Differently Abled: మార్కాపురంలో దివ్యాంగులకు ఉచిత త్రీ వీలర్ బైక్‌ల పంపిణీ! Pawan Kalyan: పుష్కర్ ఘాట్ టు కోటిలింగాల ఘాట్.. జలవిహారంలో పవన్: ఏర్పాట్లపై అధికారులతో కీలక సమీక్ష! Gottipati Ravi: అద్దంకిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. డేట్ లీక్ చేసిన స్కూట్ ఎయిర్‌లైన్స్! Joseph Vijay: సీఎం విజయ్‌కు తొలి పరీక్ష.. కోయంబత్తూరులో చిన్నారి కిడ్నాప్, దారుణ హత్య! Prajavedhika: "దిక్కున్న చోట చెప్పుకో".. సొంత అన్నదమ్ములే శత్రువులైతే... రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న భూ వివాదాలు! Chandrababu: ఆగస్టు 15 నుంచి ఏపీవ్యాప్తంగా 'సంజీవని': ఇళ్ల వద్దే 42 రకాల ఉచిత పరీక్షలంటూ సీఎం సంచలన ప్రకటన! Chandrababu: ఏపీలో వైద్య విప్లవానికి సరికొత్త స్కెచ్: చంద్రబాబుతో అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్ కీలక చర్చలు! AP Tourism: ఏపీలో గోవా వైబ్స్.. ఆ బీచ్‌లో రూ. 165 కోట్లతో మెగా టూరిజం ప్రాజెక్ట్! Nara Lokesh: మహానాడు పండుగలా జరపాలి.. అందరం కలిసికట్టుగా పనిచేయాలి! ఈ నెల 27, 28 తేదీల్లో... Differently Abled: మార్కాపురంలో దివ్యాంగులకు ఉచిత త్రీ వీలర్ బైక్‌ల పంపిణీ! Pawan Kalyan: పుష్కర్ ఘాట్ టు కోటిలింగాల ఘాట్.. జలవిహారంలో పవన్: ఏర్పాట్లపై అధికారులతో కీలక సమీక్ష! Gottipati Ravi: అద్దంకిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. డేట్ లీక్ చేసిన స్కూట్ ఎయిర్‌లైన్స్! Joseph Vijay: సీఎం విజయ్‌కు తొలి పరీక్ష.. కోయంబత్తూరులో చిన్నారి కిడ్నాప్, దారుణ హత్య! Prajavedhika: "దిక్కున్న చోట చెప్పుకో".. సొంత అన్నదమ్ములే శత్రువులైతే... రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న భూ వివాదాలు! Chandrababu: ఆగస్టు 15 నుంచి ఏపీవ్యాప్తంగా 'సంజీవని': ఇళ్ల వద్దే 42 రకాల ఉచిత పరీక్షలంటూ సీఎం సంచలన ప్రకటన! Chandrababu: ఏపీలో వైద్య విప్లవానికి సరికొత్త స్కెచ్: చంద్రబాబుతో అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్ కీలక చర్చలు! AP Tourism: ఏపీలో గోవా వైబ్స్.. ఆ బీచ్‌లో రూ. 165 కోట్లతో మెగా టూరిజం ప్రాజెక్ట్! Nara Lokesh: మహానాడు పండుగలా జరపాలి.. అందరం కలిసికట్టుగా పనిచేయాలి! ఈ నెల 27, 28 తేదీల్లో...

Minister Narayana: పరిశుభ్ర మునిసిపాలిటీల లక్ష్యంగా మంత్రి నారాయణ ప్రత్యేక కార్యక్రమం!

Minister Narayana: విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమానికి ఘనంగా శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నాలుగు వారాల పాటు నిర్వహించనున్నారు.

Published : 2026-05-23 10:25:00

రాష్ట్రవ్యాప్తంగా ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’కు శ్రీకారం..

స్వచ్ఛ ఆంధ్ర దిశగా నాలుగు వారాల భారీ పారిశుధ్య యజ్ఞం..

విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమానికి ఘనంగా శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నాలుగు వారాల పాటు నిర్వహించనున్నారు. కార్యక్రమాన్ని మంత్రి నారాయణ బెలూన్లు ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం పారిశుధ్య కార్మికులతో కలిసి స్వయంగా రోడ్లు ఊడ్చి, రోడ్డు డివైడర్లకు పెయింటింగ్ వేయడంతో పాటు మొక్కలు నాటి ప్రజలకు సందేశం ఇచ్చారు. తర్వాత అన్న క్యాంటీన్‌లో సాధారణ ప్రజలతో కలిసి అల్పాహారం తీసుకుని అందరినీ ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ… పరిశుభ్రమైన పట్టణాల నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం చాలా కీలకమని అన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు కలిసివస్తేనే పారిశుధ్య కార్యక్రమాలు విజయవంతమవుతాయని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం ద్వారా ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం పెంచుతున్నామని చెప్పారు.

ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నాలుగు దశల్లో అమలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. మొదటి వారంలో రోడ్లు, ప్రజా ప్రదేశాలను శుభ్రపరచడం, రెండో వారంలో కాలువలను క్లీన్ చేయడం చేపడతామని తెలిపారు. మూడో వారంలో ఇళ్లు, దుకాణాల వద్ద తడి-పొడి చెత్తను వేరు చేసేలా ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. నాలుగో వారంలో పబ్లిక్ టాయిలెట్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు.

గత ప్రభుత్వంపై కూడా మంత్రి విమర్శలు గుప్పించారు. చెత్త పన్ను వేసినా పట్టణాల్లో చెత్త కుప్పలు పేరుకుపోయే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం మునిసిపాలిటీలను డంపింగ్ యార్డ్ రహితంగా మార్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా వ్యర్థాలను విద్యుత్తుగా మార్చే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ప్రతి వర్గానికి చెందిన ప్రజలు పాల్గొని తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. “పరిశుభ్రమైన నగరం… ఆరోగ్యకరమైన సమాజానికి బాట” అని ఆయన పేర్కొన్నారు.

Spotlight

Read More →