కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన కోగంటి ఇందిరాదేవి కుమార్తె పి. విజయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వానికి రూ. కోటి విరాళం అందజేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఈ మేరకు చెక్కును ఇచ్చారు. ప్రస్తుతం హైదారాబాద్ ఫిల్మ్ నగర్లో నివాసం ఉంటున్న విజయలక్ష్మి.. అమరావతి నిర్మాణంలో తాము సైతం భాగస్వాములం కావాలనే ఉద్దేశంతో రూ.కోటి విరాళంగా ఇచ్చామని తెలిపారు. తమ తల్లి ఇందిరాదేవి పేరిట, ఆమె కోరిక నెరవేర్చేందుకు హైదరాబాద్లో తమకున్న స్థలాన్ని అమ్మి విరాళం ఇస్తున్నట్టు పి. విజయలక్ష్మి చెప్పారు. ఆమె త్యాగనిరతి, స్ఫూర్తిని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. స్థలం అమ్మి తల్లి పేరిట రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన విరాళం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. కోగంటి ఇందిరాదేవి గతంలో సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్గా ఉన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!
నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్! విశాఖ వస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. నెక్ట్స్ ఎవరు?
ఏమిటి.. పరగడపున ఈ పళ్లు తింటే! రోజువారీ ఆహారంలో - సమస్యలు తెచ్చుకున్నట్టేనట!
విజయవాడ ట్రాఫిక్ సమస్యలకు టెక్నాలజీ తోడు! డ్రోన్లు, ఎస్ఈడీ బోర్డులతో పోలీసుల ముందడుగు!
బూడిద తరలింపు వివాదం.. ఎమ్మెల్యేపై చంద్రబాబు ఫైర్! ఎందుకు అంటే!
మందుబాబులకు కిక్కే కిక్కు.. భారీగా తగ్గిన మద్యం ధరలు! ఆ వివరాలు మీ కోసం..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: