District Reorganization: ఆ నియోజకవర్గాల విలీనంపై ప్రభుత్వం మళ్లీ దృష్టి! కృష్ణా జిల్లాలోకి చేర్చే యోచన!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసైన్డ్ భూములపై మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా ముందడుగు వేసింది. ఫ్రీహోల్డ్‌ భూములపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం లోతైన చర్చ జరిపింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం, త్వరలోనే రాష్ట్ర ప్రజలకు ఈ విషయంపై తీపి కబురు అందించనున్నట్లు తెలిపారు. భూ కేటాయింపుల విధానంలో మార్పులు చేయాలనే ప్రతిపాదనలపై కూడా ఉపసంఘం చర్చించి సిఫారసులు సిద్ధం చేసింది. ఇక నుంచి భూముల కేటాయింపులు లీజు ప్రాతిపదికన మాత్రమే చేయాలని నిర్ణయం తీసుకుంది.

తక్కువ ధరలో మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌తో ప్రీమియం లుక్! 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో - డేటా సేఫ్‌గా ఉండాలంటే!

అసైన్డ్‌ భూముల చట్టం–1977లో సవరణల ప్రకారం, నిబంధనలు పాటించిన లబ్ధిదారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని రెవెన్యూ శాఖ సూచించింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, జిల్లా స్థాయి కమిటీల నివేదికల ఆధారంగా చర్యలు చేపట్టాలని సిఫారసు చేసింది. ఈ ప్రతిపాదనలకు ఉపసంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని రకాల భూములను ఫ్రీహోల్డ్ కింద అనుమతించకూడదనే అంశంపై వచ్చే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది.

Bhagavad Gita: హితకరమైన కోరికలతో జీవిస్తే ఫలితం తప్పదు.. గీతా సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -44!

వైసీపీ ప్రభుత్వం హయాంలో అసైన్డ్‌ చట్టంలో మార్పులు చేసి, 20 సంవత్సరాలు పూర్తయిన భూములను నిషేధ జాబితా నుండి తొలగిస్తూ రైతులకు శాశ్వత హక్కులు కల్పించింది. ఈ క్రమంలో 2023లో జారీ చేసిన జీవో 596 ద్వారా 13.59 లక్షల ఎకరాల భూములను ఫ్రీహోల్డ్‌గా మార్చారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దానిపై విచారణ జరిపి, అందులో 5.74 లక్షల ఎకరాలు చట్టవిరుద్ధంగా ఫ్రీహోల్డ్‌ చేయబడినట్లు గుర్తించింది. దీంతో ప్రభుత్వం గత ఆగస్టులో ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌పై నిషేధం విధించింది.

మొంథా తుపాను ప్రభావం.. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

ఇప్పుడు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల ప్రకారం 7.85 లక్షల ఎకరాల భూములను ఫ్రీహోల్డ్ చేయడానికి రెవెన్యూ శాఖ ప్రతిపాదన సిద్ధం చేసింది. లబ్ధిదారు చేతిలోనే భూమి ఉండి సాగు జరుగుతున్న వాస్తవిక కేసుల్లో మాత్రమే ఫ్రీహోల్డ్‌ అనుమతించాలని మంత్రులు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్ చేసిన 5.74 లక్షల ఎకరాలను తిరిగి నిషేధ జాబితాలో చేర్చాలని కూడా నిర్ణయించారు.

Cyclone: తుపాన్ ప్రభావం.. నిర్మలా సీతారామన్ పర్యటన వాయిదా.. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో!

అదనంగా పరిశ్రమలు, కంపెనీలు, సంస్థలకు ఇకపై భూములను లీజు ప్రాతిపదికన మాత్రమే కేటాయించాలని ఉపసంఘం సూచించింది. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందనే కాకుండా, భూముల దుర్వినియోగం తగ్గుతుందని భావిస్తోంది. మొత్తం మీద, అసైన్డ్‌ భూముల ఫ్రీహోల్డ్ వ్యవహారంపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది.

రూ.1,48,200 జీతంతో AIIMSలో ఉద్యోగాలు.. ఈరోజే లాస్ట్ డేట్ !
LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!
NCC కి సీసీఎల్ నుంచి రూ.6,829 కోట్ల మైనింగ్ ఆర్డర్! స్థానిక ఉపాధి అవకాశాలు!
“సార్ మిమ్మల్ని కలవాలనుంది, అపాయింట్‌మెంట్ ఇస్తారా?” గ్రంధి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు!
Upliance AI: కూరగాయలు కట్ చేయడం నుంచి సాంబార్ వండేవరకు – అన్నీ చేసే స్మార్ట్ కిచెన్ అసిస్టెంట్! ధర ఎంతంటే!