Bhanu Prakash Reddy: వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావు.. తిరుమలలో భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. Tollplaza: టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత... రంగంలోకి దిగిన పోలీసులు! Chandrababu: అధికారులకు డెడ్‌లైన్ విధించిన సీఎం.. అమరావతిని కాంట్రాక్ట్ వర్క్‌లా చూడొద్దు! Nara Lokesh Karnataka Visit: కర్ణాటకలో మంత్రి నారా లోకేష్‌కు ఘనస్వాగతం.. సింధనూరులో హోరెత్తిన జై లోకేష్ నినాదాలు! Raghuramakrishna Case: ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న రఘురామ కేసు విచారణ! Vijay - Rashmika: విజయ్-రష్మికల 'ముగ్గురి' ముచ్చట: వైరల్ అవుతున్న క్రేజీ పోస్ట్! AP government: మాట తప్పని కూటమి సర్కార్.. అక్కడ హైకోర్టు బెంచ్ స్థల సేకరణ ప్రారంభం! హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. Chandrababu: ఏపీ జలాల్లో హైస్పీడ్ గస్తీ.. మత్స్యకారుల రక్షణకు 4 పెట్రోలింగ్ బోట్లు మంజూరు చేసిన సీఎం.. Ranabali Movie Update: సీమ గడ్డపై ‘రణబాలి’ గర్జన.. భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ పీరియడ్ డ్రామా! Karnataka Nara Lokesh: సింధనూరులో సెల్ఫీల సందడి: అభిమానులు, యువతతో కలిసి ముచ్చటించిన నారా లోకేష్.! Bhanu Prakash Reddy: వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావు.. తిరుమలలో భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. Tollplaza: టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత... రంగంలోకి దిగిన పోలీసులు! Chandrababu: అధికారులకు డెడ్‌లైన్ విధించిన సీఎం.. అమరావతిని కాంట్రాక్ట్ వర్క్‌లా చూడొద్దు! Nara Lokesh Karnataka Visit: కర్ణాటకలో మంత్రి నారా లోకేష్‌కు ఘనస్వాగతం.. సింధనూరులో హోరెత్తిన జై లోకేష్ నినాదాలు! Raghuramakrishna Case: ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న రఘురామ కేసు విచారణ! Vijay - Rashmika: విజయ్-రష్మికల 'ముగ్గురి' ముచ్చట: వైరల్ అవుతున్న క్రేజీ పోస్ట్! AP government: మాట తప్పని కూటమి సర్కార్.. అక్కడ హైకోర్టు బెంచ్ స్థల సేకరణ ప్రారంభం! హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. Chandrababu: ఏపీ జలాల్లో హైస్పీడ్ గస్తీ.. మత్స్యకారుల రక్షణకు 4 పెట్రోలింగ్ బోట్లు మంజూరు చేసిన సీఎం.. Ranabali Movie Update: సీమ గడ్డపై ‘రణబాలి’ గర్జన.. భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ పీరియడ్ డ్రామా! Karnataka Nara Lokesh: సింధనూరులో సెల్ఫీల సందడి: అభిమానులు, యువతతో కలిసి ముచ్చటించిన నారా లోకేష్.!

Chandrababu: ఏపీ జలాల్లో హైస్పీడ్ గస్తీ.. మత్స్యకారుల రక్షణకు 4 పెట్రోలింగ్ బోట్లు మంజూరు చేసిన సీఎం..

Chandrababu: ఆంధ్రప్రదేశ్ సముద్ర జలాల్లో మత్స్యకారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తమిళనాడు నుంచి బోట్లు అక్రమంగా ఏపీ జలాల్లోకి చొరబడటం వల్ల స్థానిక మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకూడదని ఆయన స్పష్టం చేశారు.

Published : 2026-04-04 12:40:00
  • Politics: తీర ప్రాంతంలో పెరగనున్న భద్రత: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యం..
     
  • "వేట సాఫీగా సాగాల్సిందే": ఇతర రాష్ట్రాల బోట్ల చొరబాటుపై చంద్రబాబు సీరియస్ వార్నింగ్..

Andhrapradesh Chandrababu: ఆంధ్రప్రదేశ్ సముద్ర జలాల్లో మత్స్యకారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తమిళనాడు నుంచి బోట్లు అక్రమంగా ఏపీ జలాల్లోకి చొరబడటం వల్ల స్థానిక మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా వెంటనే 4 అత్యాధునిక హైస్పీడ్ పెట్రోలింగ్ బోట్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. బాపట్ల నుంచి సూళ్లూరుపేట వరకు ఉన్న సముద్ర తీర ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేయాలని, ఇతర రాష్ట్రాల బోట్ల చొరబాట్లను అడ్డుకునేందుకు పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలపై జరిగిన సమీక్షలో కావలి ప్రాంత మత్స్యకారుల భూ సమస్యను పార్టీ నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు, మత్స్యకారుల భూములకు సంబంధించి దళారుల జోక్యం లేకుండా చూడాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి వేట సాఫీగా సాగేందుకు అవసరమైన అన్ని రక్షణ చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.

Spotlight

Read More →