బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఇంటికి ఒక్కసారిగా 25 మంది ఐపీఎల్ అధికారులు చేరుకోవడం సినీ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. బస్సులు, వ్యాన్లలో బాంద్రాలోని ఆమిర్ నివాసానికి వచ్చిన ఈ బృందం అనూహ్యంగా విజిట్ చేయడంతో సినీ జనాల్లో ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంతమంది ఐపీఎల్ అధికారులు ఒకేసారి ఆమిర్ ఇంటిని ఎందుకు సందర్శించారు? అనే ప్రశ్నపై నెటిజన్లు తలపట్టుకుంటున్నారు. మరికొంతమంది మాత్రం ఇది యాదృచ్ఛిక భేటీ కాదని, ప్రత్యేక కారణం ఉందని అనుమానిస్తున్నారు.
ఈ విషయం పై క్లారిటీ కోసం ఓ ఆంగ్ల మీడియా ఆమిర్ టీమ్ను సంప్రదించగా… "మా దగ్గర కూడా పూర్తి సమాచారం లేదు, ఆరా తీస్తున్నాం" అంటూ వారు స్పందించారు. వారు కేవలం ఆమిర్ను కలవడం కోసమే వచ్చారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
ఇంతలో మరోవైపు, ఆమిర్ ఖాన్ త్వరలో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్కు చీఫ్ గెస్ట్గా హాజరుకానున్నారు. ఈ ఫెస్టివల్లో ఆయన నటించిన క్లాసిక్ మూవీ సితారే జమీన్ పర్ ప్రదర్శించనున్నారు. ఐపీఎల్ బృందం ఆయనను ఆ గౌరవానికి సంబంధించిన విషయాల కోసమే కలిసిందా? లేక మరో మిస్టరీదేనా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.