Tamil Nadu: విజయ్‌కు గవర్నర్ షాక్.. తమిళనాట నిలిచిన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ! Tamil Nadu: 108 సీట్లతో విజయ్ ప్రభంజనం.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్న నూతన సీఎం! Political Updates: తోపుదుర్తికి పోలీసుల నోటీసులు! తమిళనాట సర్కార్ ఏర్పాటుకు వేళాయే... AP Govt: ఆ జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్.. కడపలో రూ.12 వేల కోట్లతో - తిరుపతిలో రూ.2,500 కోట్లతో! Dwakra womens: డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్: రూ.13,000 కోట్లతో 'ఏపీ మష్రూమ్ మిషన్'.. భారీ సబ్సిడీతో పుట్టగొడుగుల సాగు! Farmers: చెరకు రైతులకు కేంద్రం భారీ ఊరట... క్వింటాల్‌కు రూ.365గా మద్దతు ధర ఖరారు!! SriCity: శ్రీసిటీకి క్యారియర్ కళ: రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఏసీల తయారీ కేంద్రం.. మంత్రి లోకేష్ శంకుస్థాపన! Vangalapudi Anita: రాజకీయ నాయకులకు చుక్కలు.. హెల్మెట్ లేకపోతే డబుల్ ఫైన్ కట్టాల్సిందే! హోంమంత్రి కీలక ఆదేశాలు.. West Bengal: ఓడిపోయినా కుర్చీ వదలని దీదీ.. ఆమెను బయటకు గెంటేయండి! మహేశ్ జెఠ్మలానీ సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్.. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ఎజెండా! Tamil Nadu: విజయ్‌కు గవర్నర్ షాక్.. తమిళనాట నిలిచిన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ! Tamil Nadu: 108 సీట్లతో విజయ్ ప్రభంజనం.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్న నూతన సీఎం! Political Updates: తోపుదుర్తికి పోలీసుల నోటీసులు! తమిళనాట సర్కార్ ఏర్పాటుకు వేళాయే... AP Govt: ఆ జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్.. కడపలో రూ.12 వేల కోట్లతో - తిరుపతిలో రూ.2,500 కోట్లతో! Dwakra womens: డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్: రూ.13,000 కోట్లతో 'ఏపీ మష్రూమ్ మిషన్'.. భారీ సబ్సిడీతో పుట్టగొడుగుల సాగు! Farmers: చెరకు రైతులకు కేంద్రం భారీ ఊరట... క్వింటాల్‌కు రూ.365గా మద్దతు ధర ఖరారు!! SriCity: శ్రీసిటీకి క్యారియర్ కళ: రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఏసీల తయారీ కేంద్రం.. మంత్రి లోకేష్ శంకుస్థాపన! Vangalapudi Anita: రాజకీయ నాయకులకు చుక్కలు.. హెల్మెట్ లేకపోతే డబుల్ ఫైన్ కట్టాల్సిందే! హోంమంత్రి కీలక ఆదేశాలు.. West Bengal: ఓడిపోయినా కుర్చీ వదలని దీదీ.. ఆమెను బయటకు గెంటేయండి! మహేశ్ జెఠ్మలానీ సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్.. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ఎజెండా!

Mahanadu: నెల్లూరు మహానాడుకు సిద్ధం.. కొవ్వూరులో వేదికను పరిశీలించిన మంత్రి ఆనం!

Mahanadu: ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా కొవ్వూరులో మహానాడు వేదికను ఖరారు చేసిన నేపథ్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రాంగణాన్ని పరిశీలించారు.

Published : 2026-05-05 20:56:00

మహానాడు కార్యక్రమంలో జరగబోయేటువంటి స్థలాన్ని ఎంపిక చేయడం పూర్తయింది..

కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి  సభ్యులు వచ్చి స్థలం పరిశీలించి ఫైనల్ చేశారు..

కొవ్వూరు: ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా కొవ్వూరులో మహానాడు వేదికను ఖరారు చేసిన నేపథ్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రాంగణాన్ని పరిశీలించారు.

స్థల పరిశీలన అనంతరం మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ, మహానాడు కోసం అవసరమైన స్థలం ఎంపిక పూర్తైందని తెలిపారు. ఈ స్థలాన్ని ఇప్పటికే కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన సభ్యులు పరిశీలించి ఫైనల్ చేశారని, అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నుంచి కూడా అనుమతి లభించిందని చెప్పారు.

మహానాడు మూడు రోజుల కార్యక్రమాన్ని ఇదే ప్రాంగణంలో నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి వెల్లడించారు. రేపు ఉదయం శుభ ముహూర్తంలో శంకుస్థాపన కార్యక్రమం జరగనుందని తెలిపారు. మహానాడు ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించేందుకు నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి, వక్ఫ్ బోర్డు చైర్మన్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రాంగణాన్ని సందర్శించినట్లు చెప్పారు.

మహానాడుకు సంబంధించిన ప్రణాళిక మొత్తం ఇప్పటికే సిద్ధమైందని మంత్రి ఆనం స్పష్టం చేశారు. ఈ మూడు రోజుల కార్యక్రమంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ మహానాడు ప్రాంగణంలోనే బస చేయనున్నారని తెలిపారు.

తెలుగుదేశం పార్టీ చరిత్రలో 44 ఏళ్లలో తొలిసారిగా నెల్లూరు జిల్లాలో మహానాడు జరగడం విశేషమని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చరిత్రలో నిలిచిపోయేలా మహానాడును ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ మహానాడుతో నెల్లూరు జిల్లా ముఖచిత్రం మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మూడు రోజుల మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి. కొవ్వూరులో ఎంపిక చేసిన ఈ వేదికలో జరిగే మహానాడు జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకురానుందని స్థానిక నాయకులు భావిస్తున్నారు.

Spotlight

Read More →