ఓటీటీ ప్లాట్ఫారమ్స్లో కంటెంట్పై ఎలాంటి నియంత్రణ లేదు. ఇటీవల సినిమాలు, వెబ్ సిరీస్ను తప్పనిసరిగా సెన్సార్ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం ఓటీటీ ప్లాట్ఫారమ్లకు హెచ్చరికలు జారీ చేసింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓటీటీ ఫారమ్లకు అడ్వైజరీని జారీ చేసింది. డ్రగ్స్ వినియోగాన్ని ప్రోత్సహించడం, గ్లామరైజ్ కంటెంట్ను చూపిస్తే.. దానిపై దర్యాప్తు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. సిరీస్లు, ఇతర కంటెంట్ను ప్రసారం చేస్తున్న సమయంలో డ్రగ్స్పై ప్రచారం చేయొద్దని సూచించింది. సినిమాలు, సీరియల్స్లో నటులు మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రోత్సహించే సన్నివేశాలను యూజర్ వార్నింగ్ లేకుండా ప్రసారం చేయకూడదని చెప్పింది. డ్రగ్స్ వినియోగాన్ని చూపించడం వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పింది. అలాంటి సున్నితమైన కంటెంట్ ద్వారా యువత ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన సీన్స్ చూపించే సమయంలో తప్పనిసరిగా హెచ్చరికలు ఉండాల్సిందేనని చెప్పింది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీకి మూడ్రోజుల వర్ష సూచన... ఆ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు!
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త! వారి గుండెల్లో నిలిచిపోనున్న CBN! ఒక్కొక్కరికి... ఎప్పటి నుంచి అంటే?
ఏపీకి మూడ్రోజుల వర్ష సూచన... ఆ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు!
పవన్ హామీని నిలబెడుతున్న చంద్రబాబు - సచివాలయంలో భేటీ! కీలక ఉత్తర్వులు..!
2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల! 21 ఐచ్ఛిక సెలవులు..
ఏపీలో కొత్త యూనివర్సిటీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఎక్కడ అంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: