CUET Application: విద్యార్థులకు గుడ్ న్యూస్...! సీయూఈటీ దరఖాస్తుకు మరో ఛాన్స్! YUVIKA Training: అంతరిక్షంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇస్రో అవకాశం.. YUVIKA ట్రైనింగ్.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం! Education News: నేటి నుంచే ఏపీ మోడల్ స్కూల్స్ ప్రవేశాలకు దరఖాస్తులు.!! Inter Exams 2026: ఏపీలో రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు! కొత్త నిబంధనలు... ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ! School Holidays: విద్యార్థులకు పండగే పండగ..! మార్చి నెలలో స్కూళ్లకు సెలవులే సెలవులు..! EMagicBox: చిన్నారుల చదువులో సరికొత్త విప్లవం...! ఎన్సీఈఆర్టీ ఈ-మ్యాజిక్ బాక్స్ పూర్తి వివరాలివే..! Halfday Schools: ఏపీలో ఒంటి పూట బడులు షురూ! మార్చి 16 నుంచే... విద్యాశాఖ తాజా ఆదేశాలు! ISRO Internship: బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్..! ఇస్రోలో ఇంటర్న్‌షిప్ చేసే ఛాన్స్..! JEE Main: జేఈఈ మెయిన్ 2026 పేపర్-2 కీ విడుదల..! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి! AP RJC CET: ఏపీఆర్‌జేసీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల..! ఇంటర్‌లో ఉచిత విద్యకు సువర్ణావకాశం! CUET Application: విద్యార్థులకు గుడ్ న్యూస్...! సీయూఈటీ దరఖాస్తుకు మరో ఛాన్స్! YUVIKA Training: అంతరిక్షంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇస్రో అవకాశం.. YUVIKA ట్రైనింగ్.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం! Education News: నేటి నుంచే ఏపీ మోడల్ స్కూల్స్ ప్రవేశాలకు దరఖాస్తులు.!! Inter Exams 2026: ఏపీలో రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు! కొత్త నిబంధనలు... ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ! School Holidays: విద్యార్థులకు పండగే పండగ..! మార్చి నెలలో స్కూళ్లకు సెలవులే సెలవులు..! EMagicBox: చిన్నారుల చదువులో సరికొత్త విప్లవం...! ఎన్సీఈఆర్టీ ఈ-మ్యాజిక్ బాక్స్ పూర్తి వివరాలివే..! Halfday Schools: ఏపీలో ఒంటి పూట బడులు షురూ! మార్చి 16 నుంచే... విద్యాశాఖ తాజా ఆదేశాలు! ISRO Internship: బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్..! ఇస్రోలో ఇంటర్న్‌షిప్ చేసే ఛాన్స్..! JEE Main: జేఈఈ మెయిన్ 2026 పేపర్-2 కీ విడుదల..! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి! AP RJC CET: ఏపీఆర్‌జేసీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల..! ఇంటర్‌లో ఉచిత విద్యకు సువర్ణావకాశం!

School Holiday: ఈరోజు కూడా ఆ స్కూల్స్ కి సెలవు.. ఎందుకంటే..! కారణం ఇదే..!

 మొంథా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోయింది. బలమైన గాలులు, వర్షాల నడుమ మంగళవారం అర్ధరాత్రి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య పశ్చిమ గ

Published : 2025-10-30 09:41:00
Andhra Pradesh cyclone: మొంథా తుఫాన్‌పై సీఎం చంద్రబాబు కఠిన సమీక్ష – ప్రతి కుటుంబానికి సాయం చేరాలి!!

మొంథా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోయింది. బలమైన గాలులు, వర్షాల నడుమ మంగళవారం అర్ధరాత్రి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీపంలో తుఫాన్ తీరం దాటింది. ఈ ప్రక్రియ రాత్రంతా కొనసాగి, బుధవారం తెల్లవారుజామున తుపాను బలహీనమై తీవ్ర వాయుగుండంగా మారింది. అనంతరం ఇది ఉత్తరాంధ్ర మీదుగా దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ దిశగా కదిలింది. బుధవారం సాయంత్రానికి ఇది వాయుగుండంగా బలహీనపడినా, దాని ప్రభావంతో గురువారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

Amaravati Land Plots: అమరావతి రైతులకు శుభవార్త.. ప్లాట్ల కేటాయింపుపై డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం!

ఈ తుఫాన్ ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాల్లో రవాణా అంతరాయం ఏర్పడగా, తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో నీరు చేరింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

State Festival: తెలుగు భాషా సేవకుడికి రాష్ట్ర గౌరవం..! ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం!

తుఫాన్ ప్రభావం దృష్ట్యా జిల్లాల వారీగా అధికారులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఈ రోజు అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. ఇదే విధంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ కూడా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. పలు స్కూళ్లలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, నిర్వాసితులకు వసతి కల్పించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ప్రాథమిక పాఠశాలలకు సెలవు ప్రకటించగా, అప్పర్ ప్రైమరీ మరియు హై స్కూళ్లు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఇక కాకినాడ జిల్లాలో అక్టోబర్ 31 వరకు సెలవులు ఇవ్వగా, ఆ తర్వాత స్కూళ్లను తిరిగి ప్రారంభించారు.

International news: వాణిజ్య యుద్ధానికి శాంతి సంకేతం! బుసాన్‌లో ట్రంప్–షీ భేటీ చర్చనీయాంశం!!

రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం తీవ్రంగా నమోదైంది. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యధిక వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 10 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 23.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం కూడా ఎన్టీఆర్, పల్నాడు, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొనసాగాయి. తుఫాన్ తీరం దాటినప్పటికీ, సముద్రం ఇంకా అలజడిగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త! ఇక ఆ సమస్యలకు చెక్!
Health tips: బాల్యంలో పోషకాహారం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? – తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్య సూచనలు ఇవే!!
మొంథా తుఫాన్‌ విధ్వంసం! రూ.18 కోట్ల భారీ నష్టం! ప్రభుత్వ సహాయక చర్యలు!
రైల్వే శాఖ కీలక నిర్ణయం! రూ.188 కోట్ల భారీ ప్రణాళిక... హైదరాబాద్‌–విజయవాడ ప్రయాణం మరింత వేగవంతం!
'మోంథా' తుపానుపై సీఎం చంద్రబాబు యుద్ధభేరి.. వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం డెడ్‌లైన్! 5 రోజుల్లో..
Bhagavad Gita: అవివేకాన్ని చెరిపి ఆత్మస్వరూపాన్ని జ్ఞాపకం చేసే గీతామాతకు నమస్కారం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -47!

Spotlight

Read More →