PMGSY కింద ఏపీకి రూ.150 కోట్లు! గ్రామీణ సడక్ యోజనలో ముందంజలో ఆంధ్రా!

ఆరోగ్య బీమా పథకాలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పూర్తిగా ఎత్తివేయడం ప్రజల్లో హెల్త్ ఇన్సూరెన్స్‌పై విపరీతమైన చైతన్యం కలిగించింది. ఇప్పటి వరకు పన్ను భారంతో వెనుకంజ వేసిన అనేక మంది ఇప్పుడు బీమా పాలసీల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ నిర్ణయం బీమా రంగానికి ఊపిరి పోసిందని చెప్పాలి. ప్రముఖ ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫాం ‘పాలసీ బజార్’ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, జీఎస్టీ మినహాయింపు తర్వాత కొత్తగా ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునే వారి సంఖ్య 38 శాతం మేర పెరిగింది. ఇది ఈ రంగంలో పెద్ద మార్పుగా భావిస్తున్నారు.

Gold Price Today: పసిడి ధరల్లో ఊరట.. కొనుగోలుదారులకు మంచి అవకాశం! ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి!!

నివేదిక వివరాల ప్రకారం, బీమా తీసుకునే వారి సంఖ్య మాత్రమే కాదు, వారు ఎంచుకుంటున్న కవరేజీ మొత్తం కూడా గణనీయంగా పెరిగింది. గతంలో సగటుగా ప్రజలు రూ.13 లక్షల వరకే బీమా కవరేజీని ఎంచుకునేవారు. కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని సగటున రూ.18 లక్షలకు పెంచుకున్నారు. కొత్తగా బీమా తీసుకునే వారిలో దాదాపు 45 శాతం మంది రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉన్న పాలసీలను ఎంచుకుంటుండగా, 24 శాతం మంది రూ.10-15 లక్షల, 18 శాతం మంది రూ.10 లక్షల లోపు కవరేజీని ఎంచుకుంటున్నారని నివేదిక తెలిపింది. ఈ మార్పు ప్రజల్లో ఆరోగ్య భద్రతపై పెరుగుతున్న అవగాహనకు నిదర్శనం.

ఏపీలో పనిచేస్తున్న ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! 11 ఏళ్ల నిరీక్షణ.. కీలక ఉత్తర్వులు జారీ!

ఇక ఇప్పటికే బీమా పాలసీలు కలిగిన వారు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవడం లేదు. జీఎస్టీ తొలగింపుతో పాలసీల రీన్యువల్ ఖర్చు తగ్గడంతో పాటు, కొత్త అదనపు సదుపాయాలను జోడించుకునే వీలూ వచ్చింది. ఫలితంగా, పాత పాలసీలకు అధిక కవరేజీ జోడించే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా 61 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో 11.5 శాతం మేర అధిక కవరేజీ ఉన్న పాలసీలపై ఆసక్తి పెరిగింది. వృద్ధాప్య దశలో వైద్య ఖర్చులు పెరుగుతాయని గ్రహించి, వారు తమ భవిష్యత్ భద్రతకు మరింతగా సిద్ధమవుతున్నారు.

Reduce Hip Fat Tips: హిప్ ఫ్యాట్ తగ్గించుకోవడం ఎలా? నిపుణుల సూచనలు, చిన్న మార్పులతో పెద్ద ఫలితం!

పాలసీ బజార్ నివేదిక మరో ముఖ్య అంశాన్ని ప్రస్తావించింది. హెల్త్ ఇన్సూరెన్స్‌పై ఆసక్తి కేవలం మెట్రో నగరాల్లోనే కాకుండా, రెండో, మూడో స్థాయి పట్టణాల్లో కూడా గణనీయంగా పెరిగింది. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా అధిక మొత్తంలో కవరేజీ ఉన్న పాలసీలను ఎంచుకుంటున్నారని అధ్యయనం తేల్చింది. ప్రభుత్వ జీఎస్టీ మినహాయింపు నిర్ణయం బీమా రంగానికి కొత్త దిశను చూపించిందని, దీని వలన దేశవ్యాప్తంగా ఆరోగ్య భద్రతపై చైతన్యం మరింతగా పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది.

ఏపీలో ఆ 'కులం' పేరు మార్పు! ప్రభుత్వం వారికి కొత్త సహకార సంఘం ఏర్పాటు.. కొత్త పేరు ఎంతంటే!
Drinking Water: ఈ ఆహార పదార్థాలు తీసుకున్న వెంటనే నీళ్లు తాగుతున్నారా! అయితే జాగ్రత్త...
Railway Development: కేంద్రం మరో తీపి కబురు! ఏపీలో ఆ ఐదు రైల్వే స్టేషన్లకు మహార్దశ... త్వరలో ఆధునిక హోల్డింగ్ జోన్లు!
NRI: తిరిగి అక్కడికి వెళ్లను! అమెరికా ఒత్తిడిని వదిలి ఆసియాలో స్థిరపడ్డ యువకుడు!
Gulf: ఐదేళ్ల నిరీక్షణకు తెర.. శవాన్ని భారత్‌కు తరలించడం సాధ్యం కాదని తెలిపిన ఎంబసీ అధికారులు!
Bhagavad Gita: లౌకిక కార్యాలు కాదు.. ఆత్మజ్ఞానమే అసలైన సిద్ధి... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -48!