ఏపీలో ఆ 'కులం' పేరు మార్పు! ప్రభుత్వం వారికి కొత్త సహకార సంఘం ఏర్పాటు.. కొత్త పేరు ఎంతంటే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులకు శుభవార్తను అందించింది. రాష్ట్ర విభజన సమయంలో వివిధ కారణాల వల్ల ఏపీలో మిగిలిపోయిన తెలంగాణకు చెందిన ఉద్యోగులను చివరికి సొంత రాష్ట్రానికి పంపించే నిర్ణయం తీసుకుంది. మొత్తం 58 మంది క్లాస్‌–3 మరియు క్లాస్‌–4 ఉద్యోగులను తెలంగాణకు బదిలీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం దాదాపు 11 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు పెద్ద ఊరటగా మారింది.

Railway Development: కేంద్రం మరో తీపి కబురు! ఏపీలో ఆ ఐదు రైల్వే స్టేషన్లకు మహార్దశ... త్వరలో ఆధునిక హోల్డింగ్ జోన్లు!

రాష్ట్ర విభజన సమయంలో కొంతమంది ఉద్యోగులు అవగాహన లోపం కారణంగా లేదా కారుణ్య నియామకం కింద ఉద్యోగంలో చేరడం వల్ల తెలంగాణ ఆప్షన్‌ను ఎంచుకోలేకపోయారు. 2021లో జారీ చేసిన జీవో 37 ప్రకారం అప్పటికే 698 మంది తెలంగాణ ఉద్యోగులను సొంత రాష్ట్రానికి పంపించారు. ఇప్పుడు మిగిలిన 58 మందికి కూడా అదే అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం. వీరంతా తమను సొంత రాష్ట్రానికి పంపించాలని ఏళ్లుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు.

Drinking Water: ఈ ఆహార పదార్థాలు తీసుకున్న వెంటనే నీళ్లు తాగుతున్నారా! అయితే జాగ్రత్త...

తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయానికి అంగీకారం తెలిపింది. అయితే, వారు కొన్ని షరతులు విధించింది. ఉద్యోగులు ఏపీలో ఏ కేటగిరీ పోస్టులో పనిచేస్తున్నారో, తెలంగాణలో కూడా అదే కేటగిరీలో చేరాలని షరతు విధించారు. అదేవిధంగా సంబంధిత కేడర్‌లో చివరి ర్యాంక్‌లో చేరడానికి కూడా వారు ఒప్పుకోవాలి. ఈ షరతులను అంగీకరించిన వారికి మాత్రమే సొంత రాష్ట్రానికి వెళ్లే అవకాశం కల్పించబడింది.

NRI: తిరిగి అక్కడికి వెళ్లను! అమెరికా ఒత్తిడిని వదిలి ఆసియాలో స్థిరపడ్డ యువకుడు!

సీఎస్ విజయానంద్ ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత విభాగాధిపతులకు ఆదేశాలు ఇచ్చారు. అంగీకార పత్రంపై సంతకం చేసిన ఉద్యోగులను వెంటనే రిలీవ్ చేయాలని సూచించారు. దీంతో ఈ 58 మంది ఉద్యోగులు తాము ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న సొంత రాష్ట్రానికి చేరుకోబోతున్నారు. ఇది ఉద్యోగుల వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు కూడా సానుకూల ప్రభావం చూపనుంది.

Reduce Hip Fat Tips: హిప్ ఫ్యాట్ తగ్గించుకోవడం ఎలా? నిపుణుల సూచనలు, చిన్న మార్పులతో పెద్ద ఫలితం!

మొత్తం మీద, ఈ నిర్ణయంతో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఒక ముఖ్యమైన పరిపాలనా సమస్యకు పరిష్కారం లభించింది. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఇప్పుడు సొంత రాష్ట్రంలో సేవలందించే అవకాశం పొందుతున్నారు. దీని ద్వారా రెండు రాష్ట్రాల మధ్య సానుకూల వాతావరణం నెలకొని, ప్రభుత్వాల మధ్య సహకారం మరింత బలపడనుంది.

Bhagavad Gita: లౌకిక కార్యాలు కాదు.. ఆత్మజ్ఞానమే అసలైన సిద్ధి... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -48!
Gulf: ఐదేళ్ల నిరీక్షణకు తెర.. శవాన్ని భారత్‌కు తరలించడం సాధ్యం కాదని తెలిపిన ఎంబసీ అధికారులు!
Airports: విమానాశ్రయాలు లేని దేశాలు! కానీ పర్యాటకులలో మాత్రం సూపర్ క్రేజ్!
Jio: జియో 5G యూజర్లకు మెగా ఆఫర్‌! రూ.35,000 విలువైన గూగుల్ AI సేవ ఉచితం..!
USA: హెచ్-1బీ ఫీజు పెంపు తర్వాత మరో షాక్‌! ఉద్యోగులకు నూతన నియమాలు!