యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పనిచేస్తున్న భారతీయ ప్రవాసి అనస్ కడియరకం తన 16 ఏళ్ల ప్రయాణానికి గౌరవ సూచకంగా దేశంలోని అత్యున్నత నైపుణ్య కార్మిక అవార్డును అందుకున్నారు. ఎమిరేట్స్ లేబర్ మార్కెట్ అవార్డ్స్లో ‘అవుట్స్టాండింగ్ వర్క్ఫోర్స్’ వర్గంలో ప్రధాన విజేతగా నిలిచిన ఆయనకు దాదాపు ₹24 లక్షల నగదు, బంగారు నాణెం, ఆపిల్ వాచ్, ఫజా ప్లాటినం కార్డ్తో పాటు పలు బహుమతులు లభించాయి. ఈ విజయం ఆయన వృత్తి జీవితంలో ఒక పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు.
కేరళలోని కోజికోడ్ చెందిన అనస్ 2009లో అబూదాబిలోని ఎల్ఎల్హెచ్ డే కేర్ సెంటర్లో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా కెరీర్ను ప్రారంభించారు. మొదటి ఉద్యోగం నుంచి నిరంతరం ఎదుగుతూ సీనియర్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, ముసాఫ్ఫా రీజియన్ మేనేజర్ వంటి కీలక స్థానాలను పని చేయడం జరిగినది. ఆయన చేసిన కృషి చూపించిన నిబద్ధత కారణంగా ప్రస్తుతం ఎల్ఎల్హెచ్ హాస్పిటల్లో హ్యూమన్ రిసోర్స్ మేనేజర్గా దూసుకెళ్తున్నారు.
ఈ అవార్డు కార్యక్రమం షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆశ్రయంతో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాన పురస్కారాలను షేక్ థియాబ్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రదానం చేశారు. స్కీల్డ్ వర్కర్స్ విభాగంలో మేనేజ్మెంట్ & ఎగ్జిక్యూటివ్ శాఖలో అనస్తో పాటు ఎమ్స్టీల్ సైబర్ సెక్యూరిటీ అధిపతి అబ్దుల్లా అల్బ్రికీ కూడా అవార్డును అందుకున్నారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో మఫ్రాక్ కోవిడ్–19 హాస్పిటల్లో హెచ్ఆర్ కార్యకలాపాలకు ఆయన అందించిన సేవలు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఆ అత్యవసర సమయంలో ఆయన చూపిన ధైర్యం నాయకత్వం ‘హీరోస్ ఆఫ్ యుఏఈ’ పతకం, గోల్డెన్ వీసా రూపంలో మరో గౌరవాన్ని తెచ్చింది. ఆరోగ్య రంగంలో అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన చేసిన పనిని అధికారులు విపరీతంగా ప్రశంసించారు.
తన విజయాల వెనుక కుటుంబం, తోటి సిబ్బంది, బర్జీల్ హోల్డింగ్స్ నాయకత్వం అందించిన మద్దతే ఉందని అనస్ హృదయపూర్వకంగా తెలిపారు. ఈ అవార్డు తన ఒక్కడిదికాదని తనతో కలిసి ప్రతి దశలో నిలిచిన వారందరికీ చెందిందని పేర్కొన్నారు. యుఏఈ తన ఎదుగుదలను గమనించి ఇలాంటి గౌరవం ఇవ్వడం తనకు ఎంతో భావోద్వేగం కలిగించిందని చెప్పారు.
యుఏఈ అందించిన అవకాశాలు తనను మరింత సమర్థవంతమైన నాయకుడిగా తీర్చిదిద్దాయని అనస్ అభిప్రాయపడ్డారు. ముందుకు కూడా ఆరోగ్యకరమైన, సహాయక వాతావరణంతో కూడిన కార్యాలయాలను నిర్మించేందుకు పని చేస్తానని అన్నారు. ఈ దేశం తనకు ఇచ్చిన అవకాశాలకు ప్రతిఫలంగా సమాజానికి మరింత సేవ చేయడమే తన లక్ష్యమని తెలిపారు.