Tirumala: తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. పాల్గొన్న టీటీడీ చైర్మన్! సర్వదర్శనానికి 18 గంటల సమయం... Tirupati: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..! ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్.. ఇలా దరఖాస్తు చేసుకోండి! Arjita Seva Ticket: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూన్ నెల దర్శన టికెట్ల కోటా విడుదల! Talambaralu: సీతారాముల కల్యాణ తలంబ్రాలు కావాలా? ఆర్టీసీ కార్గోలో బుక్ చేసుకోండిలా! Simhachalam: సింహాచలంలో డిజిటల్ విప్లవం...! గంటల తరబడి వేచి ఉండే పనిలేదిక! KumbhMela: కేరళ కుంభమేళా... 250 ఏళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న 'మామాంకం'! Tirumala: తిరుమల లైవ్ అప్‌డేట్స్! పెరిగిన భక్తుల రద్దీ... సర్వదర్శనానికి 24 గంటల సమయం! TTD: శ్రీవారి తల్లి సన్నిధిలో మీ బిడ్డకు అక్షరాభ్యాసం..! టీటీడీ అద్భుత అవకాశం! Tirumala: తిరుమల యాత్రకు వెళ్తున్నారా... నేటి దర్శన సమయాల వివరాలు ఇవే! Tirumala Update: తిరుమల అప్‌డేట్! 29 కంపార్ట్‌మెంట్లు హౌస్‌ఫుల్.. పెరిగిన భక్తుల రద్దీ! Tirumala: తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. పాల్గొన్న టీటీడీ చైర్మన్! సర్వదర్శనానికి 18 గంటల సమయం... Tirupati: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..! ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్.. ఇలా దరఖాస్తు చేసుకోండి! Arjita Seva Ticket: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూన్ నెల దర్శన టికెట్ల కోటా విడుదల! Talambaralu: సీతారాముల కల్యాణ తలంబ్రాలు కావాలా? ఆర్టీసీ కార్గోలో బుక్ చేసుకోండిలా! Simhachalam: సింహాచలంలో డిజిటల్ విప్లవం...! గంటల తరబడి వేచి ఉండే పనిలేదిక! KumbhMela: కేరళ కుంభమేళా... 250 ఏళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న 'మామాంకం'! Tirumala: తిరుమల లైవ్ అప్‌డేట్స్! పెరిగిన భక్తుల రద్దీ... సర్వదర్శనానికి 24 గంటల సమయం! TTD: శ్రీవారి తల్లి సన్నిధిలో మీ బిడ్డకు అక్షరాభ్యాసం..! టీటీడీ అద్భుత అవకాశం! Tirumala: తిరుమల యాత్రకు వెళ్తున్నారా... నేటి దర్శన సమయాల వివరాలు ఇవే! Tirumala Update: తిరుమల అప్‌డేట్! 29 కంపార్ట్‌మెంట్లు హౌస్‌ఫుల్.. పెరిగిన భక్తుల రద్దీ!

TTD: శ్రీవారి బంగారు డాలర్ల అమ్మకాలకు బ్రేక్…! టీటీడీ కీలక నిర్ణయం!

దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరగడంతో తిరుమలలో శ్రీవారి బంగారు, వెండి డాలర్ల అమ్మకాలను టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. ధరల వ్యత్యాసంతో నష్టం నివారించేందుకు కొత్త విధానం అమలు చేయాలని నిర్ణయించింది.

Published : 2026-01-31 10:49:00


తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తులకు విక్రయించే శ్రీవారి బంగారం, వెండి డాలర్ల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు అతి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే టీటీడీ వద్ద డాలర్ల ధరలు తక్కువగా ఉండటంతో, భక్తులు పెద్ద సంఖ్యలో కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఈ కారణంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచే విక్రయ కౌంటర్లను మూసివేశారు.

గత కొంతకాలంగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. అయితే టీటీడీ నిబంధనల ప్రకారం శ్రీవారి బంగారం, వెండి డాలర్ల ధరలను వారానికి ఒకసారి మాత్రమే, ప్రతి మంగళవారం సవరిస్తారు. కానీ, మార్కెట్‌లో రోజువారీగా ధరలు మారుతుండటంతో టీటీడీ నిర్ణయించిన ధరలకు మరియు మార్కెట్ ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఈ పరిస్థితి వల్ల టీటీడీకి ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశాలు కనిపించడంతో పాటు, విక్రయాల్లో అసమతుల్యత ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు.

ఈ వ్యత్యాసాన్ని గమనించిన భక్తులు ముఖ్యంగా 5 గ్రాములు, 10 గ్రాముల బంగారు డాలర్లను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేయడం ప్రారంభించారు. సాధారణంగా దర్శనార్థం వచ్చే భక్తులతో పాటు వ్యాపార దృష్టితో కూడా కొందరు కొనుగోళ్లకు ముందుకు రావడం వల్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో పరిమిత సమయంలోనే భారీ మొత్తంలో డాలర్లు విక్రయమవడంతో టీటీడీ వెంటనే పరిస్థితిని సమీక్షించి అమ్మకాలను నిలిపివేయాల్సి వచ్చింది.

ఈ నష్టాలను నివారించడంతో పాటు విక్రయాల్లో పారదర్శకత పెంచేందుకు టీటీడీ కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇకపై తిరుపతి బులియన్ మార్కెట్‌కు అనుగుణంగా రోజువారీ ధరలను ప్రకటించి డాలర్లను విక్రయించే యోచనలో ఉంది. అలాగే శ్రీవారి దర్శనం టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే ఒక్కొక్కరికి ఒక డాలర్ చొప్పున అమ్మాలని భావిస్తోంది. రూ.50 వేలకుపైగా కొనుగోలు చేసే భక్తులు తప్పనిసరిగా పాన్ కార్డు వివరాలు సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చి, డాలర్ల విక్రయాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు పేర్కొంటున్నాయి.
 

Spotlight

Read More →