Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్!

Kejriwal: కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు.. కోర్టు ఆగ్రహం!

Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Published : 2026-04-23 18:54:00

అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

కోర్టు నిబంధనలను ఉల్లంఘించి వీడియోలు రికార్డు చేయడంపై విచారణ..

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ కేజ్రీవాల్ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

కోర్టు విచారణకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ముఖ్యంగా కేజ్రీవాల్ వాదనలు ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం కావడం న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందని అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలో ఆ వీడియోలను తక్షణమే సోషల్ మీడియా నుంచి తొలగించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తూ విచారణ సమయంలో వీడియోలు రికార్డు చేయడం, వాటిని బయటకు పంపించడం కూడా గంభీరమైన విషయం అని పేర్కొంది.

ఈ కేసుకు కారణమైన పిటిషన్‌ను న్యాయవాది వైభవ్ సింగ్ దాఖలు చేశారు. కోర్టు అనుమతి లేకుండా విచారణ వీడియోలను రికార్డు చేసి, సోషల్ మీడియాలో పంచుకోవడం ద్వారా న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలని కోర్టును అభ్యర్థించారు. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు, ఈ వ్యవహారంపై కేజ్రీవాల్‌తో పాటు సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు కూడా నోటీసులు జారీ చేసింది.

ఈ కేసులో తదుపరి విచారణలో కేజ్రీవాల్ సమర్పించే వివరణ కీలకంగా మారనుంది. కోర్టు నిబంధనలపై స్పష్టత ఇవ్వడంతో పాటు, న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడే దిశగా హైకోర్టు తీసుకునే నిర్ణయం పై ఆసక్తి నెలకొంది.

Spotlight

Read More →