శరీరానికి అన్ని రకాల పోషకాలు అందే సమతుల ఆహారం తీసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. కూరగాయలు, పప్పులతోపాటు వివిధ రకాల పళ్లను కూడా రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తుంటారు. నిజానికి పళ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఉదయమే పరగడుపున కొన్ని రకాల పళ్లను తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేరే ఇతర ఆహారం తీసుకున్న తర్వాత... ఆ పళ్లను తీసుకుంటే మంచిదని స్పష్టం చేస్తున్నారు.
వాటర్ మెలన్స్ (పుచ్చకాయలు), అరటి పండ్లు...
బాగా పండిన పుచ్చకాయలు, అరటి పండ్లలో చక్కెరలు ఎక్కువ. ముఖ్యంగా ఫ్రక్టోజ్ తరహా చక్కెర ఉంటుంది. ఖాళీ కడుపుతో వీటిని తినడం వల్ల అజీర్తి, వికారం వంటి సమస్యలు వస్తాయి. మధుమేహం ఉన్నవారికి రక్తంలో షుగర్ స్థాయులు వేగంగా పెరుగుతాయి.
ఇంకా చదవండి: ఓరి దేవుడా.. ఏంటి నిజమా..! రోజు ఇడ్లీ తింటున్నారా? అయితే ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
పైనాపిల్స్ ....
ఈ పండ్లలో బ్రొమెలీన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ప్రోటీన్లను బ్రేక్ డౌన్ చేసే సామర్థ్యం ఉన్న ఈ ప్రోటీన్.. మన జీర్ణాశయం లోపలి కణాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఖాళీ కడుపుతో పైనాపిల్స్ తింటే... ఈ ఎంజైమ్ ప్రభావం ఎక్కువగా ఉండి ఇబ్బంది ఎదురవుతుంది.
సిట్రస్ జాతి పళ్లు...
నారింజ, బత్తాయి, నిమ్మ వంటి సిట్రస్ జాతికి చెందిన పళ్లను పరగడుపున తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. వాటిలో అధికంగా ఉండే సిట్రిక్ యాసిడ్ వల్ల ఎసిడిటీ (కడుపులో మంట), అజీర్తి వంటి సమస్యలు వస్తాయని వివరిస్తున్నారు.
ఇంకా చదవండి: తరచూ ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. అస్సలు అశ్రద్ధ చేయకండి! కేన్సర్ వ్యాధి కావొచ్చు!
బొప్పాయి పండ్లు...
పైనాపిల్స్ లో ఉన్నట్టుగానే బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. అది కూడా బ్రొమెలీన్ తరహాలోనే జీర్ణాశయంలో ఇబ్బందులకు కారణం అవుతుంది.
మామిడి కాయలు...
మామిడి కాయల్లో యాసిడ్లు, ఫైబర్ ఎక్కువ. పరగడుపున వాటిని తింటే.. జీర్ణాశయం, చిన్నపేగుల్లో ఇరిటేషన్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తికి దారితీస్తుందని స్పష్టం చేస్తున్నారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల మరో లిస్టు విడుదల?? పార్టీ శ్రేణుల్లో పెరిగిపోతున్న ఉత్కంఠ.. అసహనం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
బూడిద తరలింపు వివాదం.. ఎమ్మెల్యేపై చంద్రబాబు ఫైర్! ఎందుకు అంటే!
మందుబాబులకు కిక్కే కిక్కు.. భారీగా తగ్గిన మద్యం ధరలు! ఆ వివరాలు మీ కోసం..
వైసీపీకి మరో షాక్.. కొడాలి నాని మెడకు ఉచ్చు - అనూహ్య ట్విస్ట్! కీలక అంశాలు వెలుగులోకి...
నాగచైతన్య పెళ్లికి నాగార్జున ఇస్తున్న బహుమతి ఏమిటో తెలుసా? దాదాపు ఎనిమిది గంటల సమయం!
వైసీపీకి షాక్.. రోజాపై పోలీసులకు ఫిర్యాదు! ఫొటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్!
ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్! కొత్త రేషన్ కార్డులు! దరఖాస్తులు ఎప్పటినుంచి అంటే?
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! శ్రీవారి ప్రత్యేక దర్శనం, గోల్డెన్ ఛాన్స్! టోకెన్లు ఇలా...
ఏపీ మహిళల అకౌంట్లలో రూ.1,500... ఇది మీరు గమనించారా? అలా అస్సలు చేయవద్దు - ప్రభుత్వం కీలక అప్డేట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: