Employees: ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త పెట్టుబడి ఆప్షన్స్‌..! లైఫ్‌ సైకిల్‌, బ్యాలెన్స్‌డ్‌ పథకాలకు ఆమోదం..!

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) ఆర్థిక రంగంలో మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు బంగారంపైనే తాకట్టు రుణాలు లభ్యమయ్యే పరిస్థితి ఉండగా, ఇకపై వెండిపైనా రుణాలు పొందే అవకాశం కల్పించింది. దేశీయ మార్కెట్‌లో వెండి ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం ప్రజలకు, ముఖ్యంగా చిన్న వ్యాపారులకు, ఆభరణాల వ్యాపారులకు, ఆర్థిక అవసరాలున్న కుటుంబాలకు ఉపశమనం కలిగించనుంది. ఆర్బీఐ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలు 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

అమరావతిలో ఆర్‌బీఐ కార్యాలయానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం – రూ.200 కోట్ల ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్!!

ఆర్బీఐ సూచనల ప్రకారం, వాణిజ్య బ్యాంకులు మరియు బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు (NBFCs) ఇకపై వెండి నగలు, ఆభరణాలు, కాయిన్స్‌ వంటి వాటిని తాకట్టు పెట్టుకుని రుణాలు మంజూరు చేయవచ్చు. అంటే, బంగారంపై రుణాలు తీసుకున్నట్లే, ఇప్పుడు వెండి ఆధారంగా కూడా రుణ సదుపాయం లభిస్తుంది. అయితే ఈ పథకం వెండి కడ్డీలు (Silver Bars), ETFs (Exchange Traded Funds)కు వర్తించదని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి గరిష్టంగా 10 కేజీల వరకు వెండిని తాకట్టు పెట్టి రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. అలాగే 500 గ్రాముల లోపు ఉన్న సిల్వర్‌ కాయిన్స్‌ను కూడా తాకట్టు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది.

Economic Zone: ఏపీలో 20 వేల ఎకరాల ఎకనామిక్ జోన్! 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం... మారబోతున్న ఆ 8 జిల్లాల రూపురేఖలు!

రుణ పరిమాణం పూర్తిగా వెండి ప్రస్తుత మార్కెట్‌ విలువ ఆధారంగా నిర్ణయించబడుతుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో వెండి ధర కేజీకి రూ.1.70 లక్షల వద్ద ఉంది. కొద్ది నెలల క్రితం వెండి ధర రూ.2 లక్షల మార్క్‌ దాటిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వెండి ఆధారంగా రుణాల సదుపాయం అనేకమందికి ఆర్థిక సౌలభ్యాన్ని కల్పిస్తుంది. ముఖ్యంగా నగదు ప్రవాహ సమస్యలు ఎదుర్కొంటున్న చిన్న వ్యాపారులు, జ్యువెలర్స్‌, స్వయం ఉపాధి వృత్తిదారులు దీనివల్ల లబ్ధి పొందే అవకాశం ఉంది.

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా! జొన్న రొట్టె vs రాగి రొట్టె.. ఇదే బెస్ట్!

వెండి ధరలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా వెండి వినియోగం కేవలం ఆభరణాల రంగంలోనే కాకుండా పారిశ్రామిక రంగాల్లో కూడా విస్తృతంగా పెరిగింది. సోలార్‌ ప్యానెల్స్‌, విద్యుత్‌ బ్యాటరీలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, కండక్టర్లు, వైద్య పరికరాలు, నీటి శుద్ధి పరికరాలు, ఫోటోగ్రఫీ తదితర రంగాల్లో వెండి వినియోగం భారీగా పెరుగుతోంది. ఈ పెరుగుదల వల్ల వెండి మార్కెట్‌ విలువ గణనీయంగా పెరిగింది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వెండి మార్కెట్‌ స్థిరీకరణకు తోడ్పడటమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థలో కొత్త పెట్టుబడి అవకాశాలను సృష్టించనుంది.

National Highway: ఏపీలో కొత్తగా మూడు రహదారులకు ప్రతిపాదనలు! ఆ జిల్లాకు మహర్దశ!
మరో 200 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించాలని ప్లాన్! మీరు ఎక్కడైనా భూమి ఇవ్వండి.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్య!
ఏపీకి రెడ్ అలెర్ట్ - 'మొంథా' తుఫా! 90-110 కి.మీ. వేగంతో.. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్!
రవితేజ 'మాస్ జాతర' సెన్సార్ పూర్తి.. విడుదల తేదీ ఖరారు - సెన్సార్ టాక్ ఏంటంటే..!
Railway Lines: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఆ రూట్లలో రైల్వే లైన్లపై కీలక ప్రకటన! రూ. 316 కోట్లతో...
నవంబర్ 1 నుంచి బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు! ఖాతాదారులు తప్పక తెలుసుకోండి!