Amaravathi: అమరావతి స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో వేగం... 12 రోజుల్లోనే 16 గడ్డర్లు పూర్తి! HiTech Highway: ప్రయాణం ఇక సూపర్ ఫాస్ట్! తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే... Rail Parcel: రైల్వే స్టేషన్లకు వెళ్లనవసరం లేదు..! ఇక ఇంటి నుండే రైల్ పార్శిల్ బుకింగ్! Digital India: ఏపీ ప్రజలకు శుభవార్త...! ఇకపై 24 గంటలూ పోస్టల్ సేవలు షురూ! Nara Lokesh: చిల్లర దొంగలు - గజదొంగలు.. బొత్స వ్యాఖ్యలకు లోకేష్ అదిరిపోయే కౌంటర్..!! Chandrababu: అరటి, బొప్పాయి సాగుకు భరోసా - రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.!! AP Govt: ప్రతి ఇంటికీ తాగునీరు! అసెంబ్లీలో మంత్రి విడదల సునీత కీలక విజ్ఞప్తి...! Innovation AP: ఏపీ అభివృద్ధిలో మరో మైలురాయి...! సైన్స్ అండ్ ఇన్నోవేషన్ శాఖ ప్రారంభం! Postal Services: ఏపీ ప్రజలకు శుభవార్త! ఈ 11 నగరాల్లో 24 గంటల పాటు పోస్టల్ సేవలు...! AP Govt Schemes: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపుపై అసెంబ్లీలో కీలక చర్చ.!! Amaravathi: అమరావతి స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో వేగం... 12 రోజుల్లోనే 16 గడ్డర్లు పూర్తి! HiTech Highway: ప్రయాణం ఇక సూపర్ ఫాస్ట్! తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే... Rail Parcel: రైల్వే స్టేషన్లకు వెళ్లనవసరం లేదు..! ఇక ఇంటి నుండే రైల్ పార్శిల్ బుకింగ్! Digital India: ఏపీ ప్రజలకు శుభవార్త...! ఇకపై 24 గంటలూ పోస్టల్ సేవలు షురూ! Nara Lokesh: చిల్లర దొంగలు - గజదొంగలు.. బొత్స వ్యాఖ్యలకు లోకేష్ అదిరిపోయే కౌంటర్..!! Chandrababu: అరటి, బొప్పాయి సాగుకు భరోసా - రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.!! AP Govt: ప్రతి ఇంటికీ తాగునీరు! అసెంబ్లీలో మంత్రి విడదల సునీత కీలక విజ్ఞప్తి...! Innovation AP: ఏపీ అభివృద్ధిలో మరో మైలురాయి...! సైన్స్ అండ్ ఇన్నోవేషన్ శాఖ ప్రారంభం! Postal Services: ఏపీ ప్రజలకు శుభవార్త! ఈ 11 నగరాల్లో 24 గంటల పాటు పోస్టల్ సేవలు...! AP Govt Schemes: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపుపై అసెంబ్లీలో కీలక చర్చ.!!

Steel Bridge: ట్రాఫిక్ సమస్యలకు చెక్..! రూ.70 కోట్లతో స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం.. ఆ ప్రాంతం లోనే..!

 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డును పాత జాతీయ రహదారితో కలిపే కొత్

Published : 2025-11-03 13:00:00
Pm Modi: ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం.. పరిహారం ప్రకటింపు... టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణం!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డును పాత జాతీయ రహదారితో కలిపే కొత్త బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్ కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై నిర్మించబడుతోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి ఉండవల్లి సెంటర్‌కు వెళ్లే మార్గంలో కేఎల్‌రావు కాలనీ దగ్గర రూ.70 కోట్ల వ్యయంతో స్టీల్ వంతెన నిర్మాణ పనులు అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ADCL) ప్రారంభించింది. ఈ వంతెనను మూడు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వంతెన పూర్తయితే, కృష్ణా కరకట్టపై ప్రయాణించాల్సిన అవసరం లేకుండా వాహనాలు నేరుగా బ్రిడ్జి మీదుగా అమరావతికి చేరే వీలుంటుంది.

RDI Fund: ప్రైవేట్ పెట్టుబడులకి కొత్త అవకాశం… మోడీ ప్రారంభించిన RDI ఫండ్ !!

128 మీటర్ల పొడవుతో, నాలుగు లైన్లతో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఇప్పటికే పీడబ్ల్యూడీ వర్క్‌షాప్ దగ్గర పిల్లర్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే, అమరావతికి వెళ్లే వాహనాల రాకపోకలు వేగవంతమవుతాయి. కరకట్టపై తరచుగా ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు తగ్గిపోతాయి. అదే విధంగా, అధికారులు ఇంకో వంతెన నిర్మించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇది 16వ నంబర్ జాతీయ రహదారిని ఉండవల్లి సెంటర్‌లోని కేఎల్‌రావు కాలనీతో కలపనుంది. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంత ప్రజలు నేషనల్ హైవేకు వెళ్లాలంటే చెన్నై-కోల్‌కతా రైలు మార్గం, డెల్టా కాలువ దాటాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి రెండో వంతెన అవసరం ఏర్పడింది.

₹2000 నోటు చెల్లుబాటు అవుతుందా? RBI క్లారిటీ.. ఇకపై ఎక్కడ మార్చుకోవాలంటే?

ఇక సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించిన పనులు కూడా వేగవంతమవుతున్నాయి. అమరావతిని ప్రకాశం బ్యారేజీతో కలిపే ఈ రోడ్డు నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇటీవల పెనుమాక, ఉండవల్లి రైతులు ఈ ప్రాజెక్ట్ కోసం 12.40 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో రోడ్డు పనులు మరింత ఊపందుకున్నాయి. ఈ రోడ్డు పూర్తయితే, ప్రకాశం బ్యారేజీ నుంచి అమరావతికి నేరుగా ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా డెల్టా కాలువపై నిర్మాణం జరుగుతున్న కొత్త స్టీల్ బ్రిడ్జి ఈ రోడ్డుకు కీలక లింక్‌గా మారనుంది.

CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..!

ఇక రాబోయే రోజుల్లో మరో 5.6 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఈ భూముల భూసేకరణ ప్రక్రియ పూర్తయితే, సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం మరింత వేగంగా సాగుతుంది. అధికారులు రైతులతో చర్చలు జరుపుతూ సమన్వయం సాధిస్తున్నారు. ఈ రోడ్డు పూర్తయిన తర్వాత, అమరావతికి రాకపోకలు మరింత సులభతరం అవుతాయని, ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి ప్రజలకు సౌకర్యం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. రాజధాని అభివృద్ధికి ఈ వంతెనలు, రోడ్లు కీలక పాత్ర పోషించనున్నాయి.

ఇండియన్ రైల్వే నుంచి కీలక ప్రకటన! ఆ నాలుగు మార్గాలకు కొత్త వందే భారత్ సర్వీసులు!
నవంబర్‌లో బిగ్గెస్ట్ అప్‌డేట్.. మహేష్-రాజమౌళి సినిమా! భారత సినీ చరిత్రలోనే తొలిసారి..!
TET: సుప్రీంకోర్ట్ తీర్పుతో టీచర్ల ‘టెట్‌’ పరీక్ష భయం..! రివ్యూ పిటిషన్‌పై ఆశలు..!
Labubu: ది మాన్స్టర్స్ సిరీస్‌లో భాగమైన లబుబు.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షనర్స్‌ క్రేజ్‌!
అమరావతికి స్టీల్ వంతెన! రాజధాని కనెక్టివిటీకి కొత్త దిశ..
AI: ఇకపై మానవ మేధస్సు.. యాంత్రిక మేధస్సు సమ్మేళనమే భవిష్యత్తు.. సత్య నాదెళ్ల!

Spotlight

Read More →