NEET-UG: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్! Ebola: భారత్‌లో ఎబోలా కేసులు లేవు.. ప్రజలు ఆందోళన చెందొద్దు.. కేంద్రం భరోసా! Chandrababu: మహానాడులో చంద్రబాబు రౌండ్ టేబుల్ వార్నింగ్.. "గొడ్డలి పార్టీకి నెవర్ అగైన్.. ఇగోలు వీడి కూటమితో కలిసి సాగండి!" Nara Lokesh: టీమ్ 11 కెప్టెన్‌కు లోకేశ్ ఓపెన్ ఛాలెంజ్ - ‘డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చెయ్... తేల్చుకుందాం! Nara Lokesh: చెప్పినట్టే 'భారీ ప్రకటన' చేసిన నారా లోకేశ్.. దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్‌గా మారిన టీడీపీ నిర్ణయం! Nara Lokesh: మహిళల్లో కొత్త ఆశలు నింపిన లోకేష్ నిర్ణయం.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు! NASA: చంద్రుడిపై ఇల్లు కట్టనున్న మానవుడు.. 2030 నాటికి నాసా శాశ్వత స్థావరం! Art Of Living: ఘనంగా ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ 45 ఏళ్ల వేడుకలు... తరలివచ్చిన దేశ విదేశీ ప్రముఖులు! Central Govt: జనాభా మార్పుల అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ! కేంద్రం కీలక నిర్ణయం! Chandrababu: వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించాం": మహానాడు ముగింపు వేదికగా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు! NEET-UG: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్! Ebola: భారత్‌లో ఎబోలా కేసులు లేవు.. ప్రజలు ఆందోళన చెందొద్దు.. కేంద్రం భరోసా! Chandrababu: మహానాడులో చంద్రబాబు రౌండ్ టేబుల్ వార్నింగ్.. "గొడ్డలి పార్టీకి నెవర్ అగైన్.. ఇగోలు వీడి కూటమితో కలిసి సాగండి!" Nara Lokesh: టీమ్ 11 కెప్టెన్‌కు లోకేశ్ ఓపెన్ ఛాలెంజ్ - ‘డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చెయ్... తేల్చుకుందాం! Nara Lokesh: చెప్పినట్టే 'భారీ ప్రకటన' చేసిన నారా లోకేశ్.. దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్‌గా మారిన టీడీపీ నిర్ణయం! Nara Lokesh: మహిళల్లో కొత్త ఆశలు నింపిన లోకేష్ నిర్ణయం.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు! NASA: చంద్రుడిపై ఇల్లు కట్టనున్న మానవుడు.. 2030 నాటికి నాసా శాశ్వత స్థావరం! Art Of Living: ఘనంగా ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ 45 ఏళ్ల వేడుకలు... తరలివచ్చిన దేశ విదేశీ ప్రముఖులు! Central Govt: జనాభా మార్పుల అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ! కేంద్రం కీలక నిర్ణయం! Chandrababu: వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించాం": మహానాడు ముగింపు వేదికగా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

Ebola: భారత్‌లో ఎబోలా కేసులు లేవు.. ప్రజలు ఆందోళన చెందొద్దు.. కేంద్రం భరోసా!

Ebola: ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాధి కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Published : 2026-05-27 14:48:00

ఎబోలా వైరస్‌పై భారత్ అప్రమత్తం.. కట్టుదిట్టమైన నిఘా చర్యలు..

బెంగళూరులో అనుమానితుడికి ఎబోలా నెగటివ్.. ఊపిరి పీల్చుకున్న అధికారులు..

ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాధి కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని సూచించింది.

ఇటీవల ఉగాండా నుంచి బెంగళూరుకు వచ్చిన ఓ వ్యక్తికి స్వల్పంగా ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపించడంతో అతడిని బెంగళూరులోని ప్రభుత్వ అంటువ్యాధుల ఆసుపత్రిలో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. వైద్య పరీక్షల కోసం అతడి నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కు పంపగా, పరీక్షల్లో ఎబోలా వైరస్ లేదని తేలింది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఎబోలా పరిస్థితిని కేంద్ర ఆరోగ్య శాఖ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ప్రజారోగ్య చర్యలను మరింత బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అంతర్జాతీయ విమానాశ్రయాలు సహా దేశంలోని అన్ని ప్రవేశ ద్వారాల వద్ద ప్రత్యేక స్క్రీనింగ్, నిఘా చర్యలు కొనసాగుతున్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అనుమానాస్పద లక్షణాలు ఉన్న వారిపై వైద్య పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపింది.

అఫవాహాలు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరింది. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య సమాచారాన్ని పంచుకోవద్దని సూచించింది. పరిస్థితిని ప్రభుత్వం పూర్తిగా నియంత్రణలో ఉంచిందని, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ భరోసా ఇచ్చింది.

Spotlight

Read More →