రాబోయే 12 గంటల్లో తీవ్రత మరింత ఎక్కువ.. తీర ప్రాంత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దు - APSDMA హెచ్చరిక!

AP ElectronicsManufacturing:  ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల రంగానికి కేంద్రం మరో బలమైన బూస్ట్ ఇచ్చింది. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ స్కీమ్ (ECMS)–2025 కింద కేంద్ర ప్రభుత్వం రూ.765 కోట్ల పెట్టుబడిని ఆమోదించింది. దీని ద్వారా రాష్ట్రంలో కొత్తగా ఎలక్ట్రానిక్ తయారీ యూనిట్ ప్రారంభం కానుంది. ఇది ఏపీలో పరిశ్రమల విస్తరణకు కొత్త దశను సూచిస్తోంది.

TechNews: తక్కువ ధరలో హై క్వాలిటీ కెమెరా – కొత్త ఫోన్లతో టెక్ మార్కెట్‌లో మార్పు!

కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఏడూ యూనిట్లకు ఆమోదం లభించింది. వాటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్‌కు దక్కింది. ఈ యూనిట్‌ను సైర్మా స్ట్రాటెజిక్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. మొత్తం రూ.765 కోట్ల పెట్టుబడితో మల్టీ లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు (PCB) తయారీ యూనిట్‌ను నిర్మించనున్నారు.

Holiday for yards: మిర్చి, పసుపు యార్డులకు 2 రోజులు సెలవు.. తుపాన్ ప్రభావం నేపథ్యంలో రైతుల రక్షణ చర్యలు!

అంచనా ప్రకారం ఈ యూనిట్ ద్వారా 950 మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగాలు, ఇంకా పరోక్షంగా వందల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

Salary Rs 2.25 crore: తాడిపత్రి నుంచి కాలిఫోర్నియా వరకు.. ఏడాదికి రూ.2.25 కోట్ల జీతం.. సాత్విక్ రెడ్డి ప్రయాణం!

ఇటీవలి కాలంలో నారా లోకేష్ కృషి ఫలితం  ఏపీ ప్రభుత్వం పెట్టుబడుల వాతావరణాన్ని బలోపేతం చేయడానికి దృష్టి పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే రిలయన్స్, లులు గ్రూప్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులపై ఆసక్తి చూపిన విషయం ప్రత్యక్షంగా చెప్పనవసరం లేదు. ఈ  కొత్త ఎలక్ట్రానిక్స్ యూనిట్‌తో ఏపీ పరిశ్రమల మ్యాప్‌లో మరో ముఖ్యమైన బిందువు చేరనుంది.

UPI యుద్ధం షురూ.. ఫోన్‌పే, గూగుల్‌పేకు భారీ షాక్.. పోటీగా శ్రీధర్ వేంబు 'జోహో పే'!

ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి వచ్చే ఆర్థిక లాభాలు మల్టీ లేయర్ బోర్డులు తయారయ్యే ఈ యూనిట్‌ వల్ల స్థానిక సరఫరా గొలుసుకు చైతన్యం వస్తుంది. చిన్న, మధ్య తరహా యూనిట్లకు కూడా వ్యాపార అవకాశాలు పెరుగుతాయి.

AP Building Permission: అనుమతి లేకుండా కట్టారా? కఠిన చర్యలు తప్పవు! 2025 తర్వాత భవనాలపై ఏపీ ప్రభుత్వ ఘాటు హెచ్చరిక!!

దేశ వ్యాప్తంగా ఈ స్కీమ్ కింద రూ.5,532 కోట్ల పెట్టుబడి తో మొత్తం ఏడూ యూనిట్లు నిర్మించనున్నారు. వాటిలో ఐదు తమిళనాడులో, ఒకటి మధ్యప్రదేశ్‌లో, మరొకటి ఆంధ్రప్రదేశ్‌లో ఉండనుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 5,000 మందికి పైగా ఉపాధి లభించనుంది.

mirage review telugu: 'మిరాజ్' మూవీ రివ్యూ.. ట్విస్ట్‌లకు 'కేరాఫ్ అడ్రస్' జీతూ జోసెఫ్.. మరి ఈ సినిమా ఎలా ఉంది?

భారత ఎలక్ట్రానిక్స్ తయారీ దిశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలకంగా  మారిందని చెప్పుకోవచ్చు అయితే వచ్చే 3–4 సంవత్సరాల్లో ఏపీ ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారుతుందని అని చెప్పడంలో సందేహమే లేదు.

TDP NewZealand: ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం... న్యూజిలాండ్‌లో ఘనంగా జరుపుకున్న టీడీపీ ఎన్నారైలు!
Reservations: ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి రిజర్వేషన్లు... హైకోర్టు కీలక ఆదేశాలు!
Andhra Pradesh financial news: ఏపీకి ఆర్థిక ఊరట.. రూ.410 కోట్లు విడుదల – రైతులకు ప్రజలకు ఉపశమనం!