ఆడబిడ్డల కోసం అద్భుతమైన పథకం.. మీ డబ్బును లక్షలు, కోట్లు చేసుకునే ఛాన్స్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రజలను పొదుపు మార్గం వైపు పయనింప జేసేలా సరికొత్త పథకాలు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే ఆడ పిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా ఇచ్చే ఓ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ట్యాక్స్ పేయర్స్కి గుడ్న్యూస్!! లక్ష వరకు పెండింగ్ ట్యాక్స్ మాఫీ!!
డబ్బు పొదుపు చేయడం అనేది ప్రతి ఒక్కరికీ ముఖ్యమే. ఓ ఆర్ధిక ప్రణాళికతో డబ్బు పొదుపు చేస్తే భవిష్యత్ బంగారం అవుతుంది. నేటి పొదుపు రేపటి ఫ్యూచర్ అనేది పెద్దల మాట. భవిష్యత్ అవసరాల కోసం ఎవరైతే ఓ క్రమానుగత పద్దతిలో పొదుపు చేస్తారో వారికి లాంగ్ టర్మ్ లో వారికి కాసుల వర్షం కురుస్తుంది.
అందుకే ప్రజలను పొదుపు మార్గం వైపు పయనింప జేసేలా సరికొత్త పథకాలు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే బోలెడన్ని స్కీమ్స్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి సుకన్య సమృద్ధి యోజన. ఆడ పిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా ఇచ్చేలా ఈ స్కీమ్ రూపకల్పన జరిగింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పథకం ఇది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా బిడ్డ పెళ్లి నాటికి ఈజీగా లక్షల్లో డబ్బు కూడబెట్టవచ్చు. పిల్లలు పెద్దవారైన తర్వాత వారి ఉన్నత చదువులతో పాటు పెళ్లి అవసరాలకు ఉపయోగపడేలా కేంద్ర ప్రభుత్వం ఈ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని డిజైన్ చేసింది.
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?? ఈ ఐదు విషయాలు తెలుసా మీకు?? లేదంటే తిప్పలే!!
ఈ పథకంలో ప్రతి నెలా కొంత మొత్తం పెట్టుబడి పెట్టి లాంగ్ టర్మ్ లో లక్షల రూపాయలు పోగేయవచ్చు. ఆడపిల్ల పుట్టిన మొదటి రోజు నుంచి ఆ బిడ్డకు పదేళ్లు వచ్చే లోపు ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. ఆడ బిడ్డకు పదేళ్లు దాటాక ఈ పథకంలోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ లేదు.
పొరపాటున వీటిలో ఇన్వెస్ట్ చేసారా?? ఇంక మీ పిల్లల కలలు తీరినట్టే!!
ఇందులో సంవత్సరానికి కనిష్టంగా 250 రూపాయల నుంచి గరిష్టంగా 1.5 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 15 ఏళ్ల వరకు ఈ పెట్టుబడి అలాగే కొనసాగించాలి. ఆ తర్వాత మరో ఆరేళ్లు లాకిన్ పీరియడ్ ఉంటుంది. అప్పుడు మీ మొత్తం సొమ్ము రిలీజ్ అవుతుంది. ఈ స్కీమ్ లో 8 శాతం వార్షిక వడ్డీ ఇస్తున్నారు. వడ్డీ అంతా కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ గా క్యాలూకిలేట్ కావడం వల్ల మెచ్యూరిటీ నాటికి భారీ సొమ్ము పోగవుతుంది.
సీనియర్లకు ఇదే మంచి ఆఫర్!! లక్ష జమచేస్తే చాలు ఎంత లాభమో!!
బిడ్డ పుట్టగానే ఓ ప్లాన్ ప్రకారం డిపాజిట్ చేస్తే ఆ బిడ్డ పెళ్లి నాటికి లక్షలు, కోట్లు కూడబెట్టవచ్చు. ఉదాహరణకు బిడ్డ పుట్టిన వెంటనే ఆమె పేరు మీద సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో చేరి నెలకు 5,000 పెట్టుబడి పెట్టడం ద్వారా 21 ఏళ్లకు 27 లక్షలు అందుకోవచ్చు.
దుబాయ్ లో బంగారం ధర చాలా తక్కువ! కారణం తెలుసా! మరీ అంత తేడానా?
ఈ పద్దతిలో నెలకు 5 వేలు పెడితే సంవత్సరానికి మీ పెట్టుబడి 60 వేలు అవుతుంది. ఇలా 15 సంవత్సరాల పాటు పెడతాం కాబట్టి మొత్తం 9 లక్షలపెట్టుబడి అవుతుంది. 15 నుంచి 21 సంవత్సరాల లాకింగ్ పీరియడ్ లో పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు. అయితే ఈ మొత్తానికి 8 శాతం చొప్పున చక్ర వడ్డీ రావడం వల్ల 9 లక్షలపై మీకు 17,93,814 జమ అవుతుంది. అంటే మీ 9 లక్షలకు ఈ వడ్డీ యాడ్ అయి మెచ్యూరిటీపై 26,93,814 వస్తుందన్నమాట.
ఇవి కూడా చదవండి:
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా!!
ప్రజాభిప్రాయంతోనే చంద్రబాబు సీటు ఖాయం చేశారు!! తటస్తులతో నారా లోకేష్
కరకట్టపై టీడీపీ ఫ్లెక్సీలు ధ్వంసం !! పట్టించుకోని పోలీసులు !!
నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పై విచారణ!!
పొత్తు ధర్మంతో టికెట్లు వదులుకున్న నేతలతో చంద్రబాబు భేటీ!! త్యాగాలు తప్పవు??
పల్నాడు: అల్లూరివారిపాలెంలో ఉద్రిక్తత!! 'ప్రజాపోరు' పై వైసీపీ దాడి!!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి