Entertainment- డైరెక్టర్గా బాధ్యతలు.. జూలై 31న థియేటర్లలోకి సీఎం విజయ్ వారసుడి ‘సిగ్మా’!
మెగాఫోన్ పట్టిన సీఎం విజయ్ కొడుకు.. జేసన్ సంజయ్ తొలి సినిమా రిలీజ్ డేట్ ఖరారు!
సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్.. అఫీషియల్ పోస్టర్తో ‘సిగ్మా’ విడుదల తేదీ ప్రకటించిన మేకర్స్!
CM Vijay: కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు రాజకీయ నేత విజయ్ వారసుడు జేసన్ సంజయ్ సినీ పరిశ్రమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే ఆయన తన తండ్రిలా నటుడిగా కాకుండా, దర్శకుడిగా మెగాఫోన్ పట్టడం విశేషం. జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి చిత్రం ‘సిగ్మా’ (Sigma) విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో జూలై 31న విడుదల కాబోతోందని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు.
ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. లండన్ మరియు కెనడాల్లో ఫిల్మ్ మేకింగ్ కోర్సులు పూర్తి చేసిన జేసన్ సంజయ్, తన మొదటి సినిమా కోసమే ఒక పవర్ఫుల్ యాక్షన్ స్క్రిప్ట్ను సిద్ధం చేసుకున్నారు. ఇదొక హై-స్టేక్స్ హీస్ట్ (భారీ దోపిడీ) నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ కథ అని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. అలాగే రాజు సుందరం, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 31న తమిళంతో పాటు తెలుగు భాషల్లో కూడా ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది. విజయ్ కుమారుడి డైరెక్షన్ లో వస్తున్న తొలి సినిమా కావడంతో సౌత్ సినిమా ఇండస్ట్రీలో ‘సిగ్మా’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.