మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అవే రోజుల్లో అన్ని ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు వేలాదిగ తరలి వస్తారని, కాబట్టి స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఈవో పెద్దిరాజు స్పష్టం చేశారు.
ఇంకా చదవండి: శ్రీశైలంలో భక్తుల ఆందోళన!! వివాదంగా మారిన అటవీశాఖ నిర్ణయం!!
ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని కోరారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఉచిత దర్శనంతోపాటు శీఘ్ర, అతిశీఘ్ర దర్శనానికి ఆన్లైన్, కరెంట్ బుకింగ్కు ఏర్పాట్లు చేసినట్టు ఈవో పేర్కొన్నారు. శివస్వాములకు మాత్రం 1వ తేదీ నుంచి 5న సాయంత్రం వరకు నిర్దిష్ట వేళ్లలో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే 5న రాత్రి 7.30 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సైబర్ క్రైమ్ పోలీసులకు వైఎస్ షర్మిల ఫిర్యాదు!!
NRI మరియు OCI లకు వ్యత్యాసం ఏమిటి? ఆ సౌకర్యం వారికి ఉండదు!
ITR 2024: ఒకటి కంటే ఎక్కువ ఫామ్ - 16 ఉన్నవారికి సూచన - ఐటీ రిటర్న్ ఇలా ఫైల్ చేయాలి!
జీమెయిల్ సేవలు నిలిపివేతపై క్లారిటి ఇచ్చిన గూగుల్!!
"ఐ బొమ్మ" వాడేవారికి గుడ్ న్యూస్!! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి మరీ!!
ఎమ్మెల్యేలు, మంత్రులకే అందుబాటులో లేని ముఖ్యమంత్రి! ప్రజలకు అందుబాటులో ఉంటారా?
ఇడ్లీతో జీవవైవిధ్యానికి తీరని ముప్పు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు! అదేంటో తెలుసుకోండి!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: