సింగరాయకొండ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి డా.స్వామి..
వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులకు పలు సూచనలు చేసిన మంత్రి..
సింగరాయకొండ: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గురువారం సింగరాయకొండలోని డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించారు. వేసవి సెలవులు ప్రారంభమయ్యే ముందు విద్యార్థులతో మాట్లాడి, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
రేపటి నుంచి సెలవులు ఉండటంతో విద్యార్థులు ఎండలో బయట తిరగకూడదని, చెరువులు, కాలువల్లో ఈతకు వెళ్లకుండా సురక్షితంగా ఉండాలని మంత్రి హితవు పలికారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని, తల్లిదండ్రుల సూచనలు తప్పక పాటించాలని విద్యార్థులకు చెప్పారు.
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో కొత్తగా నిర్మించిన మరుగుదొడ్లను మంత్రి పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అలాగే పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ సమయంలో ఉపయోగించే మీటింగ్ హాల్ పరిస్థితిని కూడా పరిశీలించిన మంత్రి… పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేలోపు ఆ హాల్కు అవసరమైన మరమ్మత్తులు పూర్తి చేయాలని ఆదేశించారు.
మంత్రి సందర్శనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. అధికారులు పాఠశాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.