OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు... ఈ వీకెండ్ స్పెషల్!

ఆంధ్రప్రదేశ్‌లో రవాణా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు ఉన్న 113 కిలోమీటర్ల పొడవు గల ప్రధాన రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ మార్గం రాయలసీమ నుంచి వస్తున్న కూరగాయలు, సరుకుల రవాణాకు కీలకంగా మారనుంది.

Month of Shravan: ఈరోజు నుంచి శ్రావణమాసం ప్రారంభం.... పూజలకు పండితుల సూచనలు!

ప్రస్తుత రహదారి సన్నకారు కావడంతో, సంతనూతలపాడు, చీమకుర్తి, పొదిలి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా మర్రిచెట్లపాలెం - చీమకుర్తి మార్గం లారీలు, ట్రైలర్ల రాకపోకలతో ప్రమాద ప్రదేశంగా మారింది. దీనికితోడు ఆక్రమణల కారణంగా రోడ్డు మరింత ఇరుకుగా మారింది.

AP Govt: భారీ వర్షాలపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. ఆ జిల్లాలకు హై అలెర్ట్!

ఈ పరిస్థితులకు పరిష్కారంగా ఒంగోలు నుంచి బేస్తవారిపేట దాకా రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారీ ప్రస్తుతం జరుగుతోంది. అవసరమైన స్థలాన్ని గుర్తించేందుకు సర్వే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సంతనూతలపాడు, పొదిలి వద్ద బైపాస్ రోడ్లు కూడా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం–ప్రైవేట్ భాగస్వామ్యంతో (PPP మోడల్‌లో) చేపట్టనుంది.

Mining Case: మైనింగ్ కేసు.. ఐఎస్ఐ శ్రీలక్ష్మి కి హైకోర్టు లో చుక్కెదురు!

ప్రాజెక్టు పూర్తయితే అనంతపురం నేషనల్ హైవేతో కలుపుతూ మరింత విస్తృత రవాణా జాలం ఏర్పడనుంది. డీపీఆర్ పూర్తయిన తర్వాత ఖర్చు, భూ సేకరణ వివరాలు తేలనున్నాయని అధికారులు తెలిపారు.

AP Crime News: జగన్ కి దిమ్మతిరిగే షాక్.. జంట హత్యల కేసులో ఏ1గా వైకాపా నేత!
Cambodia Border Conflict: థాయ్‌లాండ్‌, కాంబోడియా బార్డ‌ర్‌లో ఉద్రిక్త‌త‌..! భారతీయులకు ఎంబ‌సీ కీలక సూచ‌న‌!
OTT Apps Banned: కేంద్రం సంచలన నిర్ణయం! ఆ 25 ఓటీటీ యాప్స్ కు షాక్!
Kurnool: కర్నూల్ జిల్లాలో రక్షణ శాఖ కీలక పరీక్ష..! డ్రోన్ మిసైల్ టెస్ట్!