అనంతపురం: వైకాపా ప్రభుత్వం పోలీసులను పరదాలు కట్టడానికి పరిమితం చేసిందని.. ఫలితంగా ఐదేళ్లలో నేరస్థులు రెచ్చిపోయారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. ప్రస్తుతం ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు గత ప్రభుత్వ పాపాల పర్యవసానమేనని అన్నారు. సోమవారం అనంతపురంలో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. "గత ప్రభుత్వం రాజకీయ ముసుగులో నేరస్థులను పెంచి పోషించింది. పోలీసులను తెదేపా నాయకుల ఇళ్ల వద్ద కాపలా కాయడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని అక్రమంగా అరెస్టు చేయడానికి వినియోగించింది. గత ఐదేళ్లలో నేరాల నియంత్రణ, నేరస్థులపై నిఘాను పూర్తిగా గాలికొదిలేసింది. ఇటీవల అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం చేసిన నిందితుల్లో ఒకరిపై గతంలోనే 37 కేసులు ఉన్నాయి. అప్పుడే వారిపై చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కాదు. మా ప్రభుత్వంలో నేరాల నియంత్రణపై దృష్టిసారించాం' అని తెలిపారు.
ఇంకా చదవండి: బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ తప్పుతుందా? ఈ యోగాసనాలు ట్రై చేయండి!
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు..
'వైకాపా మూకలు ఆడపిల్లలపై అసభ్యకర పోస్టులతో రెచ్చిపోతున్నాయి. ఆడపిల్లలపై అఘాయిత్యాలను చూసి మేమంతా ఎంతో బాధపడుతున్నాం. ఆ బాధతోనే ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ కూడా మాట్లాడారు. ఈ విషయంలో ఆయన బయటపడ్డారు.. మేం పడలేదు అంతే తేడా. అయినా నేరాల నియంత్రణపై బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించడంలో తప్పేముంది? కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుందోనని గోతికాడ నక్కలా వైకాపా కాచుకుంది. పవన్కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు చూసి నేను ఆయనతో మాట్లాడా. అక్కడేం జరిగిందో ఆయన వివరించారు. పిఠాపురంలో జరిగిన సమావేశంలో ఓ యువతి గత ప్రభుత్వంలో జరిగిన దౌర్జన్యాల గురించి ప్రస్తావించింది. కులం చూసి కేసులు కట్టారని సదరు యువతి ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో చలించిపోయిన పవన్ కల్యాణ్ కులాలు చూసి కేసులు నమోదు చేయడమేంటని గత ప్రభుత్వంలో పని చేసిన పోలీసుల తీరును తప్పుపట్టారు. ఇలాంటి వాటిపై బాధ్యత తీసుకోవాలని మాకు సూచించారు. అంతేకాని హోంమంత్రిగా నేను విఫలమైనట్లు ఆయన ఎక్కడా చెప్పలేదు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను నేను చాలా పాజిటివ్గా తీసుకున్నా' అని హోంమంత్రి అన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ కు భారీ షాక్! పార్టీకి మాజీ మంత్రి రాజీనామా!
11వ నెల 11వ తారీకు ఉదయం 11 గంటలకు ఆ 11 మంది వస్తారా? ఏపీ అసెంబ్లీ సమావేశాలు!
అమరావతి టవర్ల నిర్మాణానికి మళ్ళీ ఉపిరి! ఏడాదిలోనే పనులు పూర్తి చేయాలన్న కసరత్తు!
దేశంలోనే నెంబర్ వన్ గా ఏపీ నూతన క్రీడా పాలసీ! చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షల భారీ జీతం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్, ఈ ఛాన్స్ వదలొద్దు!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల వివరాలు! ఎవరో తెలుసా?
ఏపీలో పర్యాటక రంగానికి కొంత హంగులు.. విజయవాడ - శ్రీశైలం మధ్య సీ ప్లేన్! ప్రారంభం - టికెట్ రేట్!
కొత్త సంవత్సరం నుంచి ఈ రేషన్ కార్డులు చెల్లవు! వెంటనే ఇలా చేయండి - వారి కార్డులు రద్దు!
అన్నీ శుభవార్తలే... ఏపీకి అదృష్టంగా మారిన కేంద్రమంత్రి! ఆ జిల్లాల్లో పెరగనున్న స్థలాల రేట్లు!
ఆ మహిళ చేసిన పనికి బిత్తర పోయిన చంద్రబాబు! మరీ అంత దారుణంగానా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: