Palla Srinivasa Rao: గాజువాక సమస్యలపై దిశా సమావేశంలో పల్లా! Healthy Food: ఈ 10 రకాల స్నాక్స్ మీరు ఎంత తిన్నా అస్సలు బరువు పెరగరట... Supreme Court: హతీరామ్‌జీ మఠం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు! Operation Sindoor: శత్రువుల గుండెల్లో వణుకు.. ఆపరేషన్ సింధూర్ 2.0కు రెడీ అవుతున్నాం- ఆర్మీ చీఫ్! USA: గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు అమెరికా ఊరట.. అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు! Chandrababu: వైసీపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ”గా ప్రజల్లో చర్చ! Double Decker Flyover: డబుల్ డెక్ర్ ఫ్లై ఓవర్‌పై కీలక అప్డేట్... రూ.1,000 కోట్లతో ఈ రూట్లో ఇక ట్రాఫిక్ సమస్యలకు చెక్!! Pawan Kalyan: తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫోకస్! Tiger Scare: పొలాల్లో పులి అడుగుజాడలు... భయాందోళనలో స్థానిక గ్రామాల ప్రజలు! Trump: ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక సమావేశం.. తుది నిర్ణయం? Palla Srinivasa Rao: గాజువాక సమస్యలపై దిశా సమావేశంలో పల్లా! Healthy Food: ఈ 10 రకాల స్నాక్స్ మీరు ఎంత తిన్నా అస్సలు బరువు పెరగరట... Supreme Court: హతీరామ్‌జీ మఠం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు! Operation Sindoor: శత్రువుల గుండెల్లో వణుకు.. ఆపరేషన్ సింధూర్ 2.0కు రెడీ అవుతున్నాం- ఆర్మీ చీఫ్! USA: గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు అమెరికా ఊరట.. అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు! Chandrababu: వైసీపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ”గా ప్రజల్లో చర్చ! Double Decker Flyover: డబుల్ డెక్ర్ ఫ్లై ఓవర్‌పై కీలక అప్డేట్... రూ.1,000 కోట్లతో ఈ రూట్లో ఇక ట్రాఫిక్ సమస్యలకు చెక్!! Pawan Kalyan: తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫోకస్! Tiger Scare: పొలాల్లో పులి అడుగుజాడలు... భయాందోళనలో స్థానిక గ్రామాల ప్రజలు! Trump: ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక సమావేశం.. తుది నిర్ణయం?

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భారీ భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. వేసవి సెలవులు, వారాంతం కలిసి రావడంతో శ్రీవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు.

Published : 2026-05-30 09:38:00

తిరుమలలో అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్.. శిలాతోరణం వరకు భక్తుల క్యూ..

ఒక్కరోజులో 78 వేల మందికి పైగా స్వామివారి దర్శనం..

తిరుమలలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. వేసవి సెలవులు, వారాంతం కలిసి రావడంతో శ్రీవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. శనివారం ఉదయం నాటికి ఉచిత దర్శనం కోసం ఏర్పాటు చేసిన అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకు కొనసాగుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనం పొందేందుకు సుమారు 24 గంటల సమయం పడుతోందని వెల్లడించారు. మరోవైపు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (శీఘ్రదర్శనం) కోసం వెళ్లే భక్తులకు 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు కూడా 4 నుంచి 6 గంటల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది.

భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ, శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, కుటుంబాలతో కలిసి వచ్చిన భక్తులు “గోవిందా… గోవిందా…” నామస్మరణతో తిరుమల కొండలు మార్మోగిస్తున్నారు. టీటీడీ విడుదల చేసిన వివరాల ప్రకారం, శుక్రవారం ఒక్కరోజే 78,389 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే 45,283 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా నమోదైంది. ఒక్కరోజులో హుండీ ద్వారా ₹4.15 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అదే రోజు మొత్తం 4.07 లక్షల లడ్డూలను విక్రయించారు. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమలలో అన్ని విభాగాల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. క్యూలైన్లలో భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం, వైద్యసేవలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

Spotlight

Read More →