Minister Nimmala: పోలవరం ఎడమ కాలువ పనులు పరిశీలించిన మంత్రి.. జూన్ నాటికి అనకాపల్లి వరకు..! Praja Vedika: సొంత స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా అడ్డుపడుతున్న వైసీపీ నేతపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! సర్వేను అడ్డుకుంటూ భూకబ్జా యత్నం.. Chandrababu: నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా పురస్కారం.. చంద్రబాబు పాలనా దక్షతకు ఎకనమిక్ టైమ్స్ పట్టా.! Singapore: సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం: స్మార్ట్ సిటీల రూపకల్పనపై కీలక అధ్యయనం! AshokBabu: ఎమ్మెల్సీల రాజీనామాలపై ఏడాది కాలంగా కుట్ర - అశోక్ బాబు ధ్వజం! Tirumala Laddu Controversy: తిరుమల నెయ్యి కల్తీ వెనుక ఎవరు? ఏకసభ్య కమిషన్ నివేదికపై ఉత్కంఠ! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Iran War: అమెరికాతో ముఖాముఖి చర్చల్లేవు.. ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టీకరణ.. UAE Government: యూఏఈ సంచలన నిర్ణయం: 2028 నాటికి 50% ప్రభుత్వ పనులు ఏఐ వశం! Hikkim Post Office: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోస్టాఫీస్.. ఇక్కడి నుంచి ప్రియమైన వారికి పోస్ట్‌కార్డుల సందడి.! Minister Nimmala: పోలవరం ఎడమ కాలువ పనులు పరిశీలించిన మంత్రి.. జూన్ నాటికి అనకాపల్లి వరకు..! Praja Vedika: సొంత స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా అడ్డుపడుతున్న వైసీపీ నేతపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! సర్వేను అడ్డుకుంటూ భూకబ్జా యత్నం.. Chandrababu: నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా పురస్కారం.. చంద్రబాబు పాలనా దక్షతకు ఎకనమిక్ టైమ్స్ పట్టా.! Singapore: సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం: స్మార్ట్ సిటీల రూపకల్పనపై కీలక అధ్యయనం! AshokBabu: ఎమ్మెల్సీల రాజీనామాలపై ఏడాది కాలంగా కుట్ర - అశోక్ బాబు ధ్వజం! Tirumala Laddu Controversy: తిరుమల నెయ్యి కల్తీ వెనుక ఎవరు? ఏకసభ్య కమిషన్ నివేదికపై ఉత్కంఠ! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Iran War: అమెరికాతో ముఖాముఖి చర్చల్లేవు.. ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టీకరణ.. UAE Government: యూఏఈ సంచలన నిర్ణయం: 2028 నాటికి 50% ప్రభుత్వ పనులు ఏఐ వశం! Hikkim Post Office: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోస్టాఫీస్.. ఇక్కడి నుంచి ప్రియమైన వారికి పోస్ట్‌కార్డుల సందడి.!

Kondapalli Srinivas: కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకే వైసీపీ విమర్శలు! మీడియాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్!

Kondapalli Srinivas: విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఓర్వలేకే వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Published : 2026-04-25 14:03:00

విజయనగరంలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్..

కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకే వైసీపీ విమర్శలు..

విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఓర్వలేకే వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

గజపతినగరం నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.230 కోట్లు కేటాయించామని మంత్రి తెలిపారు. ఈ నిధులతో ప్రాంతంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని చెప్పారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏ అభివృద్ధి చేసింది అనే విషయాన్ని ఆ పార్టీ నాయకులు ప్రజలకు చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

తన కుటుంబంపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. రాజకీయ లాభాల కోసం అసత్య ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. హత్యా రాజకీయాలకు వైసీపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని తీవ్ర విమర్శలు చేశారు. తన తండ్రి పాలనాపరమైన అంశాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులపై అనవసర ఆరోపణలు చేయడం దురుద్దేశపూర్వకమని అన్నారు.

ఇక ప్రభుత్వాస్పత్రిలో కొద్దిసేపు విద్యుత్ అంతరాయం ఏర్పడిన ఘటనను పెద్దదిగా చూపిస్తూ రాష్ట్రస్థాయి వార్తగా ప్రచారం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. చిన్న విషయాలను పెద్దగా చూపిస్తూ ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం కంటే, ప్రజలకు నిజాలు చెప్పాలని వైసీపీకి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.

Spotlight

Read More →