మాజీ సీఎం కుటుంబానికి షాక్..లిక్కర్ స్కామ్‌లో కొడుకు అరెస్ట్‌!

భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త   ప్రతిష్టాత్మకంగా కేంద్రం ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లు ఇప్పుడు మరింత సౌకర్యాలను అందిస్తున్నాయి . ముఖ్యంగా చెన్నై – తిరునెల్వెలి రూట్‌లో నడుస్తున్న 27వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను అప్‌గ్రేడ్ చేసి, 16 కోచ్‌ల నుంచి 20 కోచ్‌లకు పెంచారు. దీంతో ప్రయాణికులకు 312 అదనపు సీట్లు లభ్యమవుతున్నాయి. మొదట 1128 సీట్లు ఉన్న ఈ ట్రైన్‌లో ఇప్పుడు మొత్తం 1440 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇది ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న కీలక నిర్ణయం అని చెపుకోవచ్చు .

సైన్స్, ప్రకృతి కలిసిన అద్భుతాలు.. నక్షత్రాల్లా మెరిసే మొక్కలు! అవి ఎక్కడున్నాయో తెలుసా?

ఈ ట్రైన్ 2023 సెప్టెంబర్ 24న ప్రధాని నరేంద్ర మోదీ చేత ఫ్లాగ్ ఆఫ్ చేయబడిన విషయం అందరికి తెలిసినదే . చెన్నై ఎగ్మోర్ నుంచి తిరునెల్వెలి వరకు 653 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 గంటల 45 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. వారానికి ఆరు రోజులు అంటే

Tirumala tirupathi: వెంకటాద్రి నిలయం వద్ద పీఏసీ-5 వసతి.. ఉపరాష్ట్రపతితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సీఎం!

మంగళవారం మినహా అన్ని రోజులు అందు బాటులో ఉంటుంది. మార్గమధ్యంలో తిరుచిరపల్లి, దిండిగుల్, మదురై, విరుధునగర్, తాంబరం, విల్లుపురం స్టేషన్లలో ఆగుతుంది. ఈ స్టాపేజ్‌లు స్థానిక ప్రయాణికులకు ఉపయోగపడతాయి.

Pahalgam terro: పహల్గాం ఉగ్రదాడి మిస్టరీ బహిర్గతం.. కీలక వ్యక్తి అదుపులో!

ఈ ట్రైన్ ప్రత్యేకత ఏమిటంటే – ఎప్పుడూ 90% పైగా ఆక్యుపెన్సీ ఉంటుంది. బిజినెస్ ప్రయాణాలు, ఫ్యామిలీ ట్రిప్స్ కోసం వేలాది మంది రోజూ దీన్ని ఉపయోగిస్తున్నారు. కానీ టికెట్ డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వెయిటింగ్ లిస్ట్ సమస్య వస్తోంది. కొత్త కోచ్‌లతో ఇప్పుడు ఆ సమస్య కొంత తాగుతుంది అని చెపుకోవచ్చు . ముఖ్యంగా ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడానికి  మరింత అవకాశాలు పెరుగుతాయి అని అధికారులు తెలుపుతున్నారు.

భారతదేశం ప్రపంచంలోనే నెం.1.. దేనిలో అంటే.. కేవలం వంట పదార్థం కాదు - ఆరోగ్య జీవనశైలిలో భాగం!

సౌకర్యాల విషయానికి వస్తే, వందే భారత్ ట్రైన్‌లలో ఇప్పటికే ఏసీ, వైఫై, ఫుడ్ సర్వీస్, బయో-టాయిలెట్లు వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు అదనపు కోచ్‌లు జోడించడం వల్ల మరింత మంది ఈ ఫీచర్లను మరింత మంది ఉపయోగించుకోవచ్చు.   ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా, స్థానిక ఎకానమీ, టూరిజంకి కూడా ఇది బూస్ట్ ఇస్తుంది. మదురై ఆలయాలు, తిరునెల్వెలి ప్రాంతాలు వంటి టూరిస్ట్ స్పాట్లకు వెళ్లే వారికి ఇది ఒక్క గొప్ప అవకాశం అని మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
 

మీరు కోటీశ్వరులు కావాలంటే.. ఈ మూడు ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది! లాభాలు, వివరాలు!
Festival offers: దసరా–దీపావళి షాపింగ్‌కి గోల్డెన్ ఛాన్స్..! లేపాక్షి, ఆప్కో రాయితీలతో వినియోగదారులకు డబుల్ ఫెస్టివ్ ట్రీట్..!
Urban Development: మున్సిపల్ చట్టంలో వరుస సవరణలు..! భవనాలు, ఓటర్లు, మున్సిపాలిటీ పేరులో కీలక మార్పులు..!
e-Aadhaar App: ఆధార్ లో చిన్న చిన్న మార్పులు కోసం ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు! కొత్త ఆధార్ యాప్ వచ్చేస్తోంది!
Mega DSC 2025: 15,941 మంది టీచర్‌లకు నియామక పత్రాలు..! ఐటి, విద్యాశాఖ మినిస్టర్స్ పర్యవేక్షణలో..!