Chandrababu: పోలవరం పూర్తి లక్ష్యంగా ఢిల్లీలో సీఎం చంద్రబాబు! జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ భేటీ! Chandrababu: అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు.. విభజన హామీలపై అమిత్ షాతో కీలక చర్చ! Nara Lokesh: అమరావతిని ప్రపంచస్థాయి మైస్ హబ్‌గా తీర్చిదిద్దుతాం.. కొత్త పాలసీపై మంత్రి లోకేష్ ప్రకటన! Amaravati: భారతదేశంలోనే అత్యంత అద్భుత రాజధాని కాబోతున్న అమరావతి! హిందీ చానల్ల లో వైరల్ అవుతున్న వీడియోలు! అన్ని ప్రాజెక్టుల పూర్తి వివరాలతో! PM Modi: ఏడాది పాటు బంగారం కొనవద్దు.. దేశ ఆర్థిక వ్యవస్థ కోసం ప్రధాని మోదీ సంచలన విజ్ఞప్తి! CM Vijay: నిన్న సీఎంగా దేవుడి పేరిట.. నేడు ఎమ్మెల్యేగా మనస్సాక్షిగా.. విజయ్ వెరైటీ ప్రమాణం! Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు! Semi Ring Road: ఏపీలో ఆ జిల్లాకు మహర్దశ... 102 కి.మీ. మేర సెమీ రింగురోడ్డు, మారనున్న రూపురేఖలు! Star Hotels: అమరావతిలో స్టార్ హోటళ్ల జాతర... రూ. 200 కోట్లతో అంతర్జాతీయ స్థాయి వసతులు!! Amaravati: రూ. 1.85 కోట్లతో రీడెవలప్‌మెంట్... పర్యాటకులను అలరిస్తున్న అమరావతి ధ్యానబుద్ధ విగ్రహం!! Chandrababu: పోలవరం పూర్తి లక్ష్యంగా ఢిల్లీలో సీఎం చంద్రబాబు! జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ భేటీ! Chandrababu: అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు.. విభజన హామీలపై అమిత్ షాతో కీలక చర్చ! Nara Lokesh: అమరావతిని ప్రపంచస్థాయి మైస్ హబ్‌గా తీర్చిదిద్దుతాం.. కొత్త పాలసీపై మంత్రి లోకేష్ ప్రకటన! Amaravati: భారతదేశంలోనే అత్యంత అద్భుత రాజధాని కాబోతున్న అమరావతి! హిందీ చానల్ల లో వైరల్ అవుతున్న వీడియోలు! అన్ని ప్రాజెక్టుల పూర్తి వివరాలతో! PM Modi: ఏడాది పాటు బంగారం కొనవద్దు.. దేశ ఆర్థిక వ్యవస్థ కోసం ప్రధాని మోదీ సంచలన విజ్ఞప్తి! CM Vijay: నిన్న సీఎంగా దేవుడి పేరిట.. నేడు ఎమ్మెల్యేగా మనస్సాక్షిగా.. విజయ్ వెరైటీ ప్రమాణం! Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు! Semi Ring Road: ఏపీలో ఆ జిల్లాకు మహర్దశ... 102 కి.మీ. మేర సెమీ రింగురోడ్డు, మారనున్న రూపురేఖలు! Star Hotels: అమరావతిలో స్టార్ హోటళ్ల జాతర... రూ. 200 కోట్లతో అంతర్జాతీయ స్థాయి వసతులు!! Amaravati: రూ. 1.85 కోట్లతో రీడెవలప్‌మెంట్... పర్యాటకులను అలరిస్తున్న అమరావతి ధ్యానబుద్ధ విగ్రహం!!

Nara Lokesh: అమరావతిని ప్రపంచస్థాయి మైస్ హబ్‌గా తీర్చిదిద్దుతాం.. కొత్త పాలసీపై మంత్రి లోకేష్ ప్రకటన!

Nara Lokesh: సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేష్ అక్కడి ప్రముఖ సన్‌టెక్ సిటీని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను కూడా అంతర్జాతీయ స్థాయి “మైస్” హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Published : 2026-05-11 14:17:00

గ్లోబల్ ఈవెంట్లకు ఏపీని కేంద్రంగా మార్చే దిశగా లోకేష్ అడుగులు..

సింగపూర్ తరహాలో ఏపీలో మైస్ ఇండస్ట్రీ అభివృద్ధి..

సింగపూర్ పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అక్కడి ప్రముఖ సన్‌టెక్ సిటీని సందర్శించారు. ప్రపంచ స్థాయి సమావేశాలు, ప్రదర్శనలు, వ్యాపార ఈవెంట్లకు కేంద్రంగా పేరుగాంచిన ఈ ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి లోకేష్, ఆంధ్రప్రదేశ్‌ను కూడా అంతర్జాతీయ స్థాయి “మైస్” (MICE - Meetings, Incentives, Conferences and Exhibitions) హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

సన్‌టెక్ సిటీలో డీపీ అర్బన్ ఆర్కిటెక్ట్ సంస్థ డైరెక్టర్ ఆనందన్ కరుణాకరన్‌తో సమావేశమైన మంత్రి, రాష్ట్రంలో కొత్త మైస్ పాలసీని రూపొందిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ ఈవెంట్ నిర్వాహకులకు అనుమతులు త్వరగా అందించేందుకు విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలలో ప్రత్యేక బ్యూరోలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చర్యలతో విదేశీ సంస్థలు, అంతర్జాతీయ సదస్సులు, భారీ వ్యాపార ప్రదర్శనలను రాష్ట్రానికి ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలోని హోటల్ గదుల సంఖ్యను నాలుగు రెట్లు పెంచి 20 వేల వరకు తీసుకెళ్లాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని లోకేష్ చెప్పారు. ఇప్పటికే పలువురు జాతీయ, అంతర్జాతీయ హాస్పిటాలిటీ సంస్థలు అమరావతిలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. మైస్ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి అమరావతిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. అలాగే విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి మైస్ కేంద్రాన్ని నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.

భారత ప్రభుత్వ ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో విశాఖలో “ఆంధ్ర మండపం” ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. విశాఖ తీరప్రాంతం ఇప్పటికే గూగుల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ గ్లోబల్ టెక్ సంస్థలకు కేంద్రంగా మారుతోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డీపీ అర్బన్ ఆర్కిటెక్ట్ డైరెక్టర్ ఆనందన్ కరుణాకరన్ మాట్లాడుతూ, సింగపూర్ డౌన్‌టౌన్ వ్యాపార కేంద్రంలో ఉన్న సన్‌టెక్ సిటీని తమ సంస్థ రూపొందించిందని చెప్పారు. 42 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ వేదిక ప్రపంచ స్థాయి ఈవెంట్లకు ప్రసిద్ధి చెందిందన్నారు. సింగపూర్ టూరిజం బోర్డు విస్తృత ప్రచారంతో ఆ దేశాన్ని ప్రపంచంలోనే సురక్షితమైన, విశ్వసనీయమైన మైస్ గమ్యస్థానంగా నిలబెట్టిందని వివరించారు.

2040 నాటికి మైస్ సందర్శకుల ఖర్చును భారీగా పెంచి, టూరిజం ఆదాయాన్ని మూడు రెట్లు పెంచడం సింగపూర్ లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సన్‌టెక్ సిటీ, మెరీనా బే సాండ్స్ వంటి కేంద్రాలతో పాటు మరో కొత్త మైస్ హబ్ నిర్మాణంపై కూడా సింగపూర్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు. మంత్రి లోకేష్ పర్యటనతో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచస్థాయి ఈవెంట్ల గమ్యస్థానంగా మార్చే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Spotlight

Read More →