేజీఎఫ్ త్రీగా మార్చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి నిరాహారదీక్షకి దిగి పోరాటం చేశారు. అది ప్రజా సంపద, ప్రజలందరి కోసం వినియోగించాలి. జగన్ 45లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టాడు. ఇసుకంతా దోచేశారు. మొన్న బీచ్ శ్యాండ్ను అమ్మాలని చూస్తే, కోర్టు ఆపింది. జగన్కు ఓడిపోతామనే భయం పట్టుకుంది. ప్రజలు గెలవాలి జగన్ పోవాలి... . ఓటు అనే ఆయుధాన్ని ప్రజలు ఉపయోగించాలి అని చంద్రబాబు కోరారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి