కల్తీ పాలపై ప్రభుత్వ సీరియస్.. డెయిరీ సీజ్!
కల్తీ పాలు సేవించి 20 మందికి కిడ్నీ వ్యాధి..
ప్రజల ప్రాణాలతో చెలగాటం.. కల్తీ పాల వ్యాపారులపై కఠిన చర్యలకు డిమాండ్..
Health Crisis Rajamundry: రాజమండ్రిలో చోటుచేసుకున్న కల్తీ పాల ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. కల్తీ పాలను సేవించడం వల్ల ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా తీవ్రమైన కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఈ విషాదకరమైన ఘటనలో ముగ్గురు చిన్నారులు కూడా చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, బాధితుల ఆరోగ్య పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. నిత్యవసర వస్తువులైన పాలపై కూడా ఇలాంటి కల్తీ జరుగుతుండటం [Food Safety] ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఘటనపై స్పందించిన జిల్లా యంత్రాంగం, కల్తీ పాలను సరఫరా చేస్తున్న డెయిరీని గుర్తించి తక్షణమే సీజ్ చేశారు. శాంపిల్స్ను ల్యాబ్కు పంపి, పాలల్లో కలిపిన రసాయనాలపై విచారణ మొదలుపెట్టారు. ప్రాథమిక విచారణలో పాలలో విషపూరితమైన పదార్థాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. కల్తీ పాల వ్యాపారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఘటనపై సమగ్ర విచారణ [Public Health] జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.